నవంబర్ 15
వికీపీడియా నుండి
నవంబర్ 15, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 319వ రోజు (లీపు సంవత్సరము లో 320వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 46 రోజులు మిగిలినవి.
<< | నవంబర్ | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
29 | 30 | |||||
2015 |
సంఘటనలు[మార్చు]
- 1937: కోస్తాంధ్ర , రాయల సీమ ప్రాంతాలు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు, ఈ రెండు ప్రాంతాల నాయకులు, శ్రీ బాగ్ ఒడంబడిక పై సంతకాలు చేసారు. దాని ప్రకారం, రాజధాని, హై కోర్టు, విశ్వ విద్యాలయం ఒకే చోట కాకుండా, వేరు వేరు ప్రాంతాలలో ఉండాలి. దాని ప్రకారం, గుంటూరు లో 5 జూలై 1954 నాడు హై కోర్టుని నెలకొల్పారు. కర్నూలు ను (రాయల సీమ) రాజధాని ని చేసారు. విశ్వవిద్యాలయం విశాఖపట్నం లో ఉంది (ఆంధ్ర విశ్వ కళా పరిషత్).
- 1954: టంగుటూరి ప్రకాశం పంతులు ఆంధ్ర రాష్ట్రం (ఆంధ్రప్రదేశ్ కాదు) ముఖ్యమంత్రి గా పదవీ విరమణ (1 అక్టోబర్ 1953 నుంఛి 15 నవంబర్ 1954 వరకు)
- 1954: ఆంధ్ర రాష్ట్రం లో (ఆంధ్రప్రదేశ్ కాదు) రాష్ట్రపతి పాలన మొదలు (15 నవంబర్ 1954 నుంచి 28 మార్చి 1955 వరకు).
- 1993: ఇండియన్ ఎయిర్లైన్స్ కు చెందిన విమానం ఒకటి 272 మంది ప్రయాణీకులతో తిరుపతి దగ్గర పొలాల్లో దిగింది. ప్రయాణీకులంతా క్షేమంగానే ఉన్నారు
- 2000: 108 రోజుల నిర్బంధం తరువాత కన్నడ నటుడు రాజ్కుమార్ ను వీరప్పన్ విడిచిపెట్టాడు.
- 2000: భారతదేశంలో కొత్తగా ఝార్ఖండ్ రాష్ట్రం ఏర్పడింది. బీహార్ రాష్ట్రాన్ని విభజించి ఛోటానాగ్పూర్ ప్రాంతంలో ఈ రాష్ట్రాన్ని ఏర్పాటుచేశారు.
జననాలు[మార్చు]
- 1898: కల్లూరి చంద్రమౌళి, స్వాతంత్ర్య సమరయోధుడు,మంత్రిపదవి, తిరుమల తిరుపతి దేవస్థానములకు అధ్యక్షునిగా కూడా పనిచేశాడు
- 1902 - గోరా (Gora) గా ప్రసిద్ధి చెందిన హేతువాది భారతీయ నాస్తికవాద నేత గోపరాజు రామచంద్రరావు, [మ.1975]
- 1927: నల్లాన్ చక్రవర్తి శేషాచార్లు, తెలుగు సాహిత్యంపై మక్కువతో పదవీ విరమణ తర్వాత రచనా వ్యాసంగంలో కృషిచేశారు. వీరు వివిధ అవధానాలలో పృచ్చకునిగా పాల్గొన్నారు
- 1935:తెన్నేటి హేమలత,లత గా ప్రసిద్ధిచెందిన తెన్నేటి హేమాలత నవలా రచయిత్రి
- 1949: మల్లాది వెంకట కృష్ణమూర్తి, 125 దాకా నవలలు, 3000 పైచిలుకు కథలు, కొన్ని వ్యాసాలూ,ఆధ్యాత్మిక విషయాల మీద డజనుకి పైగా పుస్తకాలు రాసారు
- 1986: సానియా మీర్జా,భారతదేశమహిళా టెన్నిస్ క్రీడాకారిణి, 2004లో భారత ప్రభుత్వం అర్జున అవార్డు అందజేసింది
మరణాలు[మార్చు]
- 1949: గాంధీని హత్య చేసిన వారిలో ప్రధాన పాత్రధారుడు నాథూరామ్ గాడ్సే
- 1949: ఆర్.ఎస్.ఎస్. కార్యకర్త మరియు గాంధీ హత్య కేసు నిందితులలో ఒకరు నారాయణ్ ఆప్తే
- 1997: లత లత గా ప్రసిద్ధిచెందిన నవలా రచయిత్రి తెన్నేటి హేమాలత.
- 2012: వేదాంతం సత్యనారాయణ శర్మ, కూచిపూడి నృత్య కళాకారుడు, నటుడు. (జ.1935)
పండుగలు మరియు జాతీయ దినాలు[మార్చు]
- [[]] - [[]]
బయటి లింకులు[మార్చు]
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : నవంబర్ 15
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
నవంబర్ 14 - నవంబర్ 16 - అక్టోబర్ 15 - డిసెంబర్ 15 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |