ఆవేటి పూర్ణిమ
ఆవేటి పూర్ణిమ | |
---|---|
ఆవేటి పూర్ణిమ
|
|
జననం | 1918 మార్చి 1 అత్తిలి |
మరణం | 1995 నవంబరు 26 ఏలూరు |
ప్రసిద్ధి | తెలుగు రంగస్థల నటీమణి |
Partner(s) | ఆవేటి రామయ్య |
ఆవేటి పూర్ణిమ (1918 - 1995) ప్రముఖ తెలుగు రంగస్థల నటీమణి.[1]
కుటుంబ చరిత్ర[మార్చు]
ఈమె 1918 మార్చి 1 తేదీన అత్తిలి లో నడియేటి పడవలో సురభి లక్ష్మమ్మ మరియు వనారస గోవిందరావు లకు జన్మించారు. ఈమె 15వ ఏటనే ఆవేటి రామయ్య గారిని వివాహమాడారు. ఈమె 1995 నవంబరు 26 తేదీన ఏలూరు లో స్వర్గస్తులయ్యారు.
నాటకరంగ చరిత్ర[మార్చు]
తెలుగు టాకీ యుగ ప్రారంభంతో ప్రముఖ నటీమణులు సినిమాకి వెళ్ళిన తరుణం లో నాటకరంగంలో స్త్రీ పాత్రధారిణులకు కొరత ఏర్పడింది. ఈ స్థితిలోనే పూర్ణిమ రంగస్థలంమీద అవతరించింది. పుట్టింటివారి శిక్షణలో బాలనటిగా ఈమె నటనా జీవితం మొదలైంది. వివాహానంతరం 1936 లో శ్రీ శారదా మనోవినోదిని పేరిట స్థాపించిన స్వంత నాటక కంపెనీలో నాయిక పాత్రధారిణిగా ఎంతో ప్రజాదరణను చేకూర్చుకొంది. "ఆనాటి ప్రసిద్ధ నటులందరి ప్రక్కన అన్ని నాటకాల్లోనూ ఆవేటి పూర్ణిమ స్త్రీ పాత్రలు ధరించారు. సారంగధర, చిత్రనళీయం , హరిశ్చంద్ర, తులాభారం, చింతామణి, విప్రనారాయణ, కృష్ణలీల, సావిత్రి, పాదుకా పట్టాభిషేకం , భక్త ప్రహ్లాద, మండోదరి, ఖిల్జీరాజ్య పతనం, కోకిల, ధరణికోట మొదలైన నాటకాలలో స్త్రీ పాత్రలన్నిటిని నటించేది." [2] ఈవిడ పౌరాణిక పాత్రలే కాకుండా చారిత్రక పాత్రలు కూడా ధరించారు. 1944లో పూర్ణిమా ఆర్టు థియేటర్సు ను స్థాపించి స్వీయ సారధ్యంలో ఎన్నో నాటకాలను సమర్ధవంతంగా నిర్వహించి పేరు ప్రఖ్యాతులు పొందారు. సత్యభామ, సక్కుబాయి, సావిత్రి, చిత్రాంగి, ప్రమీల, చంద్రమతి, మల్లమాంబ, కమల వంటి నాయిక పాత్రలు ఆమె నటజీవితంలో మైలురాళ్లుగా నిలిచాయి.
అవార్డులు[మార్చు]
- ఆంధ్రనాటక కళాపరిషత్తు ప్రప్రధమంగా మద్రాసు లో 1941 లో నాటకపోటీలు జరిపినపుడు ఉత్తమనటి బహుమతిని అందుకుంది.[3]
సినిమారంగ చరిత్ర[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ "20వ శతాబ్ది తెలుగు వెలుగులు" (మొదటి భాగం), పేజీ. 351-2. తెలుగు విశ్వవిద్యాలయం, 2005.
- ↑ మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి: "నటరత్నాలు", పేజి 307. సీతారత్నం గ్రంధమాల, 2002
- ↑ మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి: "నటరత్నాలు", పేజి 308. సీతారత్నం గ్రంధమాల, 2002