ఫ్రెంచ్ విప్లవం
ఈ వ్యాసం పూర్తిగానో, పాక్షికంగానో గూగుల్ అనువాద వ్యాసాల ప్రాజెక్టు (2009-2011) ద్వారా గూగుల్ అనువాదఉపకరణాల నాణ్యతను పెంచడంలో భాగంగా కొన్నిపరిమితులతో ఆంగ్ల వికీవ్యాసంనుండి మానవ అనువాదకులు అనువదించారు. అందుచేత ఇందులోని వాక్య నిర్మాణాలు, పదాల ఎంపిక కాస్త కృత్రిమంగా ఉండే అవకాశం ఉంది. అనువాదాన్ని వీలైనంతగా సహజంగా తీర్చిదిద్ది, ఈ మూసను తొలగించి వ్యాసాన్ని వర్గం:గూగుల్ అనువాద వ్యాసాలు-మెరుగుపరచిన వర్గంలో చేర్చండి. |
ఫ్రెంచ్ విప్లవం | |
---|---|
ది స్టార్మింగ్ ఆఫ్ ది బాస్టిల్లే , 14 జులై 1789
|
|
Other names | రీయిన్ ఆఫ్ టెర్రర్, ఫ్రెంచ్ రివల్యూషనరీ వార్ |
Participants | ఫ్రెంచి సమాజం |
Location | ఫ్రాన్స్ |
Date | 1789–1799 |
Result | Abolition and replacement of the French monarchy with a radical democratic republic. Radical social change to forms based on Enlightenment principles of citizenship and inalienable rights. |
ఫ్రెంచ్ విప్లవం (1789–1799) అనేది ఫ్రాన్స్ చరిత్రలో రాజకీయ మరియు సామాజిక ప్రజల తిరుగుబాటు మరియు తీవ్రమైన మార్పు సంభవించిన కాలం, ఫ్రెంచ్ ప్రభుత్వ నిర్మాణ సమయంలో, దీనికి ముందుగా కులీనపాలన మరియు క్యాథలిక్ క్రైస్తవ మతాధికారికి భూస్వామ్య సంబంధిత అసాధారణ అధికారాలతో సంపూర్ణ రాజరికం వలన పౌరసత్వం మరియు బదిలీచేయలేని హక్కులు యొక్క విశదీకరణ సూత్రాల ఆధారంగా సంస్కరించడానికి తీవ్రమైన మార్పులు జరిగాయి.
ఈ మార్పులు హింసాత్మకమైన కోలాహలంతో సంభవించాయి. వీటిని సాధించడానికి చరిత్ర ప్రసిద్ధమైన కాలంలో రాజును విచారించి, శిరచ్ఛేదనను విధించారు, విపరీతమైన రక్తపాతం జరిగింది మరియు ప్రతి ముఖ్య యూరోపియన్ రాజ్యం పాల్గొన్న భారీ యుద్ధం జరిగింది. విప్లవానికి అనులేఖనంగా అనంతర సంఘటనల్లో నెపోలియన్ యుద్ధాలు, రెండు వేర్వేరు రాజరికం యొక్క పునరుద్ధరణలు మరియు ఆధునిక ఫ్రాన్స్ రూపాంతరానికి మరో రెండు విప్లవాలు జరిగాయి.
తదుపరి శతాబ్దంలో, ఫ్రాన్స్ కొంత కాలం గణతంత్ర రాజ్యం, రాజ్యాంగ బద్ధమైన రాజరికం వలె మరియు మరొక సమయంలో రెండు వేర్వేరు సామ్రాజ్యాలుగా పాలించబడింది.
విషయ సూచిక
కారణాలు[మార్చు]
పలు చారిత్రాత్మక నమూనాల యొక్క సంసంజకాలు ప్రకారం విప్లవానికి గల కారణాల్లో పలు వాటిల్లో యాన్సియెన్ రెజిమే కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. ఆర్ధిక సంబంధిత ప్రధాన కారకాల్లో వ్యాధి సంభావ్యత మరియు మరణాలు పెరగడానికి కారణమైన విస్తృత కరువు మరియు పోషకాహారలోపం మరియు విప్లవానికి ముందు నెలలో జనాభాలోని అధిక నిరుపేద భాగాల్లో ఉద్దేశపూర్వక పస్తులు ఉన్నాయి. కరువు యూరోప్ యొక్క ఇతర భాగాలకు కూడా విస్తరించింది మరియు భారీ ఆహార పదార్ధాలకు హీనమైన రవాణా అవస్థాపనచే సహాయం లభించలేదు. (ఇటీవల పరిశోధనలు ద్వారా ఎల్ నినోకు వ్యాపించిన కరువు ప్రభావం ఐస్లాండ్లోని 1783 లాకీ విస్ఫోటనంపై పడటం వలన[1] లేదా లిటిల్ ఐస్ ఏజ్ యొక్క చల్లని వాతావరణ పరిస్ధితుల్లో బంగాళాదుంపను ఒక ప్రధానమైన పంటగా ఎంచుకోవడంలో ఫ్రాన్స్ వైఫల్యం కారణమని కూడా ఆరోపించాయి.)[2]
మరొక నిజమైన కారణం ఏమిటంటే ఫ్రాన్స్ను దివాలా అంచుకు తీసుకురావడానికి లూయిస్ XV పలు యుద్ధాలను చేశాడు మరియు లూయిస్ XVI ప్రభుత్వం యొక్క ప్రమాదకర ఆర్ధిక పరిస్ధితిని పెరిగేలా చేయడానికి అమెరికా విప్లవం సమయంలో వలసదారులకు మద్దతు ఇచ్చాడు. మొత్తం జాతీయ రుణం దాదాపు రెండు బిలియన్ లివ్రేలుకు చేరుకుంది. యుద్ధం కారణంగా ఏర్పడిన సామాజిక భారాల్లో భారీ యుద్ధ రుణం, రాజరికం యొక్క సైనిక వైఫల్యాలు మరియు అసంగత్వంచే ఏర్పడిన అధిక నష్టం మరియు మాజీ యుద్ధ సభ్యులకు సామాజిక సేవల లేకపోవడం వంటివి ఉన్నాయి. అసమర్ధ మరియు కాలదోషం పట్టిన ఆర్ధిక వ్యవస్థ పన్నుల యొక్క పూర్తి కాలదోషం పట్టిన వ్యవస్థ యొక్క భారంచే సంభవించిన మరియు పెరిగిపోయిన జాతీయ రుణాన్ని నిర్వహించలేకపోయింది. మరొక కారణంగా ప్రజాసామాన్యంపై ఆర్ధిక ఇబ్బందులను లెక్కచేయకుండా కొనసాగిన ఉన్నత స్థాయి యొక్క ప్రస్ఫుటమైన వినియోగం, ప్రత్యేకంగా వెర్సైల్లెస్లోని లూయిస్ XVI మరియు మారియే-ఆంటోయినెట్టేల న్యాయస్థానాన్ని చెప్పవచ్చు. అధిక నిరుద్యోగం మరియు అధిక రొట్టె ధరలు కారణంగా ఆహారంపై అధిక ధనాన్ని వెచ్చించి, ఆర్ధిక వ్యవస్థలో ఇతర అంశాలపై తక్కువగా వెచ్చించారు. దేశంలోని భారీ భూస్వామి సంస్థ రోమన్ క్యాథలిక్ చర్చి పంటలపై డైమ్ లేదా టిథే అని పిలిచే ఒక పన్నును విధించింది. రాజరికం యొక్క పన్ను పెరిగినకొద్ది డిమే తీవ్రతను తగ్గించింది, పోషకారలోపంతో రోజువారీ కష్టాలను అనుభవిస్తున్న పేద ప్రజల దురవస్థను మరింత హీనస్థితికి దిగజార్చింది. ఇక్కడ చాలా స్వల్ప అంతర్గత వాణిజ్యానికి, అధిక పన్నుల ఆటంకాలు ఉండేవి.[3]
ఇక్కడ సాంఘిక మరియు రాజకీయ కారకాల్లో పలు కారకాలు వలన విశదీకరణ ఆదర్శాలచే ఉద్భవించిన ఆగ్రహాలు మరియు ప్రబలకాంక్షలపై దృష్టి సారించేందుకు కారణమయ్యాయి. వీటిలో రాజరిక పాప విముక్తి యొక్క ఆగ్రహం; రాజరిక హక్కులపై అత్యాశగల నిపుణులు మరియు కూలీసిపాయి వర్గాలుచే ఆగ్రహం మరియు వీటిలో పలు వర్గాలు ది నెదర్లాండ్స్ మరియు గ్రేట్ బ్రిటన్లలో వాణిజ్య నగరాల్లో వారి సమాన హోదా గల వ్యక్తులతో జీవనాన్ని జీవించడంతో జన జీవనంలో ఆధిక్యం; రాజరికం కలిగి ఉండే సాంప్రదాయిక స్వతంత్ర హక్కులపై రైతులు, కూలీ మనషులు మరియు మధ్యస్థాయి వ్యక్తుల ఆగ్రహం; మతాధికారుల సౌకర్యంపై ఆగ్రహం (మతాధికారుల జోక్యానికి వ్యతిరేకం) మరియు సామాజిక హక్కు కోసం ఆకాంక్షలు, బలహీనమైన గ్రామీణ క్రైస్తవ మతాధికారిచే సమకాలీన క్రైస్తవ మత ప్రధాన గురువుల ఆగ్రహం, క్యాథలిక్ నియంత్రణపై నిరంతర అసహ్యం మరియు వ్యతిరేకాభిప్రాయం తెలిపిన అల్పసంఖ్యాకులచే అన్ని రకాల సంస్థలపై ప్రభావం; స్వేచ్ఛ (ప్రత్యేకంగా విప్లవం ప్రగతి సాధించడానికి) మరియు ఆలోచనా ధోరణి కోసం ఆకాంక్షలు; మరియు ప్రజల యొక్క జనాదరణ పొందిన ప్రతినిధులైన జాక్యూస్ నెక్కెర్ మరియు A.R.J. టుర్గాట్ (ఇతర ఆర్ధిక సలహాదారుల్లో వీరు ఉన్నారు)లను పదవులు నుండి తొలగించినందుకు రాజుపై ఆగ్రహం మొదలైనవి ఉన్నాయి.[4]
చివరిగా, పైన పేర్కొన్న అన్నింటి కంటే ముఖ్యమైన కారణంగా ఇటువంటి సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించడంలో లూయిస్ XVI మరియు అతని సలహదారులు యొక్క సంపూర్ణ వైఫల్యాన్ని చెప్పవచ్చు.[ఆధారం కోరబడింది]
విప్లవానికి ముందు[మార్చు]
ఆర్ధిక విపత్తు[మార్చు]
దేశం మొత్తం దివాలా తీయబోయే సమయంలో మరియు ఖర్చు పెట్టే వ్యయం మొత్తం ఆదాయం కంటే ఎక్కువగా ఉన్న కాలంలో మరియు ఆర్ధిక విపత్తు సమీపంలో లూయిస్ XVI సింహాసనాన్ని అధిరోహించాడు.[5] ఫ్రాన్స్ దేశం ఏడు సంవత్సరాల పాటు యుద్ధంలో పాలుపంచుకోవడం మరియు అమెరికా విప్లవంలో కూడా పాల్గొనటం ఇందుకు కారణాలు.[6] మే నెల 1776 వ సంవత్సరంలో ఆర్ధిక మంత్రి టర్గాట్పై నమ్మకాన్ని కోల్పోయాక, అతనిని తొలగించారు. మరుసటి సంవత్సరం, జాక్వెస్ నెక్కర్ అనే ఒక విదేశీయుడిని నిర్దేశకుడు-ప్రధానమైన ఆర్తికవేత్తగా నియమించారు. అతను సాధారణంగా ఫ్రెంచి పౌరుడు కాలేడు మరియు ఒక ప్రొటెస్టెంట్ మత ఆచారాలు కలవాడు కాబట్టి అతన్ని మంత్రిగా నియమించ లేదు.[7] దేశ పన్ను విధానంలో యెంతో అనవసర భారము పడుతూందని నెక్కర్ గ్రహించాడు;[7] అంతేగాక సంఘంలో పెద్ద మనుషులకు మరియు మతాధికారులకు అనేక రకాల పన్ను మినహాయింపులు ఉన్నాయి.[8] దేశంపై అధిక పన్నులు విధించరాదని మరియు మతాధికారులు మరియు ఉన్నత వర్గాల ప్రజలకు పన్నుల నుండి మినహాయింపు ఇవ్వరాదని అతను వాదించేవాడు అంతేగాక అప్పుగా కొంత ఋణం తెచ్చుకోవడం వలన దేశాదాయ సమస్యలు కొంతమేర పరిష్కారమవుతాయి అని తెలిపాడు.తన దావాలను మద్దతు తెలిపేందుకు నెక్కర్ ఒక నివేదికను ప్రచురించాడు, దీని ప్రకారం సుమారు 36,000 లివర్ల ఆదాయ లోటు ఉందని తెలిపాడు మరియు పార్లమెంట్లకు ఖర్చు చేసే అధికారాలను నిషేధించాలని ప్రతిపాదించాడు. ఈ ప్రతిపాదన రాజు యొక్క మంత్రులకు నచ్చలేదు మరియు నెక్కర్ తన స్థానాన్ని పదిలపరచుకోనేందుకు తనను మంత్రిగా సమ్మతించాలని వాదించేవాడు. ఈ ప్రతిపాదనకు రాజు సమ్మతించలేదు మరియు నెక్కర్ను తొలగించాడు మరియు అలెగ్జాండర్ ది కాలోన్ను నిర్దేశకుడిగా నియమించాడు.[7]
మొదట కాలోన్ ఉదారంగా ఖర్చు చేసేవాడు కానీ క్లిష్టమైన ఆర్ధిక పరిస్థితిని గ్రహించి ఒక కొత్త పన్ను చట్టాన్ని ప్రతిపాదించాడు.[9] స్థిరంగా ఉండే భూమి పన్ను విధానాన్ని ప్రతిపాదించాడు ఇందులో మతాధికారులు మరియు ఉన్నత వర్గాల ప్రజలు కూడా పన్ను కట్టాలి మరియు బూర్బన్ సార్వభౌమత్వం నిరంకుశంగా కొనసాగదని సంకేతంగా ఉన్నత వర్గాల ప్రజలు మే నెల 1789వ సంవత్సరంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొన్నారు.[10]
1789వ సంవత్సరపు ఎస్టేట్స్-జనరల్[మార్చు]
ఎస్టేట్స్-జనరల్ మూడు విభాగాలుగా విభజించ బడ్డాయి: మతాధికారులు, ఉన్నత వర్గాల ప్రజలు మరియు మిగతా ఫ్రాన్స్ దేశం.[11] ఎస్టేట్స్-జనరల్ మూడవ సారి 1614వ సంవత్సరంలో సమావేశమైనప్పుడు ప్రతి ఎస్టేట్కి ఒక ఓటు ఉంటూ మరియు వీటిలో ఏ రెండైనా మూడవదాన్ని రద్దు చేయవచ్చు. ప్రభుత్వం మోసపూరిత చర్యలకు పాల్పడి శాసన సభ ఓట్ల ఫలితాల్లో రిగ్గింగ్కు పాల్పడవచ్చని ప్యారిస్ యొక్క పార్లమెంట్ భయపడింది. 1614వ సంవత్సరం వలె ఎస్టేట్స్ను క్రమపరిచాల్సి ఉంది.[12] స్థానిక అసెంబ్లీలలో 1614 సమావేశపు నియమాలు ఎంతో వ్యత్యాసంగా ఉండేవి ఇందులో ప్రతి అభ్యర్థికి ఒక ఓటు ఉంటూ మరియు మూడవ ఎస్టేట్ అభ్యర్థిత్వం ద్విగుణీకృతం అయ్యింది. ఉదాహరణకు,డాఫైన్ భూభాగంలో దేశీయ అసెంబ్లీ మూడవ ఎస్టేట్ యొక్క అభ్యర్థుల సంఖ్యను ద్విగుణీకృతం చేయడానికి సమ్మతించింది, అభ్యర్థిత్వ ఎన్నికలు నిలిపివేయడం మరియు ప్రతి ఎస్టేట్కి ఒక ఓటు వలె కాకుండా ప్రతి అభ్యర్తికీ ఒక ఓటు ఉండేలా సమ్మతించారు.[13] ముప్పై మంది సభ్యుల కార్యవర్గమైన విశాల భావాలుగల పారిసియన్లు ఎస్టేట్ యొక్క ఓటును వ్యతిరేకించడం మొదలు పెట్టారు. అత్యంత ధనికులు ఉన్న ఈ సమూహం, ఎస్టేట్స్-జనరల్ డాఫైన్ యొక్క వోటింగ్ యంత్రాంగాన్ని తలచుకోవాలని వాదించింది. పూర్వ ప్రమాణాలు సరైనవిగా లేవు ఎందుకంటే "ప్రజలు ఇప్పటికే అధిపతులుగా ఉన్నారు".[14] తరువాత నెక్కర్ రెండవ శాసన సభను ఏర్పాటు చేశాడు, ఇది ద్విగుణీకృత ప్రాతినిధ్య తలంపును 111 నుండి 333 ఓట్లతో తిరస్కరించింది.[14] డిసెంబర్ నెల 27వ తేదీన ఈ ప్రతిపాదనకు చక్రవర్తి అంగీకరించాడు; కానీ ప్రతి ఓటు విలువ యొక్క మంతనాలను ఎస్టేట్స్-జనరల్కే వదిలేశాడు.[15]
ఎన్నికలను 1789వ సంవత్సరం వసంత ఋతువులో నిర్వహించారు; దీనికి అర్హత పొందడానికి 25 సంవత్సరాల వయస్సు ఉండాలి మరియు కనీసం ఆరు లీవర్ల పన్ను కట్టి ఉండాలి. సుమారు 1,201 ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు వీరిలో "291 ఉన్నత వర్గాల వారు, 300 మతాధికారులు మరియు 610 మూడవ ఎస్టేట్ సభ్యులు ఉన్నారు."[15] ప్రతినిధులను మార్గ నిర్దేశకత్వం కోసం "బుక్స్ ఆఫ్ గ్రీవేన్సేస్" (కాహియర్స్ ది డోలియన్సస్ ) సమస్యల పరిష్కారం కోసం కూర్పు చేయబడింది.[11] ఈ పుస్తకాలు కొద్ది నెలలు క్రితమే మౌలిక అభిప్రాయాలను తెలియజేస్తూ వచ్చింది, కానీ అత్యధికులు సాధారణంగా సార్వభౌమత్వ విధానానికి మద్దతు తెలిపారు. చాలా మంది ఎస్టేట్స్-జనరల్ భవిషత్తులో పన్నులను అనుమతిస్తారని ఊహించారు మరియు ఉత్తేజవంతమైన ఆదర్శాలు తారతమ్యంగా చాలా అరుదుగా కనిపిస్తాయి.[12][16] వార్తా మాధ్యమాల పై సెన్సార్షిప్ ఎత్తివేసిన తరువాత విస్తృత భావాలుగల ఉన్నత వర్గాల వారు మరియు మతాధికారుల కరపత్రాలు బాగా వ్యాప్తి చెందాయి.[14] అబ్బే సెయెస్, మూడవ ఎస్టేట్ యొక్క ప్రాముఖ్యతను Qu'est-ce que le tiers état? (మూడవ ఎస్టేట్ అంటే ఏమిటి? ), జనవరి 1789వ సంవత్సరంలో ప్రచురణ అయ్యింది. అతను ఉద్ఘాటించాడు: "మూడవ ఎస్టేట్ అంటే ఏమిటి? సర్వంరాజకీయ అనుశాసనంలో ఇప్పటివరకు దాని స్థితి ఏమిటి? ఏమి లేదు. అది ఏమి కావాలి అనుకుంటుంది? అలాంటివి."[12][17]
ఎస్టేట్స్-జనరల్ వెర్సైల్లెస్లో మే 5వ తేదీన 1789వ సంవత్సరంలో సమావేశపరిచాడు మరియు ఆ సమావేశాన్ని నెక్కర్ మూడు గంటల ప్రసంగంతో ప్రారంభించాడు.మూడవ ఎస్టేట్ యొక్క మౌలిక ప్రణాళిక ఏమిటంటే ఎస్టేట్స్-జనరల్ చేసిన ఎటువంటి నిర్నయాలైనా ప్రత్యేక గదుల్లో తీసుకోకూడదు అన్ని నిర్ణయాలు ఆ మూడు ఎస్టేట్స్ కు చెందిన నియోగులు కలిసి నిర్ణయాలు తీసుకుంటారు (మరోలా చెప్పాలంటే, మూడు ఎస్టేట్స్ లను ఒకే అసెంబ్లీగా ఒకటి చేయడమే దీని ప్రధాన లక్ష్యం). వారి ఎస్టేట్ ప్రతినిధులు అంతర్గతంగా ఆ దస్తావేజులను సరిచూసేకంటే ప్రతినిధుల దస్తావేజులను ఆ ప్రతినిధులందరూ కలిసి సరిచూడాలని గట్టిగా అడిగారు కాని వారి మధ్య రాజకీయ రాయబారం దీన్ని సాధించుటలో విఫలమయ్యింది.[16] సాధారణ ప్రజలు మతాధికారులకు విన్నవించారు ఇందుకు వారు ఎక్కువ సమయం పడుతుందని సమాధానమిచ్చారు. ప్రతి ఎస్టేట్ తమ దస్తావేజులను సరిచూసుకోవాలి మరియు "చక్రవర్తి మధ్యవర్తిగా వ్యవహరించాలి".[18] ఏదేమైనప్పటికీ ఇతర రెండు ఎస్టేట్స్ మధ్య రాజకీయ రాయబారం విఫలమయ్యింది.[19]
జాతీయ చట్టసభ (1789)[మార్చు]
1789వ సంవత్సరంలో జూన్ 10 వ తేదీన మూడవ ఎస్టేట్ ఇప్పుడు కమ్యూన్స్ గా పిలువబడుతూ (ఆంగ్లంలో "కామన్స్") తన సామర్థ్యాలను తనకు తానే సరిచూసుకొని మరియు ఇతర రెండు ఎస్టేట్స్ను ఆహ్వానిస్తుంది కానీ వాటి కోసం ఎదురు చూడవద్దని అబ్బే సేయస్ తెలిపాడు. రెండు రోజుల తరువాత వారు ఈ విధానాన్ని ప్రారంభించి జూన్ 17వ తేదీ కల్లా పూర్తి చేశారు.[20] వారు చాలా స్వేచ్చగా ఓటు వేస్తూ వారిని దేశీయ అసెంబ్లీగా ప్రకటించుకున్నారు మరియు ఈ అసెంబ్లీ ఎస్టేట్స్ కోసం కాక ప్రజల కోసం మాత్రమే అని తెలిపారు. వారు ఇతర సమూహాలను కూడా ఆహ్వానించారు కాని దేశానికి సంబంధించిన ఉద్దేశములు మాత్రం ఇతరులు ఉన్నా లేకున్నా నడిపిస్తామని తెలిపారు.[21]
ఈ విధానాన్ని నియంత్రించేందుకు మరియు ఈ సమావేశాన్ని అడ్డగించేందుకు లూయిస్ XVI శాసన సభ సమావేశమైన సల్లె ది ఏతాట్స్ అనే సమావేశ మందిరాన్ని వడ్రంగులు రెండు రోజుల్లో చక్రవర్తి యొక్క ప్రసంగం కోసం తయారు చెయ్యాలని అందుకే ఆ సమావేశ మందిరాన్ని మూసి వేయాలని ఆజ్ఞాపించాడు. బయటి ప్రదేశాల్లో సమావేశమయ్యేందుకు వాతావరణం అనుకూలించక పోవడంతో వారు దగ్గరలో ఉన్న నిజమైన టెన్నిస్ కోర్టుకు చేరుకున్నారు, అక్కడ వారందరూ కలిసి ఫ్రాన్స్ దేశానికి రాజ్యాంగాన్ని అందించేంత వరకూ కలిసి పని చేస్తామని సమ్మతించి టెన్నిస్ కోర్టు ప్రమాణం (జూన్ 20వ తేదీ 1789వ సంవత్సరం) తీసుకున్నారు. అధిక శాతం మతాధికారుల ప్రతినిధులు మరియు 47 మంది ఉన్నత వర్గాల వారు ఈ సమూహంలో అతి తక్కువ కాలంలోనే చేరారు. జూన్ 27వ తేదీ కల్లా రాజవంశీయుల పార్టీ బహిరంగంగానే తల వంచినా అత్యధిక సైనిక బలగాలను ప్యారిస్ మరియు వెర్సైల్లెస్ చుట్టూ మోహరించింది. ప్యారిస్ మరియు ఇతర ఫ్రెంచి నగరాల నుండి అసెంబ్లీకి మద్దతుగా అత్యధిక స్పందన రావడం మొదలు పెట్టింది.[22]
జాతీయ రాజ్యాంగ సభ (1789–1791)[మార్చు]
బాస్టిల్లే యొక్క ప్రచండం[మార్చు]
ఈ సమయంలో, థర్డ్ ఎస్టేట్ కోసం మద్దతు మరియు మార్గదర్శకానికి నెక్కెర్ ఫ్రెంచ్ న్యాయస్థానం యొక్క పలువురు సభ్యులకు విరోధిగా మారాడు. మారియే అంటోయినెట్టే, రాజు యొక్క తమ్ముడు కోమ్టే డియార్టోయిస్ మరియు రాజు యొక్క రహస్య మండలిలోని ఇతర సంప్రదాయవాది సభ్యులు నెక్కెర్ను రాజు యొక్క ఆర్ధిక సలహాదారు పదవి నుండి తొలగించాలని వాదించారు. 11 జూలై 1789న, నెక్కెర్ నిధులను పదిలం చేయడానికి రాజ్యసంబంధమైన కుటుంబం ఒక ప్రణాళిక ప్రకారం జీవించాలని సూచించాడు, దాంతో రాజు అతన్ని పదవి నుండి తొలగించాడు మరియు అదే సమయంలో ఆర్ధిక మంత్రిత్వ శాఖను పునరుద్ధరించాడు.[23]
పలువురు పారిసియన్లు లూయిస్ యొక్క చర్య సంప్రదాయవాదులచే రాజ్య సంబంధమైన వారిపై తిరుగుబాటుకు ఆరంభంగా భావించారు మరియు తర్వాత రోజు ఈ వార్తను విన్న తర్వాత వారు తిరుగుబాటును ప్రకటించారు. వారు ప్రవేశిస్తున్న సిపాయిలు - స్థానిక ఫ్రెంచ్ సేనలు కంటే ఫ్రెంచ్ సేవ ఆధ్వర్యంలో అధిక విదేశీయులు - జాతీయ రాజ్యాంగ సభను మూసివేయడానికి సన్నిద్ధం అయ్యారని కూడా భయపడ్డారు. వెర్సైల్లెస్లో సమావేశమైన చట్టసభలో మళ్లీ వారి సమావేశ స్థలం నుండి తొలగింపుకు నిరంతర సెషన్లను నిర్వహించారు. త్వరలోనే కొట్లాటలు, గందరగోళాలు మరియు విస్తృత లూటీలతో ప్యారిస్ నాశనమైంది. త్వరలోనే ఆ గుంపుకు ఆయుధాలు మరియు శిక్షణ పొందిన సైనికులతో సహా ఫ్రెంచ్ గార్డ్ మద్దతు లభించింది.
14 జూలైన, తిరుగుబాటుదారులు రాజు నిరంకుశత్వం యొక్క చిహ్నంగా వలె గ్రహించిన బాస్టిల్లే కోటలోని భారీ ఆయుధాలు మరియు మందుగుండు సామగ్రిపై దృష్టి సారించారు. కొన్ని గంటల యుద్ధం తర్వాత, ఆ సాయంత్రం చెరశాల నేలకొరిగింది. కాల్పుల విరమణను ఆజ్ఞాపించడం ద్వారా పరస్పర సామూహిక వధను నిలిపివేసినా లెక్కచేయకుండా, గవర్నర్ మార్క్యూస్ బెర్నార్డ్ డె లౌనేను కొట్టి, శిరచ్ఛేదన చేశారు; అతని శిరస్సును ఈటెకు గ్రుచ్చి, కవాతు చేశారు. కోటలో ఏడుగురు ఖైదీలను (దొంగ సంతకం చేసిన నలుగురు, అనైతిక ప్రవర్తనకు శిక్షించబడిన ఇద్దరు ఉన్నత వంశీయులు మరియు ఒక హంతకుడు) మాత్రమే ఉన్నప్పటికీ, యాన్సియెన్ రెజిమే ఆధ్వర్యంలో అసహ్యించుకున్న ప్రతిదానికి బాస్టిల్లే బలమైన చిహ్నంగా మిగిలిపోయింది. హోటెల్ డె విల్లే (నగర పాలక సంస్థ కార్యాలయం)కు తిరిగి వచ్చిన, ఆ గుంపు ప్రెవోట్ డెస్ మార్చాండెస్ (సాధారణంగా, పురపాలకాధ్యక్షుడు) జాక్యూస్ డె ఫ్లెస్సెల్లెస్ను నమ్మకద్రోహిగా నేరారోపించబడ్డాయి మరియు కాల్చి చంపబడ్డాడు.[24]
రాజు మరియు అతని సైనిక మద్దతుదారులు ఆ సమయానికి విరమించుకున్నారు. ప్యారిస్లో జాతీయ రక్షక దళం యొక్క అధికారాన్ని లా ఫ్యెట్టే తీసుకున్నాడు. సహజీవనవ్యవస్థ గా పిలిచే క్రొత్త ప్రభుత్వ నిర్మాణ ఆధ్వర్యంలో టెన్నిస్ కోర్టు ప్రమాణం సమయంలో చట్టసభ యొక్క అధ్యక్షుడు జీన్-స్లావైన్ బాయిల్లే నగర పురపాలకాధ్యక్షుడు నియమించబడ్డాడు. రాజు ప్యారిస్ను సందర్శించాడు, జూలై 17న అతను Vive la Nation [దేశానికి జిందాబాద్] మరియు Vive le Roi [రాజుకు జిందాబాద్] అని గద్దించడానికి, మూడు రంగుల పతాకాన్ని ఆమోదించాడు.[25]
నెక్కెర్ను మళ్లీ పదవిలో నియమించారు, కాని అతని విజయం ఎంతో కాలం కొనసాగలేదు. సూక్ష్మబుద్ధిగల ఆర్ధిక వేత్త అయినప్పటికీ రాజకీయ నాయకుడుగా తక్కువ సూక్ష్మబుద్ధి గల నెక్కెర్ ఒక సాధారణ క్షమాభిక్షను డిమాండ్ చేసి, దాని పొందడంలో ఎక్కువ శ్రద్ధ వహించడంతో అధిక ప్రజలు యొక్క ఆదరణను కోల్పోయాడు. అతను కూడా కొన్ని ఉపాయాలను ఆలోచించకుండా తాను ఒక్కడే ఫ్రాన్స్ను రక్షించాలని భావించాడు.[ఆధారం కోరబడింది]
రాజు మరియు ప్రజల యొక్క ఈ అభాసప్రాయమైన సమన్వయాన్ని ఉన్నత వంశీయులు నిర్ధారించలేదు. వారు వలసదారులు వలె దేశాన్ని విడిచి వెళ్లడం ప్రారంభించారు, కొంతమంది రాజ్యంలో సామాజిక యుద్ధానికి మరియు ఫ్రాన్స్కు వ్యతిరేకంగా ఒక యూరోపియన్ సంకీర్ణం కోసం ఉద్యమించడానికి దురాలోచన చేయడం ప్రారంభించారు.[ఆధారం కోరబడింది]
జూలై చివరికి, ప్రముఖ సార్వభౌమాధికారం యొక్క తిరుగుబాటు మరియు స్ఫూర్తి ఫ్రాన్స్ అంతటా వ్యాపించింది. గ్రామీణ ప్రాంతాల్లో, పలువురు విజృంభించారు: "la Grande Peur" (ది గ్రేట్ ఫియర్) అని పేరుతో సాగించి ఒక సాధారణ భూసదుపాయానికి చెందిన తిరుగుబాటులో భాగంగా కొంత మంది అధికార దస్తావేజులు మరియు కొన్ని చాటెయూక్స్లను కాల్చి, బూడిద చేశారు. అదనంగా, వెర్సైల్లేస్లో దురాలోచన మరియు ఫ్రాన్స్ రహదారులపై అధిక సంఖ్యలో పురుషుల నిరుద్యోగం ఫలితంగా విశృంఖల పుకార్లు మరియు మానసిక రుగ్మతలకు దారి తీసింది, దీని కారణంగా విస్తృతమైన అశాంతి మరియు సామాజిక గందరగోళం ఏర్పడింది మరియు గ్రేట్ ఫియర్కు దోహదపడింది.[26]
రాజ్యాంగం కోసం కృషి[మార్చు]
4 ఆగస్టు 1789న, జాతీయ రాజ్యాంగ సభ సెకెండ్ ఎస్టేట్ యొక్క నాణాల సుంకం హక్కులు మరియు ఫస్ట్ ఎస్టేట్చే సేకరించబడిన చెల్లింపులు రెండింటినీ తుడిచి వేస్తూ, పెత్తందారీ పద్ధతిని (అప్పటికీ పెత్తందారీ పద్ధతిని దాదాపు నిరూల్మించడానికి తగిన కుటుంబ తిరుగుబాటు ఉన్నప్పటికీ) రద్దు చేసింది, దీన్ని ఆగస్టు ఉత్తరువులుగా పిలుస్తారు. కొన్ని గంటల్లోనే, ఉన్నతి వ్యక్తులు, క్రైస్తవ మతాధికారులు, పట్టణాలు, రాష్ట్రాలు, సంస్థలు మరియు నగరాలు వాటి ప్రత్యేక హక్కులను కోల్పోయాయి.
యునైటెడ్ స్టేట్స్ యొక్క స్వతంత్ర ప్రకటనను నమూనాగా చేసుకుని, చట్టసభ 26 ఆగస్టు 1789న పురుషులు మరియు పౌరుల యొక్క హక్కుల ప్రకటనను ప్రచురించింది. U.S. ప్రకటన వలె, ఇది చట్టబద్ధమైన ప్రభావంతో ఒక రాజ్యాంగం కాకుండా సూత్రాల యొక్క నివేదికను కలిగి ఉంది. జాతీయ రాజ్యాంగ సభ, ఒక శాసనసభ వలె నిర్వహించబడటమే కాకుండా, క్రొత్త రాజ్యాంగ చిత్తుప్రతికి ఒక విభాగంగా కూడా అమలు చేయబడింది.
వ్యక్తుల నియమాకానికి రాజుచే నియమించబడిన సభ్యులతో ఒక పాలకసభ కోసం వాదించిన నెక్కెర్, మౌనెయిర్, లాలీ-టోలెండల్ మరియు ఇతరులు విఫలమయ్యారు. ఉన్నత వంశస్థులచే ఎన్నుకోబడే ఒక ఉన్నత వంశీయుల ఎగువ సభ కోసం పలువురు ఉన్నత వంశీయులు వాదించారు. ఆ రోజున ప్రముఖ పార్టీ విజయవంతమైంది: ఫ్రాన్స్ ఒక ఏకైక చట్టసభను కలిగి ఉండాలని పేర్కొంది. రాజును "అనుమాన నిషేధం"గా మాత్రమే ఉంచారు; అతను చట్టం అమలును తాత్కాలికంగా ఆపు చేయగలడు కాని దాని నిరోధించలేడు. చట్టసభ చివరిగా చారిత్రాత్మక పట్టణాలను సమానంగా పరిపాలించే మరియు దాదాపు సమాన ప్రాంతాల వారితో మరియు జనాభాతో 83 విభాగాలు గా మార్చింది.
నిజానికి 1789 చివరిలో, ఒక ఆర్థిక సంక్షోభం గురించి చర్చించడానికి సమావేశమైనప్పటికీ, చట్టసభ ఇతర విషయాలపై దృష్టి సారించి, లోటును మరింత తీవ్రతరం మాత్రమే చేశారు. ఇప్పుడు హోనోరే మిరాబెయీ ఈ విషయాన్ని చర్చించడానికి పూనుకున్నాడు మరియు చట్టసభ నెక్కెర్కు సంపూర్ణ ఆర్థిక నియంతృత్వాన్ని ఇచ్చింది.
వెర్సైల్లెస్లో మహిళల పాదయాత్ర[మార్చు]
రాజు యొక్క అంగరక్షకులచే 1 అక్టోబర్ 1789 ఒక సమాదరణ ఉత్సవంలో జాతీయ తురాయి కాలికింద తొక్కబడినట్లు వచ్చిన పుకార్లు కారణంగా రగిలిపోయి, మహిళలు గుంపులు గుంపులగా 5 అక్టోబర్ 1789న పారిసియన్ మార్కెట్లకు చేరుకోవడం ప్రారంభించారు.ముందుగా మహిళలు హోటెల్ డె విల్లేకు పాదయాత్రగా వెళ్లి, వారి ఆందోళనలకు సమాధానం ఇవ్వవలసినదిగా నగర అధికారులను కోరారు.[27] మహిళలు వారు అనుభవిస్తున్న ప్రత్యేకంగా రొట్టె కొరత వంటి గడ్డు ఆర్ధిక పరిస్థితులకు ప్రతిస్పందించారు. వారు జాతీయ చట్టసభను నిరోధించడానికి రాజ్యసంబంధమైన ప్రయత్నాలకు ముగింపు పలకాలని మరియు విస్తృత దారిద్ర్యానికి బాధ్యత వహిస్తూ రాజు మరియు అతని పరిపాలనా బృందం మంచిని కోరుకుంటూ ప్యారిస్కు వెళ్లిపోవాలని కూడా కోరారు.
నగర అధికారులు నుండి అసంతృప్తి ప్రతిస్పందనలను పొందడంతో వెర్సైల్లెస్కు పాదయాత్రలో ఫిరంగి భాగాలు మరియు పలు చిన్న ఆయుధాలతో దాదాపు 7,000 మంది మహిళలు కలిసికట్టుగా పాల్గొన్నారు. లా ఫ్యాయెట్టే ఆధ్వర్యంలో 20 వేల మంది జాతీయ అంగరక్షకులు వారిని అదుపులో ఉంచడానికి ప్రయత్నించారు మరియు ఆ గుంపులోని సభ్యులు పలువురు అంగరక్షకులను చంపేసి, ప్యాలెస్ను నాశనం చేశారు.[28] లా ఫ్యాయెట్టే ఆ సమూహ కోరిక ప్రకారం రాచరికాన్ని ప్యారిస్కి తరలించడానికి ఎట్టకేలకు రాజును ఒప్పించాడు.
6 అక్టోబర్ 1789న, రాజు మరియు రాజ్య సంబంధిత కుటుంబం జాతీయ అంగరక్షకుల రక్షణలో వెర్సైల్లేస్ నుండి ప్యారిస్కు తరిలి వెళ్లిపోయారు, దానితో జాతీయ చట్టసభకు చట్టబద్ధత లభించింది.
విప్లవం మరియు చర్చి[మార్చు]
ఈ విప్లవం రోమన్ క్యాథలిక్ చర్చి నుండి పలు అధికారాలను రాష్ట్రానికి తరలించింది. యాన్సైన్ రెజిమే ఆధ్వర్యంలో, దేశంలో చర్చి భారీ భూస్వామిగా ఉండేది. పంటలపై dîme అని పిలవబడే ఒక పన్నును విధించినందుకు చర్చి యొక్క అధికారాన్ని 1790లో రద్దు చేసిన శాసన సభ, క్రైస్తవ మతాధికారి ప్రత్యేక హక్కులను రద్దు చేసింది మరియు చర్చి ఆస్తిని జప్తు చేసింది.అతి తక్కువ కాలంలోనే, దేశంలోని ఆర్ధిక సంక్షోభాన్ని చట్టసభ స్వాధీనం చేసుకున్న చర్చి (చర్చి యొక్క వ్యయాలను తీసుకోవడం ద్వారా) యొక్క ఆస్తితో 2 డిసెంబర్ 1789న చట్టబద్ధంగా సర్దుబాటు చేసింది. ఇటువంటి భారీ ఆస్తి మొత్తాన్ని త్వరగా చెలామణిలోకి తేవడానికి, ప్రభుత్వం వశపరచుకున్న చర్చి భూములు మద్దతుతో యాసైనాట్లు అనే ఒక క్రొత్త కాగితపు కరెన్సీని విడుదల చేసింది. తదుపరి శాసన సభ 13 ఫిబ్రవరి 1790న సన్యాసుల ప్రమాణాలను రద్దు చేసింది. క్రైస్తవ మతాధికారి యొక్క సామాజిక రాజ్యాంగం 12 జూలై 1790న తరలించబడింది (26 డిసెంబర్ 1790 వరకు రాజు సంతకం చేయనప్పటికీ), మిగిలిన క్రైస్తవ మతాధికారులను రాష్ట్రం యొక్క ఉద్యోగులుగా నియమించబడ్డారు మరియు వారు రాజ్యాంగానికి విశ్వాసపాత్రతో ఉంటామని ప్రమాణం చేయాలి, దీనికి తార్కిక నిర్ధారణగా ఫ్రాన్స్లోని క్యాథలిక్ చర్చిను రాష్ట్రం యొక్క ఒక విభాగంగా చేయడానికి క్రైస్తవ మతాధికారుల రాష్ట్ర ఉద్యోగులు గాలికానిజమ్ను తీసుకున్నారు.
ఈ రాజ్యాంగానికి స్పందనగా, ఐక్స్ యొక్క క్రైస్తవ మత ప్రధాన గురువు మరియు క్లెర్మోంట్ యొక్క క్రైస్తవ మత ప్రధాన గురువు ప్రాన్సోయిస్ డె బోనాల్లు నేతృత్వంలో క్రైస్తవ మతాధికారులు జాతీయ రాజ్యాంగం సభ నుండి నిష్క్రమించారు. పోప్ పియుస్ VI క్రొత్త అమరికను అసలు అంగీకరించలేదు మరియు ఇది ఆ మతాధికారుల్లో అంతఃకలహానికి దారి తీసింది. అంటే కొంతమంది అవసరమైన ప్రమాణాన్ని చేసి, క్రొత్త అమరికను అంగీకరించారు ("పంచాయతీ సభ్యుడు" లేదా "రాజ్యాంగ క్రైస్తవ మతాధికారి") మరియు మరి కొంత మంది అంగీకరించకుండా "పంచాయతీ సభ్యుడి కాని" లేదా "అవిధేయమైన మత గురువులుగా" విడిపోయారు. తదుపరి సంవత్సరాల్లో ఫ్రాన్స్లోని మత గురువులను బంధించడం మరియు సామూహిక వధలతో సహా క్రైస్తవ మతాధికారులపై హింసాత్మక నిర్బంధకాండ జరిగింది. నెపోలీయన్ మరియు చర్చి మధ్య 1801లోని ఒప్పందం డీక్రైస్టినైజేషన్ కాలాన్ని అంతం చేసింది మరియు 11 డిసెంబర్ 1905లో రాష్ట్రం నుండి చర్చిను వేరు చేయడం ద్వారా తృతీయ గణతంత్ర రాజ్యంచే రద్దు చేయబడే వరకు, క్యాథలిక్ చర్చి మరియు ఫ్రెంచ్ రాష్ట్రం మధ్య సంబంధానికి నియమాలు నిర్ణయించబడ్డాయి.
వర్గాలు యొక్క ప్రదర్శన రీతి[మార్చు]
చట్టసభలోని వర్గాలు స్పష్టం కావడం ప్రారంభమైంది. ఉన్నత వంశస్థుడు జాక్యూస్ ఆంటోనే మారియే డె కాజాలెస్ మరియు క్రైస్తవ మతాధికారి జీన్-సిఫ్రెయిన్ మౌరే ఆధ్వర్యంలో విప్లవానికి వ్యతిరేకంగా రైట్ వింగ్గా (ఈ వర్గం చట్టసభ యొక్క కుడి వైపు ఉంటుంది) పిలవబడే వర్గాన్ని ప్రారంభించారు. ఫ్రాన్స్ను బ్రిటీష్ రాజ్యాంగ నమూనా వలె అదే దారిలో నిర్వహించడాన్ని నెక్కెర్ అనుబంధంతో "రాచరిక ప్రజాస్వామ్యవాదులు" లేదా రాజులు ఆమోదించారు; వారు జీన్ జోసెఫ్ మౌనైయిర్, కోమ్టే డె-టోలెండాల్, కామ్టే డే లాలే-టోన్నెర్రె మరియు పైర్రే విక్టర్ మాలౌయెట్, కామ్టే డె విరైయిలను కూడా చేర్చుకున్నారు.
చట్ట సభ యొక్క కేంద్రాన్ని లేదా ఎడమ కేంద్రాన్ని సూచించే "నేషనల్ పార్టీ"లో హోనోరే మిరాబెయు, లా ఫ్యాయెట్టే మరియు బైల్లే; అడ్రియెన్ డ్యూపోర్ట్, బార్నావే మరియు అలెగ్జాండ్రే లామెత్లు మరింత తీవ్రమైన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వామపక్షంలో అతని మౌలిక వాదంలో దాదాపు ఏకైక వ్యక్తి అర్రాస్ న్యాయవాది మాక్సిమిలైన్ రాబెస్పియెర్రే మాత్రమే ఉన్నాడు. ఈ కాలంలో అబ్బె సియెస్ ఆధ్వర్యంలో శాసన సభ ప్రతిపాదనను సాగింది మరియు కొన్నిసార్లు రాజకీయ కేంద్రం మరియు వామపక్షం మధ్య విజయవంతంగా నకిలీ చేశాడు. ప్యారిస్లో పలు సంఘాలు, పురపాలకాధ్యక్షుడు, ప్రతినిధుల చట్టసభ మరియు జిల్లాలలో ప్రతిఒక్కటి స్వతంత్ర అధికార హక్కును పొందాయి. లా ఫ్యాయెట్టే ఆధ్వర్యంలో అభివృద్ధి చెందుతున్న మధ్య తరగతి జాతీయ అంగరక్షకులు కూడా ఇతర స్వీయ-ఉత్పాదక చట్టసభలు వలె దాని స్వంత హక్కులో ఒక శక్తిగా ఉద్భవించింది.
కుట్ర మరియు మౌలిక వాదం[మార్చు]
చట్టసభ కవచ ఆకృతులు, నిర్దిష్ట సంస్థకు చెందిన వస్తువులు, మొదలైన యాన్సియెన్ రెజిమే చిహ్న సామగ్రిని రద్దు చేసింది, ఇంకా మరిన్ని సంప్రదాయవాది వస్తువులను పరాధీనం చేశారు మరియు వాటిని వలసదారుల కు హోదాలకు జోడించారు. 14 జూలై 1790న మరియు దాని తరువాత పలు రోజులు చాంప్ డే మార్స్లోని సమూహాలు పెటె డె లా ఫెడెరేషన్ తో బాస్టిల్లే పతనం యొక్క వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు; టాలేరాండ్ ముఖ్యాంశాన్ని ప్రదర్శించాడు; పాల్గొన్నవారు "దేశానికి, న్యాయానికి మరియు రాజుకు విశ్వాసంగా ఉంటామని" ఒక ప్రమాణాన్ని చేశారు మరియు రాజు మరియు రాజ్యసంబంధిత కుటుంబం ఆనందంతో పాల్గొన్నారు.[29]
ఓటర్లు యదార్థంగా ఒక సంవత్సర కాలం పని చేయడానికి ఎస్టేట్స్-జనరల్ యొక్క సభ్యులను ఎంచుకున్నారు. అయితే, టెన్నిస్ కోర్టు ప్రమాణం యొక్క నియమాల ప్రకారం, ఫ్రాన్స్ ఒక రాజ్యాంగాన్ని పొందే వరకు తరచుగా కలవడానికి సహజీవన వ్యవస్థ లు తమకుతామే హద్దులను విధించుకున్నాయి. రైట్-వింగ్ సభ్యులు ఒక నూతన ఎన్నికలు కోసం వాదించారు కాని మిరాబెయూ చట్టసభ యొక్క స్థితి ప్రాథమికంగా మారిపోయిందని, రాజ్యాంగం పూర్తయ్యే ముందు ఎటువంటి నూతన ఎన్నికలు జరగవని నొక్కి చెప్పాడు.[ఆధారం కోరబడింది]
1970 చివరిలో, పలు చిన్న ప్రతి-విప్లవాత్మక ఉద్యమాలు ప్రారంభమై, విప్లవానికి వ్యతిరేకంగా సైనిక దళం మొత్తాన్ని లేదా భాగాన్ని మార్చడానికి ప్రయత్నాలు జరిగాయి. వీరు ఒకే విధంగా విఫలమయ్యారు. రాజ్య సంబంధిత న్యాయస్థానం "ప్రతీ ప్రతి విప్లవాత్మక సంస్థను ప్రోత్సహించాయి మరియు దేనిని ప్రకటించలేదు."[30]
సైన్యంలో అంతర్గతంగా భారీ ఎత్తులో ఆందోళనలను జరిగాయి: జనరల్ బోయిల్లే ఒక చిన్న తిరుగుబాటు దళాన్ని విజయవంతంగా స్థాపించాడు, దీనితో ప్రతి-విప్లవాత్మక సానుభూతిని పొందిన అతని ఖ్యాతి పెరిగింది. సీనియారిటీ ఆధారంగా పదోన్నతి ఉండే మరియు సామర్ధ్యాన్ని (కులీనత కాకుండా) ప్రదర్శించే క్రొత్త సైనిక కోడ్ను ఇప్పటికే ఉన్న కొంత మంది అధికార పటాలాన్ని పరాధీనం చేశారు, వీరు వలసదారుల హోదాను పొందారు లేదా దానిలో ప్రతి-విప్లవకారులుగా మారిపోయారు.[ఆధారం కోరబడింది]
ఈ కాలంలో ఫ్రెంచ్ రాజకీయాల్లో రాజకీయ "క్లబ్లు" అధికంగా వృద్ధి చెందాయి, వీటిలో మొదటిది జాకోబిన్ క్లబ్; 10 ఆగస్టు 1790 నాటికి 152 క్లబ్లు జాకోబిన్స్తో అనుబంధాన్ని ఏర్పర్చుకున్నాయి.[31] దీనితో జాకోబిన్స్ విస్తృత జనాదరణ పొందిన సంస్థగా పేరు గాంచింది, దీని కొంత మంది స్థాపకులు క్లబ్ ఆఫ్ '89ను స్థాపించడానికి దీన్ని విడిచిపెట్టారు. రాజు వంశీయులు ముందుగా స్వల్ప కాలిక క్లబ్ డెస్ ఇంపార్టియాక్స్ ను, తర్వాత క్లబ్ మోనార్చిక్యూ ను స్థాపించారు. తుదుపరి దానిలో రొట్టెలు పంచిపెట్టడం ద్వారా ప్రజల ఆదరణ పొందడానికి చేసిన ప్రయత్నం విఫలమైంది. అయితే, వారు తరచూ నిరసనకారులు మరియు కొట్లాట్ల లక్ష్యాలుగా మారారు మరియు ప్యారిస్ పురపాలక అధికారులు చివరికి జనవరి 1791న క్లబ్ మోనార్చిక్యూను మూసివేశారు.[ఆధారం కోరబడింది]
ఈ కుతంత్రాల్లో, చట్టసభ ఒక రాజ్యాంగాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని కొనసాగించింది. క్రొత్త న్యాయ సంబంధిత సంస్థ న్యాయాధిపతులందరినీ తాత్కాలికం చేసింది మరియు స్వతంత్ర హక్కులు ఇచ్చింది. రాజకీయ నాయకులు రాజ్య సంబంధిత వాటికి మినహా వంశానుగత కార్యాలయాలను రద్దు చేశారు. నేర సంబంధిత వ్యాజ్యాల్లో న్యాయ నిర్ణయ పరిశీలనలను ప్రారంభించారు. యుద్ధాన్ని ప్రకటించడానికి ప్రత్యేక అధికారాన్ని రాజు కలిగి ఉంటాడు, తర్వాత శాసన సభతో చర్చించి యుద్ధాన్ని నిర్ధారించాలి. చట్టసభ అన్ని అంతర్గత వాణిజ్య ఆటంకాలను రద్దు చేసింది మరియు వృత్తికార సంఘాలు, స్థానాలు మరియు కార్మికుల సంస్థలను నిరోధించింది: ఒక లైసెన్స్ను కొనుగోలు చేయడం ద్వారా ఎవరైనా ఒక వాణిజ్యాన్ని ప్రారంభించడానికి హక్కు సంపాదించవచ్చు; సమ్మెలను చట్టవిరుద్ధంగా నిర్ణయించారు.[32]
1791లోని శీతాకాలంలో, చట్ట సభ మొదటిసారిగా వలసదారుల కు వ్యతిరేకంగా చట్టాలను పరిశీలించింది. ఆ చర్చలో వలస వెళ్లడానికి వ్యక్తిగత స్వేచ్ఛ నిరోధకాన్ని రాష్ట్రం యొక్క భద్రత గురించి జాలి పడ్డారు. ఈ రోజున ఆ చర్చలో ఈ కొలతకు వ్యతిరేకంగా మిరాబేయి "డ్రాకో కోడ్లో ఉండటం యొక్క సౌలభ్యం" వలె వాదించాడు.[30] కాని 2 ఏప్రిల్ 1791న మిరాబేయి మరిణించాడు మరియు సంవత్సరం ముగియక ముందే క్రొత్త శాసన సంబంధిత చట్టసభ ఈ "డ్రాకోనియన్" అంచనా ప్రారంభించింది.[33]
వారెన్నెస్కు రాచరిక యానం[మార్చు]
లూయిస్ XVI విప్లవం యొక్క నడతను వ్యతిరేకించాడు కాని యూరోప్ యొక్క ఇతర రాచరిక సభ్యుల వంచనపూరిత మద్దతును తిరస్కరించాడు, ఇతను వలస మరియు చట్ట సభను ఖండించిన జనరల్ బౌయిల్లేతో సన్నిహితంగా మెలిగాడు మరియు అతనికి సురక్షిత స్థలాన్ని మరియు మోంట్మేడ్లోని అతని ఉద్యమంలో మద్దతును ఇస్తానని వాగ్దానం చేశాడు. 20 జూన్ 1791 రోజు రాత్రి, రాచరిక కుటుంబం సేవకులు వలె దుస్తులు ధరించగా, వారి సేవకులు రాజ దుస్తులను ధరించి టుయిలెరైస్కు తరలి వెళ్లారు.
అయితే, తర్వాత రోజు 21 జూన్ సాయంత్రం వారెన్నెస్లో (మెయీజ్ విభాగంలో) రాజును గుర్తించబడి, ఖైదీ చేయబడ్డాడు. అతను మరియు అతని కుటుంబాన్ని సేవకులు దుస్తుల్లోనే అంగరక్షకుల భద్రతతో ప్యారిస్కు తిరిగి పంపించారు. చట్టసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న పెటియాన్, లాటౌర్-మౌబోర్గ్ మరియు ఆంటోయినే పైర్రే జోషఫ్ మారియే బార్నావేలు ఎపెర్నేలో రాచ కుటుంబాన్ని కలిసి, వారితో తిరిగి వెళ్లారు. ఆ సమయం నుండి, బార్నేవ్ సలహాదారుడుగా మరియు రాచ కుటుంబానికి మద్దతుదారుగా నియమించబడ్డాడు. వారు ప్యారిస్కు చేరుకున్నప్పుడు, గుంపు మౌనంగా ఉండిపోయింది. చట్టసభ తాత్కాలికంగా రాజును తొలగించింది. అతను మరియు రాణి మారియే ఆంటోయినేట్టే అంగరక్షకులు సంరక్షణలో మిగిలిపోయారు.[34][35][36][37][38]
రాజ్యాంగాన్ని పూర్తి చేయడం[మార్చు]
అప్పటికీ చట్టసభలో ఎక్కువ శాతం గణతంత్ర రాజ్యానికి కాకుండా ఒక రాజ్యాంగ పరమైన రాచరికానికే ఆదరంగా వ్యక్తమయ్యాయి, లూయిస్ XVIను నామమాత్ర వ్యక్తి వలె ఉంచి వేర్వేరు సమూహాలు ఒక ఒప్పందాన్ని చేసుకున్నాయి: అతనిచే బలవంతంగా రాజ్యాంగానికి ప్రమాణం చేయించాయి మరియు ఆ ప్రమాణాన్ని వెనక్కి తీసుకుని, దేశం కోసం యుధ్దం చేయడానికి సైన్యాన్ని పురిగొల్పుడం లేదా అతని పేరుపై వేరే ఎవరైనా చేయడానికి అనుమతిస్తే, దానికి వాస్తవిక పరిత్యాగాన్ని మూల్యంగా చెల్లించాలని ఒక ఉత్తరువును జారీ చేశారు.[ఆధారం కోరబడింది]
అతని పయనం నుండి దేశం దృష్టిలో లూయిస్ XVI అధికారం నుండి తొలగించబడ్డాడని నొక్కి చెబుతూ జాక్యూస్ పైర్రే బ్రిస్సాట్ ఒక ఆర్జీ పెట్టుకున్నాడు. ఈ ఆర్జీలో సంతకం చేయడానికి ఒక అపరిమిత సంఖ్యలో ప్రజలు చాంప్ డే మార్స్కు చేరుకున్నారు. జార్జెస్ డాంటోన్ మరియు కామిల్లే దేశ్మౌలిన్స్లు ఆవేశపూరిత ప్రసంగాలు చేశారు. "ప్రజా నియంత్రణను రక్షించమని" పురపాలక అధికారులకు చట్టసభ ఆజ్ఞాపించింది. లా ఫ్యాయెట్టే ఆధ్వర్యంలో దేశీయ అంగరక్షకులు సమూహాన్ని ప్రతిఘటించారు. సైనికులు జనాలపైకి రాళ్లను విసిరి, వారిపై దాడి చేశారు, ఈ దాడిలో 13 నుండి 50 మంది వ్యక్తులు ప్రాణాలను కోల్పోయారు.[39]
ఈ ఊచకోతకు జాగ్రతలో భాగంగా అధికారులు పలు మాతృదేశాభిమానం గల క్లబ్లను అలాగే జీన్-పాల్ మారాట్ యొక్క L'Ami du Peuple వంటి ప్రాతిపదిక వార్తాపత్రికలను మూసివేసారు. డాంటన్ ఇంగ్లండ్కు చేరుకున్నాడు; డెస్పమౌలిన్స్ మరియు మారాట్ దాగి ఉండిపోయారు.[ఆధారం కోరబడింది]
ఈ సమయంలో, విదేశం నుండి కొత్త బెదిరింపు అందింది: హోలీ రోమన్ ఎంపెరర్ లియోపోల్డ్ II, ప్రుసియా యొక్క ఫ్రెడెరిక్ విలియమ్ II, మరియు రాజు యొక్క సోదరుడు చార్లెస్-ఫిల్లిప్పే, కాంమ్టే డియార్టోయిస్లు డిక్లరేషన్ ఆఫ్ పిల్ల్నిట్జ్ను జారీ చేశారు, దీనికి కారణం లూయిస్ XVI జరిగిన అవమానమని పేర్కొని, అతని నిరవధిక స్వేచ్ఛను డిమాండ్ చేశారు మరియు ఈ నిబంధనలకు విప్లవ అధికారులు అంగీకరించనట్లయితే అతని తరపున ఫ్రాన్స్ను ముట్టిడిస్తామని సూచించారు.[40] ఫ్రెంచ్ ప్రజలు విదేశీ రాజులు యొక్క ఆజ్ఞలను ఏ మాత్రం ఖాతరు చేయలేదు మరియు ఆ బెదిరింపు సరిహద్దులలో సైనీకకరణకు దోహదపడింది.[ఆధారం కోరబడింది]
అతను "వారెన్నెస్కు వెళ్లడానికి" ముందు, శాసన సభ నుండి వారినివారే తొలగించకున్నట్లయితే, ఆ చర్య వారికి శాసన చట్టసభను గెల్చుకుంటుందని శాసన సభ సభ్యులు గుర్తించారు. ఇప్పుడు వారు కలిగి ఉన్న పలు రాజ్యాంగ చట్టాలను సేకరించి, ఏకైక రాజ్యాంగంగా జారీ చేశారు, దీన్ని భారీ సవరణలకు ఒక సందర్భంగా ఉపయోగించకూడదని ఎంచుకోవడంలో గమనించదగ్గ పట్టుదలను కనబరిచారు మరియు దాన్ని ఇటీవల పునరుద్ధరించబడిన లూయిస్ XVIకు సమర్పించారు, దాన్ని అతను అంగీకరించి, ఇలా పేర్కొన్నాడు "విదేశాలు నుండి అన్ని దాడులు నుండి దీన్ని రక్షించడానికి మరియు నా పరిష్కారం ఆధారంగా ఉంచబడిన దీన్ని ఎలాంటి పరిస్థితుల్లోనైనా అమలు చేయడానికి, నేను ఇంటి నుండి నిర్వహించడానికి నిర్ణయించుకున్నాను". రాజు శాసనసభలో ఉపన్యసించాడు మరియు సభ్యులు మరియు ప్రేక్షకుల నుండి ఉత్సాహభరితమైన ప్రశంసలను పొందాడు. శాసనసభ యొక్క ముగింపు వ్యవధిని 29 సెప్టెంబర్ 1791గా నిర్ణయించబడింది.[ఆధారం కోరబడింది]
మిగ్నెట్ ఈ విధంగా వాదించాడు "1791 యొక్క రాజ్యాంగం... అనేది మధ్యతరగతి వాళ్ల శ్రమగా చెప్పవచ్చు, అందుకే పటిష్టమైనది; అందరికీ తెలిసినట్లు, ఎల్లప్పుడూ ప్రబలమైన శక్తి సంస్థలను కైవసం చేసుకుంటుంది... ఈ రాజ్యాంగంలో, అన్ని శక్తులకు ప్రజలే ప్రధాన మూలంగా ఉన్నారు, కాని దీని వినియోగం దేన్నీ సాధించలేదు."[41]
శాసన సభ (1791–1792)[మార్చు]
రాజ్యాంగ రాచరికం యొక్క వైఫల్యం[మార్చు]
1791 యొక్క రాజ్యాంగం ఆధ్వర్యంలో, ఫ్రాన్స్ రాజ్యాంగ రాచరికం వలె అమలు అయ్యి ఉండేది. రాజు తన అధికారాన్ని ఎన్నికైన రాజ్యాంగ శాసన సభతో పంచుకోవాలి, కాని అతనికి అతని రాచరిక వీటో మరియు మంత్రులను ఎన్నుకునే అధికారం ఉంటుంది. రాజ్యాంగ శాసన సభ మొదటిగా 1 అక్టోబర్ 1791న సమావేశమైంది మరియు ఒక సంవత్సరం కంటే తక్కువ సమయంలోనే గందరగోళాలతో దిగజారిపోయింది. 1911 ఎన్సైక్లోపీడియా బ్రిటానికా యొక్క పదాల్లో: "పరిపాలన ప్రయత్నంలో, శాసన సభ మొత్తంగా విఫలమైంది. ఇది ఒక ఖాళీ ఖజానా, క్రమశిక్షణారహిత సైన్యం మరియు నౌకాదళం మరియు భద్రత కోసం భ్రష్టపడిన ప్రజలు మరియు విజయవంతమైన కొట్లాట్లలను మిగిల్చింది."[42] రాజ్యాంగ శాసన సభ మితవాదులుగా 165 ఫెయిల్లాంట్లు (రాజ్యాంగ రాజులు) మరియు వామపక్షంలో 330 గిరోండిస్ట్లు (ఉదార రిపబ్లికన్స్) మరియు జాకోబిన్లు (తీవ్రమైన విప్లవకారులు) మరియు ఏ విభాగంతో అనుబంధం లేని 250 ప్రతినిధులు కలిగి ఉంది. ప్రారంభంలో, వలసదారుల ను చంపుతాయని బెదిరించినందుకు గాను రాజు శాసన సభను రద్దు చేశాడు మరియు ప్రతీ న్యాయ నిర్ణయాన్ని వ్యతిరేకించిన క్రైస్తవమతాధికారులు మతాధికారుల యొక్క సామాజిక రాజ్యంగం ఆజ్ఞాపించిన సామాజిక ప్రమాణాన్ని ఎనిమిదో రోజుల లోపు చేయాలని కూడా ఆదేశించాడు. ఒక సంవత్సరం తర్వాత, ఇటువంటి అసమ్మతులు ఒక రాజ్యాంగ సంక్షోభానికి దారి తీశాయి.[ఆధారం కోరబడింది]
రాజ్యాంగ సంక్షోభం[మార్చు]
10 ఆగస్టు 1792 రోజు రాత్రి, తిరుగుబాటుదారులు, క్రొత్త విప్లవ ప్యారిస్ సహజీవనవ్యవస్థ మద్దతుదారులు టైలెరియస్పై దాడి చేశారు. రాజు మరియు రాణులను ఖైదీ చేయబడ్డారు మరియు రాజ్యాంగ శాసన సభ యొక్క చివరి సమావేశంలో రాచరికాన్ని రద్దు చేసింది; మూడవ వంతు కంటే కొంచెం ఎక్కువగా ప్రతినిధులు పాల్గొన్నారు; మిగిలినవారు జాకోబిన్స్ పాల్గొన్నారు.
జాతీయ ప్రభుత్వం యొక్క మిగిలినవి తిరుగుబాటు సహజీవనవ్యవస్థ మద్దతు ఆధారపడ్డాయి. సహజీవనవ్యవస్థ నిరంకుశత్వాన్ని ప్రయత్నించడానికి గుంపులను మరియు 1400 కసాయివాళ్లను జైళ్లలోకి పంపింది మరియు ఫ్రాన్స్ యొక్క ఇతర నగరాలకు ఈ ఉదాహరణను అనుసరించమని ఒక లేఖను పంపింది. శాసన సభ బలహీనమైన నిరోధకాన్ని మాత్రమే అందించగలదు. ఈ పరిస్థితి 20 సెప్టెంబర్ 1792 కలిసి, క్రొత్త రాజ్యాంగాన్ని వ్రాసిన సమావేశం ఏర్పాటు వరకు అలాగే కొనసాగింది మరియు ఇది ఫ్రాన్స్ యొక్క క్రొత్త యదార్ధమైన ప్రభుత్వంగా మారింది. తర్వాత రోజు ఇది రాచరికాన్ని రద్దు చేసింది మరియు గణతంత్రంగా ప్రకటించింది. తర్వాత ఈ తేదీని ఆ నిర్ణయాన్ని ఫ్రెంచ్ రిపబ్లికన్ క్యాలెండర్ యొక్క ఇయర్ వన్కు ప్రారంభంగా తీసుకున్నారు.
యుద్ధం మరియు ప్రతి-విప్లవం (1792–1797)[మార్చు]
ఆ సమయంలోని రాజకీయాలు యొక్క తప్పనిసరి పరిస్థితులు ఫ్రాన్స్, ఆస్ట్రియా మరియు వాటి మిత్రరాజ్యాల మధ్య యుద్ధానికి దారి తీశాయి. రాజు, ఫెయిల్లాంట్స్ మరియు గిరోండిన్స్ ప్రత్యేకంగా యుద్ధాన్ని కోరుకున్నారు. యుద్ధం తన వ్యక్తిగత జనాదరణను పెంచుతుందని రాజు (మరియు అతనితో పాటు పలు ఫెయిల్లాంట్స్) అభిప్రాయపడ్డాడు; ఏదైనా ఓటమి అతను దోచుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తుంది: లేకపోతే ఫలితాలు అతన్ని శక్తివంతం చేస్తాయి. గిరోండిన్స్ మొత్తం యూరోప్లో విప్లవాన్ని ఎక్కించాలని కోరుకున్నారు మరియు ఫ్రాన్స్లో విప్లవాన్ని రక్షించడానికి ప్రయత్నించారు. కొంత మంది తీవ్రమైన జాకోబిన్లు యుద్ధాన్ని వ్యతిరేకించారు, పటిష్టపర్చడానికి సూచించి, స్వదేశంలో విప్లవాన్ని విస్తరించడానికి ప్రయత్నించారు. మారియే ఆంటోయినేట్టే యొక్క సోదరుడు, ఆస్ట్రియన్ చక్రవర్తి లియోపోల్డ్ II యుద్ధాన్ని తొలగించడానికి కోరుకున్నాడు, కాని అతను 1 మార్చి 1792న మరణించాడు.[43] ఫ్రాన్స్ ఆస్ట్రియాపై యుద్ధాన్ని ప్రకటించింది (20 ఏప్రిల్ 1792) మరియు కొన్ని వారాల తర్వాత ప్రుష్యా ఆస్ట్రియన్ వైపు పాల్గొంది. ఆక్రమించిన ప్రుష్యా సైన్యం స్వల్ప నిరోధాన్ని ఎదుర్కొంది, చివరిగా బ్యాటెల్ ఆఫ్ వాల్మే వద్ద అదుపులో వచ్చేది మరియు ఉపసంహరించుకోవాలని ఒత్తిడిని ఎదుర్కొంది. అయితే, ఈ సమయంలో, ఫ్రాన్స్ అంతటా గందరగోళంగా ఉంది మరియు దీనితో రాచరికం గత స్మృతిగా మిగిలిపోయింది.[ఆధారం కోరబడింది]
లూయిస్ XVI శిరస్సు ఖండించడం[మార్చు]
బ్రన్స్విక్ మ్యానిఫెస్టోలో, తమ పురోగతిని లేదా రాచరిక పునరుద్ధరణను నిరోధించడానికి ప్రయత్నిస్తే పగ సాధిస్తామని సామ్రాజ్యానికి సంబంధించిన మరియు ప్రుష్యన్ సైన్యాలు ఫ్రెంచ్ జనాభాను బెదిరించారు. దీనితో ఫ్రాన్స్ యొక్క శత్రువులతో లూయిస్ కుట్ర చేస్తున్నట్లు కనిపించింది. 17 జనవరి 1793న ఒక సదస్సులోని సంవృత అధిక సంఖ్యచే "ప్రజల స్వేచ్ఛ మరియు సాధారణ భద్రతకు వ్యతిరేకంగా కుట్ర చేసినందుకు" లూయిస్కు మరణశిక్ష విధించబడింది: రాజును హతమార్చాలని 361 మంది ఓటు వేయగా, 288 వ్యతిరేకంగా ఓటు చేశారు, మరో 72 మంది పలు ఆలస్య పరిస్థితులకు సంబంధించి అతన్ని హతమార్చాలని ఓటు చేశారు. మాజీ లూయిస్ XVI, ఇప్పుడు సాధారణ సిటోయెన్ లూయిస్ క్యాపెట్ (క్యాపెట్ పౌరుడు లూయిస్) పేరుతో ప్రస్తుతం ప్లేస్ డే లా కాన్కోర్డే అని పిలవబడే ప్రాంతంలో 21 జనవరి 1793న శిరచ్ఛేదక యంత్రంచే చంపబడ్డాడు. అతన్ని శిరచ్ఛేదనం చేసిన తర్వాత, శిరచ్ఛేదనాన్ని కళ్లారా చూసిన కొంత మంది పౌరులు మరణించిన రాజు యొక్క శిరస్సు నుండి కారుతున్న రక్తంలో వారి దుస్తులను తడపడానికి ముందుకు దూసుకుని వచ్చారు.[44] ఆ సమూహంలోని ఇతరులు వెర్రితో, వారి గొంతులు కోసుకున్నారు లేదా నది సేనేలోకి దూకేశారు.[45] – చరిత్రకారుడు అడమ్ జామోయ్సికే ప్రకారం, ఇది రాజు పట్ల తమకు ఉన్న అమితమైన ప్రేమతో కాదు కాని అతన్ని భూమిపై దేవుని యొక్క ప్రతినిధిగా భావించి ఆ విధంగా ప్రవర్తించారు. అతని పుస్తకం ది రెబల్లో, ఆల్బెర్చ్ కాముస్ ఈ శిరచ్ఛేదన ఘట్టం ఫ్రెంచ్ సమకాలీన చరిత్రలో ఒక ముఖ్యమైన మలుపుగా వ్రాశాడు, "ఫ్రెంచ్ ప్రపంచాన్ని మతాతీతంగా చేయడానికి మరియు ఫ్రెంచ్ ప్రజల యొక్క తదుపరి చరిత్ర నుండి దేవుణ్ణి బహిష్కరించడానికి ఒక చర్య".[45] 21 జనవరి శిరచ్ఛేదం ఇతర యూరోపియన్ దేశాలతో మరిన్ని యుద్ధాలకు దారి తీసింది. లూయిస్ ఆస్ట్రియన్-జన్మించిన రాణి మారియే ఆంటోయినెట్టే 16 అక్టోబర్ను శిరచ్ఛేధన యంత్రంతో అతన్ని అనుసరించింది.[46]
ఆర్థిక వ్యవస్థ[మార్చు]
యుద్ధం ఎక్కువ కాలం జరగడంతో, ధరలు పెరిగిపోయాయి మరియు సాన్స్-కులోట్టేస్ — నిరుపేద కార్మికులు మరియు తీవ్రమైన జాకోబిన్స్ — దొమ్మీకి పాల్పడ్డారు; కొన్ని ప్రాంతాల్లో ప్రతి-విప్లవాత్మక చర్యలు ప్రారంభమయ్యాయి. ఆ పరిస్థితులు గిరొండిస్ట్ వర్గానికి వ్యతిరేకంగా ప్రజల మద్దతు సమీకరణచే పొందిన శక్తితో మరియు పారిసియన్ సాన్స్-కులోట్టేస్ యొక్క గుంపు బలాన్ని ఉపయోగించుకుని ఒక పార్లమెంటరీ కుట్ర ద్వారా అధికారాన్ని స్వాధీనం చేసుకోవడానికి జాకోబిన్స్ను ప్రోత్సహించాయి. దీనితో కొత్త ప్రభుత్వానికి జాకోబిన్ యొక్క మిత్రపక్షాలు మరియు సాన్స్-కులోట్టేస్ నాయకులు కేంద్రంగా మారారు. "ది లా ఆఫ్ ది మ్యాగ్జిమమ్" ఆహార ధరలను నిర్ణయించడం వలన మరియు అపరాధులకు మరణశిక్షలు విధించడంతో ఈ విధానం మరింత తీవ్రంగా మారింది.[47]
రైన్ ఆఫ్ టెర్రర్[మార్చు]
ప్రజా భద్రతా సంఘం అనేది ఒక న్యాయవాది మాక్సిమిలైన్ రోబెస్పైర్రే ఆధర్వంలో వచ్చింది మరియు రైన్ ఆఫ్ టెర్రర్ను (1793-1794) జాకోబిన్స్ ఆకస్మికంగా ప్రారంభించారు. భద్రపరిచిన నివేదికలు ప్రకారం, సుమారు శిరచ్ఛేదన యంత్రం క్రింద లేదా ప్రతి-విప్లవాత్మక చర్యల యొక్క ఆరోపణలతో 16,594 మంది చంపబడ్డారు.[48] పలు చరిత్రకారులు నివేదికలు ప్రకారం, దాదాపు 40,000 మంది నేరారోపిత ఖైదీలు విచారణ లేకుండా లేదా విచారణ కోసం వేచి ఉన్నవారు చంపబడ్డారు.[48][49]
2 జూన్ 1793న, ప్యారిస్ విభాగాలు — ఉద్రేకపూరిత ("కోపోద్రిక్తులు") జాక్యూయెస్ రౌక్స్ మరియు జాక్యూయెస్ హెబెర్ట్లతో ప్రోత్సహించబడిన — సమావేశాన్ని ఏర్పాటు చేసి, నిర్వాహక మరియు రాజకీయ ప్రక్షాళనను ఆహ్వానిస్తూ, రొట్టెకు స్వల్ప నిర్దిష్ట మారకాన్ని నిర్ణయించారు మరియు రాజకీయ అనుమతిని "సాన్స్-కులోట్టెస్"లకు మాత్రమే పరిమితం చేశారు.[50] జాతీయ అంగరక్షకులు సహాయంతో, వారు జాక్యూయెస్ పైర్రే బ్రిస్సాట్తో సహా 31 గిరోండిన్ నేతలను నిర్బంధించడానికి సదస్సును విజయవంతంగా ఒప్పించారు. ఈ నిర్బంధాలు తర్వాత, జాకోబిన్స్ విప్లవాత్మక నియంతృత్వాన్ని స్థాపించడం ద్వారా 10 జూన్న ప్రజా భద్రత సంఘంపై అధికారాన్ని సాధించారు. 13 జూలైన, ఒక గిరోండిన్ చార్లోట్టే కోర్డే, అతని రక్తపాతకాంక్ష వాక్పటిమికి పేరు గాంచిన ఒక జాకోబిన్ నేత మరియు విలేకరి అయిన జీన్-పాల్ మారాట్పై దాడి చేయడంతో ఫలితంగా జూకోబిన్ రాజకీయ ప్రాబల్యం మరింత బలపడింది. రాజుకు వ్యతిరేకంగా ఆగస్టు 1792 తిరుగుబాటు నేత, పలువురు రాజకీయ వ్యతిరేకులచే నిర్లక్ష్యం చేయబడిన జార్జ్స్ డాంటన్ సంఘం నుండి తొలగించబడ్డాడు మరియు ఇది విప్లవం యొక్క దేశీయ మరియు విదేశీయ శత్రువులకు వ్యతిరేకంగా తీవ్రమైన పరిణామాలను తీసుకోవడానికి పూనుకున్న కారణంగా "నీతిమంతుడు" రోబెస్పియెర్రే దాని ప్రముఖ సభ్యుడిగా అవతరించాడు.[51]
ఈ సమయంలో, 24 జూన్న, సదస్సు ఫ్రాన్స్ యొక్క మొదటి గణతంత్ర రాజ్యాంగాన్ని ఆమోదించింది, పలువురు దీన్ని 1793 యొక్క ఫ్రెంచ్ రాజ్యాంగం లేదా I సంవత్సరానికి రాజ్యాంగంగా సూచించారు. ఇది పలు సందర్భాలలో ప్రత్యేకంగా ప్రపంచ పురుష ఓటు హక్కును స్థాపించడంలో పురోగతి మరియు ప్రాతిపదికను సాధించింది. ఇది ప్రజాభిప్రాయసేకరణపై ధ్రువీకరించబడింది, కాని ఎప్పుడూ వర్తించబడలేదు ఎందుకంటే ఇది ప్రభావితం కావడానికి ముందే సాధారణ న్యాయ విధానాలు తొలగించబడ్డాయి.[52]
వెందేలో, ఫ్రెంచ్ విప్లవ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 1793లో రైతులు తిరుగుబాటు చేశారు. వారు క్రైస్తవ మతాధికారి యొక్క సాంఘిక రాజ్యాంగం (1790)చే రోమన్ క్యాథలిక్ చర్చిపై విధించిన మార్పులను అసహ్యించుకున్నారు మరియు విప్లవ ప్రభుత్వం యొక్క సైనిక నిర్బంధ సైనిక శిక్షణ యొక్క తిరస్కారంలో బహిరంగ తిరుగుబాటుకు సిద్ధమయ్యారు.[53] ఇది ఒక గొరిల్లా యుద్ధంగా మారింది, ఇది వెందేలో యుద్ధంగా పేరు గాంచింది.[54] లోయిరే యొక్క ఉత్తర ప్రాంతంలో, ఇటువంటి తిరుగుబాట్లు చౌయాన్స్ (రాచరికపు తిరుగుబాటుదారులు) అని పిలవబడే వారిచే ప్రారంభించబడ్డాయి.[ఆధారం కోరబడింది]
సావేనేలో ఓటమి తర్వాత, వెందేలో సాధారణ యుద్ధం ముగిసినప్పుడు, ఫ్రెంచ్ జనరల్ ఫ్రాన్సోయిస్ జోసెఫ్ వెస్టర్మాన్ ప్రజా భద్రత సంఘాని ఈ విధంగా ఒక లేఖను వ్రాశాడు
“ఇక వెందే లేదు. అది మన స్వతంత్ర ఖడ్గాలకు దాని భార్యలు మరియు పిల్లలతో బలైపోయింది. నేను ఇప్పుడే దాన్ని కట్టెల్లో మరియు సావెనే యొక్క చిత్తడినేలలో ఖననం చేశాను. మీరు నాకు ఇచ్చిన ఆజ్ఞలు ప్రకారం, నేను గుర్రాల కాళ్ల క్రింద పిల్లలను నిర్మూలించాను, ఇకపై బందిపోటులకు జన్మను ఇవ్వలేని విధంగా మహిళలను ఊచకోత కోశాను. నన్ను నిందించడానికి ఒక బందీ కూడా లేడు. నేను అందరినీ నాశనం చేశాను. రహదారులు మృతదేహాలతో కప్పబడ్డాయి. సావెనేలో, బందిపోటులు ఎల్లప్పుడూ లొంగిపోవడానికి మమ్మల్ని సమీపించేవారు మరియు మేము వాళ్లను ఆగకుండా కాలుస్తూ ఉండిపోయాము... దయ అనేది విప్లవకర మనోభావం కాదు."[55][56]
అయితే, కొంతమంది చరిత్రకారులు ఈ పత్రం ఉనికిపై సంశయాన్ని వ్యక్తం చేశారు[57] మరియు ఇతరులు దీనిలో పేర్కొనది అధికారికంగా అబద్ధమని సూచించారు - ఎందుకంటే నిజానికి తిరుగుబాటును అణగదొక్కిన సమయానికి పలువురు వెందే ఖైదీలుగా ఉన్నారు[58] మరియు మహిళలు, పిల్లలు మరియు ఆయుధం లేని వ్యక్తులతో మానవత్వంతో మసలుకోవాలని సదస్సు స్పష్టంగా ఆజ్ఞాపించిందని చెప్పారు.[59] ఈ లేఖ ప్రామాణికమైనట్లయితే ఇది పరికల్పనగా చెప్పవచ్చు, ఇది తన చర్యలు మరియు అతని విజయం యొక్క తీవ్రతను ఎక్కువచేసి చెప్పడానికి వెస్టెర్మాన్ ప్రయత్నం కూడా కావచ్చు ఎందుకంటే అతను తన అసమర్థ సైనిక నేతృత్వానికి మరియు సాన్స్-కులోట్టేయి జనరల్లకు తన వ్యతిరేకతకు తొలగించబడకుండా ఉండటానికి ఆత్రుతగా ఉన్నాడు (ఎట్టకేలకు దీన్ని నమ్మించడంలో అతను విఫలమయ్యాడు, దీనితో అతన్ని డాంటన్ సమూహంతో కలిపి శిరచ్ఛేదన చేశారు)[60].
తిరుగుబాటు మరియు దాని అణిచివేత కారణంగా (పోరాట బాధితులు మరియు సామూహిక వధలు రెండింటిలోనూ కలిపి మరియు రెండు వైపుల మరణశిక్షలతో కలిపి) 117 000 నుండి 250 000 మంది చనిపోయి ఉండవచ్చని అంచనా వేశారు (తాజా అంచనాల ప్రకారం 170 000 మందిగా తెలిసింది).[61] క్రూరమైన పనులు కారణంగా పలు ప్రాంతాల్లో గణతంత్ర సభ్యుల అణిచివేతగా మారింది, రైనాల్డ్ సెచెర్ వంటి నిర్దిష్ట చరిత్రకారులు ఈ సంఘటనను "సామూహిక హత్యాకాండ"గా పేర్కొన్నారు. ఈ వివరణ ప్రసార మాధ్యమాలలో చాలా ప్రసిద్ధి గాంచింది,[62] కాని ఇది అసహజంగా మరియు పాక్షికంగా ఉండటం వలన అకాడెమీలో అధిక విమర్మలను ఎదుర్కొంది.[63]
దేశం యొక్క తూర్పు మరియు పడమర రెండు వైపులా స్థానిక తిరుగుబాటులు మరియు విదేశీ దండయాత్రలను ఎదుర్కొన్న ప్రభుత్వం యొక్క తక్షణ వ్యాపారంగా యుద్ధాన్ని చెప్పవచ్చు. 17 ఆగస్టున, సదస్సు సైనికులు లేదా సరఫరాదారులుగా యుద్ధ ప్రయత్నంలో అందరు పౌరులు పాలుపంచుకోవాలని పిలుస్తూ, సాధారణ నిర్బంధ సైనిక శిక్షణ levée en masse కోసం ఓటు చేసింది.
దీని ఫలితంగా వచ్చిన ఒక విధానం ద్వారా ప్రభుత్వానికి నిరోధాన్ని అణగదొక్కడానికి రాష్ట్రం కఠినమైన నిర్బంధకాండను ఉపయోగించింది.ప్రభావిత నియంత సంఘం యొక్క ఆధ్వర్యంలో, సదస్సు మరింత రాజ్యాంగాన్ని త్వరితంగా చట్టం చేసింది.సెప్టెంబర్ 9న, సదస్సు ప్రభుత్వంచే డిమాండ్ చేసిన ధాన్యాలు అప్పగించాలని రైతులను బలవంతం చేయడానికి సాన్స్-కులోట్టేస్ పార్లమెంటరీ దళాలు విప్లవ దళాల ను స్థాపించింది. సెప్టెంబర్ 17న, అనుమానితుల చట్టం ఆమోదించబడింది, ఈ చట్టం స్వేచ్ఛకు వ్యతిరేకంగా అస్పష్టంగా పేర్కొన్న నేరాలతో ప్రతి-విప్లవకారులను శిక్షించడానికి అధికారాన్ని కలిగి ఉంది. సెప్టెంబర్ 29న, సదస్సు ధర-నిర్ణయాన్ని ధాన్యం మరియు రొట్టె నుండి ఇతర గృహసంబంధిత సరుకులకు విస్తరించింది మరియు సరుకులపై పరిమితిని నిర్ధారించే హక్కు దానికే ఉన్నట్లు ప్రకటించింది.[64]
శిరచ్ఛేదన యంత్రం మరణశిక్షల అమలుకు చిహ్నంగా మారింది. లూయిస్ XVI అప్పటికే భీభత్సం ప్రారంభం కావడానికి ముందే శిరచ్ఛేదన చేయబడ్డాడు; రాణి మారియే ఆంటోయినెట్టే, గ్రిరోండిన్స్ ఫిలిప్పే ఈగాలైట్ (రాజు మరణించాలని ఓటు వేసినప్పటికీ), మాడామే రోనాల్డ్ మరియు పలు ఇతరులను శిరచ్ఛేదన యంత్రం ద్వారా హతమార్చారు. విప్లవకర ప్రత్యేక న్యాయస్థానం సంక్షిప్తంగా శిరచ్ఛేదన యంత్రంచే వేల ప్రజలను హతమార్చడాన్ని ఖండించింది, సమూహాలు ఇతర వ్యక్తులను చచ్చేలా కొట్టారు.
భీభత్సం భయంకరంగా ఉన్నప్పుడు, ప్రతి-విప్లవకర ఆలోచనలు లేదా కార్యచరణలు యొక్క స్వల్ప చర్యలు సందేహస్పదంగా మారాయి మరియు తగిన విధానం యొక్క సమకాలీన ప్రమాణాల ప్రకారం విచారణలు ఎల్లప్పుడూ నిర్వహించబడలేదు. కొన్నిసార్లు వారి రాజకీయ అభిప్రాయాలు లేదా చర్యలు కోసం ప్రజలు చనిపోయారు, కాని పలువురు చిన్న సంశయాలకు మించిన స్వల్ప కారణాలకు లేదా కొంత మంది ఇతరులు వారి విమోచనం కోసం పణంగా చనిపోయారు. పలువురు నేరస్తులు బహిరంగ చెక్క బండిపై (టంబ్రెల్) శిరచ్ఛేదన యంత్రం వరకు తీసుకునిపోయే అనాచరం ఉండేది. తిరుగుబాటుదారు ప్రాంతాల్లో, ప్రభుత్వ ప్రతినిధులు అపరిమిత అధికారాన్ని కలిగి ఉండేవారు మరియు కొంత మంది తీవ్ర నిర్బంధకాండతో, దుర్భాషలతో నిందించేవారు.ఉదాహరణకు, జీన్-బాప్టిస్టే క్యారియెర్ నోయాడెస్ ["ముంచివేయడం"] కోసం అపఖ్యాతి పాలయ్యాడు - ఇతను నాన్టెస్ను పరిపాలించాడు[65]; అతన ప్రవర్తన జాకోబిన్ ప్రభుత్వంచే కూడా ఆమోదించబడదని తీర్పు చెప్పబడింది మరియు అతన్ని వెనక్కి పిలిపించారు.[ఆధారం కోరబడింది]
24 అక్టోబర్ 1793న గణతంత్ర క్యాలెండర్ను స్థాపించడం ద్వారా మరొక మతాధికార వ్యతిరేక తిరుగుబాటు ప్రారంభమైంది.రోబెస్పైయిర్రె యొక్క డైసమ్ మరియు సత్ప్రవర్తన యొక్క విషయాలకు వ్యతిరేకంగా హెబెర్ట్ యొక్క (మరయు చౌమెట్ట్ యొక్క) నాస్తిక ఉద్యమం డిక్రైస్టినైజ్ సమాజానికి మతపరమైన ఉద్యమాన్ని ప్రారంభించింది. నవంబర్ 10న నోట్రే డామే క్యాథెడ్రల్లో కారణం యొక్క వెలుగు యొక్క వేడుకలతో ముగింపు పడింది.[66]
రైన్ ఆఫ్ టెర్రర్ విప్లవకర ప్రభుత్వం సైనిక ఓటమిని తొలగించడానికి దోహదపడింది.జాకోబిన్లు సైన్యం యొక్క పరిమాణాన్ని విస్తరించారు మరియు కార్నోట్ పలు కులీన అధికారులను యువ సైనికులతో భర్తీ చేశాడు, వీరికి వారి సామర్థ్యం మరియు దేశభక్తిని వివరించాడు.గణతంత్ర సైన్యం ఆస్ట్రియన్లు, ప్రుష్యన్లు, బ్రిటీష్ మరియు స్పానిష్ సైన్యాలను తరిమి కొట్టగలిగింది. 1793 ముగింపులో, సైన్యం వ్యాప్తి చెందడం ప్రారంభమైంది మరియు సులభంగా తిరుగుబాటులను అణిచివేశారు. వెంటోస్ డెక్రీస్ (ఫిబ్రవరి–మార్చి 1794) నిష్కాసితులు మరియు విప్లవం యొక్క ప్రత్యర్థుల యొక్క సరుకుల జప్తు చేసి, అవసరమైనప్పుడు వాటిని మళ్లీ పంపిణీ చేయాలని పేర్కొంది.[67]
1794 యొక్క వసంతరుతువులో, హెబెర్ట్ వంటి తీవ్ర కోపగ్రస్తులు మరియు డాంటన్ వంటి ఆధునిక మోంటాగ్నార్డ్ జోక్యం చేసుకునేవారు ఇద్దరినీ ప్రతి-విప్లవకర చర్యలకు కాని నిర్బంధించి, విచారించి మరియు శిరచ్ఛేదనం చేశారు. జూన్ 7న, క్లట్ ఆఫ్ రీజన్ ను ప్రారంభంలో ఖండించిన రోబెస్పైయిరే ఒక కొత్త రాష్ట్ర మతాన్ని సూచించాడు మరియు "అధిక శక్తి గల వ్యక్తి" యొక్క ఉనికిని ఒప్పుకోవాలని సదస్సుకు సిఫార్సు చేశాడు.[68]
థెర్మిడోరియన్ ప్రతిచర్య[మార్చు]
27 జూలై 1794న, థెర్మిడోరియన్ ప్రతిచర్య రోబెస్పైయిర్రే మరియు లూయిస్ డె సెయింట్-జస్ట్ను నిర్బంధానికి మరియు శిరచ్ఛేదనానికి దారి తీసింది. భీభత్సం నుండి సజీవులుగా మిగిలిన గిరోండిస్ట్లు యొక్క ప్రాబల్యంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయబడింది మరియు అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత వారు రోబెస్పైయిర్రేను నాశనం చేయడానికి సహాయం చేసిన జాకోబిన్లను హింసించారు, జాకోబిన్ క్లబ్ను నిషేధించారు మరియు దాని పలువురు మాజీ సభ్యులను శిరచ్ఛేదనం చేయడం ద్వారా ప్రతీకారం తీర్చుకున్నారు. ఇది వైట్ టెర్రర్ అని పేరు గాంచింది.[ఆధారం కోరబడింది]
మితిమీరిన టెర్రర్కు మేల్కొలుపుగా, సదస్సు 22 ఆగస్టు 1795లో కొత్త "III సంవతర్సం యొక్క రాజ్యాంగాన్ని" ఆమోదించింది. రాజ్యాంగాన్ని 49,000 మంది వ్యతిరేకించగా, సుమారు 1,057,000 ఆమోదిత ఓట్లుతో ఒక ఫ్రెంచ్ ప్రజాభిప్రాయ సేకరణ పత్రాన్ని ధ్రువీకరించింది.[69] ఓటింగ్ ఫలితాలను 23 సెప్టెంబర్ 1795న ప్రకటించారు మరియు కొత్త రాజ్యాంగం 27 సెప్టెంబర్ 1795 నుండి అమలులోకి వచ్చింది.[69]
ది డైరెక్టరీ(1795–1799)[మార్చు]
కొత్త రాజ్యాంగం డైరెక్టయిరే (ఆంగ్లము: Directory)ను మరియు ఫ్రెంచ్ చరిత్రంలోని మొదటి ద్విసభ శాసన సభను రూపొందించింది.[70] పార్లమెంట్లో 500 ప్రతినిధులు ఉంటారు — కౌన్సిల్ డెస్ సింక్యూ-సెంట్స్ (ఐదు వందల మంది సంఘం) — మరియు 250 శాసన సభ సభ్యులు — కౌన్సిల్ డెస్ యాన్సియెన్స్ (పెద్దవాళ్ల సంఘం).కార్యనిర్వాహణ అధికారం కౌన్సిల్ డెస్ సింక్యూ-సెంట్స్ చే సమర్పించబడిన ఒక జాబితా నుండి కౌన్సిల్ డెస్ యాన్సియెన్స్ చే సంవత్సరానికి నియమించబడే ఐదుగురు "నిర్వాహకులకు" ఇవ్వబడింది.[ఆధారం కోరబడింది] ఇంకా, 1793 యొక్క ప్రపంచ ఓటుహక్కు లక్షణంపై ఆధారపడి పరిమితి ఓటుహక్కుచే భర్తీ చేయబడింది.[ఆధారం కోరబడింది]
డైరెక్టరీని స్థాపించడంతో, సమకాలీన పరిశీలకులు విప్లవం ముగిసిందని భావించి ఉండవచ్చు. యుద్ధాలతో అలిసిపోయిన దేశం యొక్క ప్రజలు స్థిరత్వాన్ని, శాంతిని మరియు ఆ సమయంలోని గందరగోళాలకు ముగింపు పరిస్థితులను కోరుకున్నారు. లూయిస్ XVIIIను రాజుగా చేసి రాచరికం మరియు యాన్సియెన్ రెజీమ్ ను మళ్లీ పునరుద్ధరించాలని కోరుకున్నవారు మరియు రైన్ ఆఫ్ టెర్రర్ పునరుద్ధరించాలని కోరుకునేవారు స్వల సంఖ్యలో మిగిలారు. ప్రథమ సంకీర్ణం వైఫల్యంతో విదేశీ జోక్యం యొక్క ప్రసక్తి కూడా మరుగున పడింది. ప్రారంభ కిరాతుకులు పార్టీల మధ్య నమ్మకం లేదా మంచి సంకల్పం ఏర్పడటాన్ని అసాధ్యం చేశారు.స్వయంసంరక్షణ యొక్క ఇదే స్వభావం రాజ్యాంగం యొక్క సభ్యులు కొత్త రాజ్యాంగంలో చాలా ఎక్కువ భాగాన్ని అభ్యర్థించడానికి దారి తీసింది మరియు మొత్తం డైరెక్టరీ వారి ప్రాబల్యాన్ని ఉంచుకోవడానికి వారిని బలవంతం చేశారు.[ఆధారం కోరబడింది]
ఫ్రెంచ్ పౌరులలో చాలా మంది డైరెక్టరీని నమ్మలేదు,[71] నిర్వాహకులు వారి అవసరాలను అసాధారణ రీతిలో మాత్రమే పొందగల్గి ఉండవచ్చు.వారు అలవాటు ప్రకారం రాజ్యాంగం యొక్క నియమాలను అంగీకరించలేదు మరియు వారు నిర్వహించిన ఎన్నికలు కూడా వారికి వ్యతిరేక ఫలితాలను ఇచ్చాయి,[72] నిర్వాహకులు అసమ్మతిని అణచడానికి సహజంగానే కిరాతకమైన పోలీసు దళాలను ఉపయోగించారు.అయితే, డైరెక్టరీ వారి అధికారాన్ని పొడిగించుకోవడానికి యుద్ధాన్ని ఉత్తమ ఉచిత లాభసాటి ఉపయోగకంగా భావించింది మరియు దీనితో నిర్వాహకులు సైనిక దళాలపై ఎక్కువగా నమ్మకం పెట్టుకున్నారు, అంటే యుద్ధాన్ని కోరుకుని, అతి స్వల్ప సాంఘిక-భావనలను పెరగాలని కూడా కోరుకున్నారు.[ఆధారం కోరబడింది]
ఇతర కారణాలు ఈ దిశలో వారు వెళ్లేలా ప్రభావితం చేశాయి. దోపిడీ సొత్తు మరియు విదేశీ నివాళులు లేకుండా ప్రభుత్వం దాని వ్యయాలకు ధనాన్ని సమకూర్చలేకపోవడంతో విప్లవం యొక్క ప్రారంభ కాలంలోని రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ త్వరితంగా నాశనమైంది. శాంతిని ఎంచుకున్నట్లయితే, సైనిక దళాలు స్వదేశానికి చేరుకుంటాయి మరియు వారి జీవనాన్ని కోల్పోయిన సాధారణ సైనికుల వేధింపులు అలాగే కొన్నిసార్లు వారిని పక్కకు తప్పించగల జనరల్స్ యొక్క లక్ష్యాలను నిర్వాహకులు ఎదుర్కోవాలి. Barras and Rewbell were notoriously corrupt themselves and screened corruption in others. నిర్వాహకులు ప్రోత్సాహం చెడ్డవాళ్లకు ఎక్కువగా ఉండేది మరియు సాధారణ చెడ్డనిర్వాహణ వారిని ప్రజామోదం నుండి దూరం చేసింది.[ఆధారం కోరబడింది]
శాసన సభలోని రాజ్యాంగ సంబంధిత పార్టీ అసమ్మతి మతాధికారుల యొక్క ఆమోదాన్ని ఆశించారు, వలసదారులకు బంధువులకు వ్యతిరేకంగా చట్టాలను రద్దు చేశారు మరియు వలసదారులపై వారు కొంత దయతో కూడిన విచక్షణను ప్రదర్శించేవారు. నిర్వాహకులు ఇటువంటి ప్రయత్నాలను భంగపర్చారు. మరొక విధంగా, బాబెయుఫ్ యొక్క సామ్యవాద వివాదాన్ని సులభంగా అణిచివేశారు. ఆర్ధిక వ్యవస్థను వృద్ధి చేయడానికి కొంత చేశారు మరియు అసైనాట్లు విలువ పతనం కావడం కొనసాగింది.[ఆధారం కోరబడింది]
కొత్త రెజిమే మిగిలిన జాకోబిన్స్ మరియు రాచరిక సంబధిత సభ్యులతో ప్రతిపక్షాన్ని ఎదుర్కొంది. సైన్యం కొట్లాట్లను మరియు ప్రతి-విప్లవ కార్యాచరణలను అణిచివేసింది.ఈ విధంగా సైన్యం మరియు దాని విజయవంతమైన జనరల్ నెపోలియన్ బోనాపార్టే మరింత శక్తిని పొందాడు.
9 నవంబర్ 1799న, (VIII సంవత్సరం యొక్క 18 బ్రుమాయిరే) నెపోలియన్ బోనాపార్టే 18 బ్రూమాయిరే యొక్క తిరుగుబాటు ను ప్రారంభించాడు, ఇది దౌత్యకార్యాలయాన్ని స్థాపించింది. ఇది పటిష్టంగా బోనాపార్టే యొక్క నియంతృత్వానికి దారి తీసింది మరియు చివరిగా (1804లో) అతను ఎంపరెర్ (చక్రవర్తి)గా ప్రకటించుకున్నాడు, దీనితో ప్రత్యేకంగా ఫ్రెంచ్ విప్లవం యొక్క గణతంత్ర విభాగం ముగింపు దశకు చేరుకుంది.[ఆధారం కోరబడింది]
చారిత్రక విశ్లేషణ[మార్చు]
రాజ్యాంగ చట్టసభ పలు కారణాలతో విఫలమైంది: ఒక గణతంత్ర రాజ్యం కోసం రాచరిక సభ్యులు అధికంగా ఉన్నారు మరియు ఒక రాజరికం కోసం రిపబ్లికన్లు ఎక్కువగా ఉన్నారు; అధిక సంఖ్యలో ప్రజలు రాజును వ్యతిరేకించారు (ప్రత్యేకంగా వారెన్నెస్కు పయనం చేసిన తర్వాత), దీని అర్ధం రాజును మద్దతు చేసిన వీరి ఖ్యాతి సన్నగిల్లింది; మతాధికారి యొక్క సాంఘిక రాజ్యాంగం మరియు మరిన్ని.[ఆధారం కోరబడింది]
చరిత్రకారులు విప్లవం యొక్క రాజకీయ మరియు సామాజిక ఆర్ధిక వ్యవస్థ గురించి భేదించారు. జార్జ్ లెఫెబ్వ్రేచే అందించినటువంటి సాంప్రదాయిక మార్క్సిస్టు అర్థవివరణలో ఈ విప్లవాన్ని ఒక భూస్వామి ఉన్నతి వర్గం మరియు పెట్టుబడిదారీ బూర్జువా వర్గం మధ్య ఒక సంఘర్షణ పేర్కొన్నారు.కొంతమంది చరిత్రకారులు[who?] యాన్సియెన్ రెజిమే యొక్క పాత ఉన్నత వర్గాల అధికారం వృద్ధి చెందుతున్న మధ్య స్థాయి, బాధిత రైతులు మరియు పట్టణ కూలి మనషులు యొక్క రాజ్యాల కూటమికి లొంగిపోయిందని వాదించారు.[ఆధారం కోరబడింది]
మరొక అర్ధవివరణలో పలు ఉన్నత వంశీయులు మరియు బుర్జువా వర్గం సంస్కరణ ఉద్యమాల సమయం నియంత్రణ కోల్పోయిని ఫలితంగా విప్లవం సంభవించిందని నొక్కి చెప్పారు.ఈ నమూనా ప్రకారం, ఈ ఉద్యమాలు కొత్త కూలీ తరగతులు మరియు ప్రాంతీయ రైతాంగం యొక్క ప్రఖ్యాత ఉద్యమాలతో ఏకీభవించాయి, కానీ తరగతుల మధ్య ఏదైనా అనుబంధం అగంతుక మరియు సంఘటనాత్మకంగా చెప్పవచ్చు.[ఆధారం కోరబడింది]
మునుపటి సంవత్సరాల్లోని బీదరికాన్ని అధికంగా పెంచడానికి విప్లవాన్ని ఒక ముఖ్య కారణంగా చెప్పవచ్చు. కొంతమంది విద్వాంసులు దీన్ని 1783లో లాఖీ విస్ఫోటనంచే ఏర్పిడిన ఆవృత వాతావరణ భ్రంశనం యొక్క పలు సంవత్సరాలు విశ్లేషించారు మరియు దాని తర్వాత తీవ్ర ఎల్ నినో ప్రభావాలు ఏర్పడ్డాయి.[73]
ఇవి కూడా చూడండి[మార్చు]
సంబంధిత పుటలు[మార్చు]
- బియిన్స్ నేషనౌక్స్
- ప్రజాస్వామ్యం యొక్క చరిత్ర
- జీన్-నికోలస్ పా - Liberté, Egalité, Fraternité
- La Révolution française (చలన చిత్)
- ఫ్రెంచ్ విప్లవం సమయంలో గౌరవ ఫ్రెంచ్ పౌరసత్వాన్ని పొందిన వ్యక్తుల జాబితా
- విప్లవాలు మరియు తిరుగుబాటుల జాబిత
- నేపోలియన్ బానాపార్టే యొక్క సైనిక వృత్తి
- నేపోలియన్ కోడ్
- యూరోప్లో జాతీయవాదం అభివృద్ధి
ఫ్రెంచ్ చరిత్రలో ఇతర విప్లవాలు మరియు దండియాత్రలు[మార్చు]
- కామిసార్ద్ తిరుగుబాటు, ఫ్రెంచ్ హ్యుగెనాట్స్ (1710-1715)
- హాయ్టైన్ విప్లవం, హైతి కాలనీ (1791–1804)
- జూలై విప్లవ (1830)
- 1848 ఫ్రెంచ్ విప్లవం
- 1871 యొక్క ప్యారిస్ సహజీవనవ్యవస్థ
- ఫ్రెంచ్ సైనిక తిరుగుబాటులు (1917)
- ఫ్రాన్స్లో మే 1968, ఒక విప్లవం కానప్పటికీ, ఒక ప్రత్యేకమైన తిరుగుబాటు.
సూచనలు[మార్చు]
- ↑ ఎల్ నానో నమూనాల యొక్క ఇటీవల అధ్యయనం ప్రకారం 1789 మరియు 1793 మధ్య అసాధారణ శక్తివంతమైన ఎల్ నినో ప్రభావం కారణంగా యూరోప్లో 1788-1789లలో పంట దిగుబడి చాలా తక్కువగా ఉందని తెలిసింది.రిచర్డ్ H. గ్రోవే, “గ్లోబల్ ఇంపాక్ట్ ఆఫ్ ది 1789–93 ఎల్ నినో,” నేచర్ 393 (1998), 318–319.
- ↑ లిటిల్ ఐస్ ఏజ్: బిగ్ చిల్లీ. హిస్టరీ ఛానెల్.
- ↑ "Encyclopedia Britannica - Traite". Retrieved 2008-10-16.
- ↑ డోయ్లే 1989, pp.73-74
- ↑ ఫ్రే, పు. 3
- ↑ "France’s Financial Crisis: 1783–1788". Retrieved 2008-10-26.
- ↑ 7.0 7.1 7.2 హిబ్బెర్ట్, పు. 35, 36
- ↑ ఫ్రే, ప. 2
- ↑ డోయ్లే 2001, పు. 34
- ↑ డోయ్లే 2001, p. 36
- ↑ 11.0 11.1 ఫ్రే, pp. 4, 5
- ↑ 12.0 12.1 12.2 డోయ్లే 2001, p. 38
- ↑ డోయ్లే 1989, p.89
- ↑ 14.0 14.1 14.2 నీల, p. 56
- ↑ 15.0 15.1 హిబ్బెర్ట్, pp.42-45
- ↑ 16.0 16.1 నీలే, pp. 63, 65
- ↑ ఫ్యూరెట్, p. 45
- ↑ హిబ్బెర్ట్, p. 54
- ↑ స్కామా 2004, p.300-301
- ↑ జాన్ హాల్ స్టీవార్. ఏ డాక్యుమెంటరీ సర్వే ఆఫ్ ది ఫ్రెంచ్ రివల్యూషన్ . న్యూయార్క్: మాక్మిలాన్, 1951, p. 86.
- ↑ స్కామ్ 2004, p.303
- ↑ స్కామా 2004, p.312
- ↑ స్కామా 2004, p.317
- ↑ స్కామా 2004, p.344
- ↑ స్కామా 2004, p.357
- ↑ హిబ్బెర్ట్, 93
- ↑ డోయ్లే 1989, p.121
- ↑ డోయ్లే 1989, p.122
- ↑ స్కామా 2004, p.433-434
- ↑ 30.0 30.1 Mignet, François (1824). Histoire de la Révolution française. Chapter III.
- ↑ స్కామ 2004, p.449
- ↑ స్కా 2004, p.442
- ↑ స్కామా 2004, p.496
- ↑ ఎన్సైక్లోపిడియా బ్రిటానికా ఎల్వెన్త్ ఎడిషన్
- ↑ లిండ్క్విస్ట్, హెర్మా (1991). అక్సెల్ వాన్ ఫెర్సెన్. స్టాక్హోమ్: ఫిస్చెర్ & కో
- ↑ లూమిస్, స్టాన్లే (1972). ది ప్యాటల్ ఫ్రెండ్షిప్. అవోన్ బుక్స్ - ISBN 0-931933-33-1
- ↑ టిమోతే టాకెట్, రాజు పయనానికి సిద్ధమైనప్పుడు (కేంబ్రిడ్జ్: హార్వార్డ్ యూనివర్సటీ ప్రెస్, 2003)
- ↑ http://penelope.uchicago.edu/Thayer/E/Gazetteer/Places/Europe/France/_Texts/CROROY/Fuite_de_Varennes*.html
- ↑ స్కామా 2004, p.481
- ↑ స్కామా 2004, p.500
- ↑ Mignet, François (1824). Histoire de la Révolution française. Chapter IV.
- ↑ "French Revolution". About LoveToKnow 1911. Retrieved 2009-04-10.
- ↑ స్కామా 2004, p.505
- ↑ డోయ్లే 2002, p. 196
- ↑ 45.0 45.1 Zamoyski, Adam (1999). Holy Madness. London: Weidenfeld & Nicolson. p. 1-2. ISBN 0297 815717. Text "publisher Weidenfeld & Nicholson" ignored (help)
- ↑ "Date of Marie Antoinette execution". Retrieved 2008-10-15.
- ↑ వైట్, E. "ఫ్రెంచ్ విప్లవం మరియు ప్రభుత్వం ఆర్ధిక వ్యవస్థ యొక్క రాజకీయాలు, 1770-1815." ది జర్నల్ ఆఫ్ ఎకానమిక్ హిస్టరీ 1995, p 244
- ↑ 48.0 48.1 Gough, Hugh (1998). The Terror in the French Revolution. p. 77.
- ↑ డోయ్లే 1989, p. 258
- ↑ స్కామా 2004, p.616
- ↑ స్కామా 2004, p.641
- ↑ స్కామా 2004, p.637
- ↑ ఇన్ ఎ కార్నర్ ఆఫ్ ఫ్రాన్స్, లాంగ్ లివ్ ది ఓల్డ్ రెజిమే, న్యూయార్క్ టైమ్స్
- ↑ మెక్ఫీ, పీటర్ రివ్యూ ఆఫ్ రేనాల్డ్ సెచెర్, ఏ ఫ్రెంచ్ జెనోసైడ్: ది వెందే H-ఫ్రాన్స్ రివ్యూ వా. 4 (మార్చి 2004), నం. 26
- ↑ డేవిస్, నార్మ. యూరోప్: ఏ హిస్టరీ పిమ్లికో, (1997). p. 705
- ↑ స్కామా 2004, p.666
- ↑ ఫ్రెడెరిక్ ఆగ్రిస్, హెన్రీ అగ్రిస్, జనరల్ ఏ 18 ఆన్స్ , ఎడిషన్స్ డూ చోలెటాయిస్, 1996
- ↑ జీన్-క్లెమెంట్ మార్టిన్, కాంట్రే-రివల్యూషన్, రివల్యూషన్ ఇట్ నేషన్ ఇన్ ఫ్రాన్స్, 1789-1799 , ఎడిషన్స్ డూ సెయిల్, కలెక్షన్ పాయింట్స్, 1998, p. 219
- ↑ జీన్-క్లెమెంట్ మార్టిన్, గుర్రే డే వెందే, డాన్స్ ఎల్ ఎన్సైక్లోపీడియా బోర్డాస్, హిస్టోయిరే డే లా ఫ్రాన్స్ ఇట్ డెస్ ఫ్రాన్సియిస్, ప్యారిస్, ఎడిషన్స్ బోర్డాస్, 1999, p 2084, ఇట్ కాంట్రే-రివల్యూషన్, రివల్యూషన్ ఇట్ నేషన్ ఎన్ ఫ్రాన్స్, 1789-1799, p.218.
- ↑ జీన్-క్లెమెంట్ మార్టిన్, వైలెన్స్ ఇట్ రివల్యూషన్. Essai sur la naissance d'un mythe national , éditions du Seuil, 2006, p. 181
- ↑ రేనాల్డ్ సెచెర్ ప్రకారం 117 000, La Vendée-Vengé, le Génocide franco-français (1986); జీన్-క్లెమెంట్ మార్టిన్ ప్రకారం 200 000 - 250 000, La Vendée et la France , Éditions du Seuil, కలెక్షన్ పాయింట్స్, 1987; లూయిస్-మారియే క్లెనెట్ ప్రకారం 200 000, La Contre-révolution , ప్యారిస్, PUF, కలెక్షన్ Que sais-je?, 1992; జాక్యూస్ హుస్సెనెట్ ప్రకారం 170 000(dir.), « Détruisez la Vendée ! » Regards croisés sur les victimes et destructions de la guerre de Vendée , La Roche-sur-Yon, Centre vendéen de recherches historiques, 2007, p.148.
- ↑ ఇన్ ఎ కార్నర్ ఆఫ్ ఫ్రాన్స్, లాంగ్ లివ్ ది ఓల్డ్ రెజిమే. ది న్యూ యార్క్ టైమ్స్ జూన 17, 1989
- ↑ Michel Vovelle, « L'historiographie de la Révolution Française à la veille du bicentenaire », Estudos avançados , octobre-décembre 1987, volume 1, n° 1, p. 61-72. http://www.scielo.br/scielo.php?pid=S0103-40141987000100006&script=sci_arttext ou http://www.scielo.br/pdf/ea/v1n1/v1n1a06.pdf
- ↑ స్కామా 2004, p.646
- ↑ జీన్-బాప్టిస్టే క్యారియర్, ఎన్సైక్లోపిడియా బ్రిటానికా
- ↑ స్కామా 2004, p.658
- ↑ స్కామా 2004, p.689
- ↑ స్కామా 2004, p.706
- ↑ 69.0 69.1 డోయ్లే 1989, p.320
- ↑ Cole et al 1989, p.39
- ↑ డోయ్లే 1989, p.331
- ↑ డోయ్లే 1989, p.332
- ↑ రిచర్డ్ H. గ్రోవే, “గ్లోబల్ ఇంప్యాక్ట్ ఆఫ్ ది 1789–93 ఎల్ నానో,” నేచుర్ 393 (1998), 318-319
This article incorporates text from a publication now in the public domain: Chisholm, Hugh, ed. (1911). Encyclopædia Britannica (11th ed.). Cambridge University Press.మూస:Mignet
ఉదహరించిన కార్యక్రమాలు[మార్చు]
- Carlyle, Thomas (2002) [1837]. The French Revolution: A History. The Modern Library. ISBN 0375760229.
- Cole, Alistair; Peter Campbell (1989). French electoral systems and elections since 1789. Gower.
- Doyle, William (1990). The Oxford history of the French Revolution (3rd ed.). Oxford: Oxford University Press. ISBN 0192852213.
- Doyle, William (2001). The French Revolution: A very short introduction. Oxford: Oxford University Press. ISBN 0192853961.
- Doyle, William (2002). The Oxford history of the French Revolution (2nd ed.). Oxford University Press. ISBN 019925298X.
- Frey, Linda; Marsha Frey (2004). The French Revolution. Westport, Connecticut: Greenwood Press. ISBN 0313321930.
- Furet, Francois (1995). Revolutionary France, 1770-1880. Blackwell Publishing. ISBN 0631198083.
- Hibbert, Christopher (1980). The Days of the French Revolution. New York: Quill, William Morrow. ISBN 0688037046.
- Lefebvre, Georges (1971). The French Revolution: From Its Origins to 1793. Columbia University Press. ISBN 0231085982.
- Neely, Sylvia (2008). A Concise History of the French Revolution. Rowman & Littlefield. ISBN 0742534111.
- Rude, George (1991). The French Revolution: Its Causes, Its History and Its Legacy After 200 Years. Grove Press. ISBN 0802132723.
- Schama, Simon (2004) [1989]. Citizens. Penguin. ISBN 0141017279.
- Soboul, Albert (1977). A short history of the French Revolution: 1789-1799. University of California Press, Ltd. ISBN 0520034198. Unknown parameter
|translator=
ignored (help)
చారిత్రక యుగం[మార్చు]
Preceded by The Old Regime |
French Revolution 1789-1792 |
Succeeded by First French Republic |
బయటి లంకెలు[మార్చు]
Script error: No such module "Side box".
- ఓపెన్ యూనివర్సిటీ కోర్స్
- కొలంబియా ఎన్సైక్లోపిడీయా నుండి ఎంట్రీ ఆన్ Encyclopedia.com
- ఇంటర్నెట్ మోడరన్ హిస్టరీ సోర్స్బుక్ నుండి ప్రైమరీ సోర్స్ డాక్యుమెంట్స్
- లిబర్టీ, ఈక్వాలటీ, ఫ్రాటెర్నెటీ: ఎక్స్ప్లోరింగ్ ది ఫ్రెంచ్ రివల్యూషన్, చరిత్ర మరియు కొత్త మాధ్యమానికి కేంద్రం (జార్జ్ మాసన్ యూనివర్సిటీ) మరియు అమెరికన్ సామాజిక చరిత్ర ప్రాజెక్ట్ (న్యూయార్క్ యొక్క సిటీ యూనివర్సటీ)లచే ఒక సహకార సైట్
- ది ఆరిజన్ ఆఫ్ ది ఫ్రెంచ్ రివల్యూషన్, ది ఫ్రెంచ్ రివల్యూషన్: ది మోడరేట్ స్టేజ్, 1789-1792 మరియు ది ఫ్రెంచ్ రివల్యూషన్: ది రాడికల్ స్టేజ్, 1792-1794, ది హిస్టరీ గైడ్: లెక్చర్స్ ఆన్ మోడరన్ యూరోపియన్ ఇంటెలెక్చువల్ హిస్టరీ నుండి మూడవ అధ్యయాలు
- వాన్సే, S. ది కాహైర్స్ డె డోలీన్సెస్ 1789, సిలియో హిస్టరీ జర్నల్, 2008.
- ఫ్రెంచ్ విప్లవం నేపథ్యంగా వెలవడ్డ ప్రఖ్యాత నవల టేల్ ఆఫ్ టూ సిటీస్ కి అనువాదం
- గూగుల్ అనువాద వ్యాసాలు
- All articles with unsourced statements
- Articles with unsourced statements from May 2009
- Articles with invalid date parameter in template
- తెగిపోయిన ఫైలులింకులు గల పేజీలు
- Articles containing explicitly cited English-language text
- Articles with unsourced statements from October 2008
- Articles with unsourced statements from January 2009
- All articles with specifically marked weasel-worded phrases
- Articles with specifically marked weasel-worded phrases from January 2009
- ఫ్రెంచ్ విప్లవం
- 18వ-శతాబ్ద తిరుగుబాటుదార
- 18వ-శతాబ్ద విప్లవాలు