మార్చి 1
వికీపీడియా నుండి
మార్చి 1, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 60వ రోజు (లీపు సంవత్సరము లో 61వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 305 రోజులు మిగిలినవి.
<< | మార్చి | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
29 | 30 | 31 | ||||
2015 |
సంఘటనలు[మార్చు]
- 1768: మార్చి 1 , 1768 లో సంతకాలు చేసిన మరో ఒప్పందం ద్వారా షా ఆలం దానాన్ని అంగీకరించి సర్కారులను కంపెనీకి అప్పగించి, తమ స్నేహానికి గుర్తుగా, నిజాము, 50,000 భరణం పొందాడు. చివరికి, 1823 లో ఉత్తర సర్కారులపై పూర్తి హక్కులను నిజాము నుండి కొనేసాక అవి బ్రిటిషు వారి అధీనమై పోయాయి. సర్కారులు మద్రాసు ప్రెసిడెన్సీ లో భాగమవగా, ప్రస్తుతపు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలున్న ప్రాంతాన్ని గోదావరి జిల్లా గా ఏర్పరిచారు. బ్రిటిషు పాలన, 1768-1947. చూడు తూర్పు గోదావరి జిల్లా చరిత్ర చూడు: ఏప్రిల్ 15
- 1925: గోదావరి జిల్లా ను, కృష్ణా జిల్లా ను విడదీసి, 15 ఏప్రిల్ 1925 , 1925 లో, పశ్చిమ గోదావరి ప్రత్యేక జిల్లాగా ఏర్పడింది. అప్పటినుండి, గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా ఏర్పడిన తరువాత, తూర్పు గోదావరి జిల్లా గా పేరు మార్చుకొంది. తూర్పు గోదావరి జిల్లా నుంచి విశాఖపట్నం జిల్లా ఏర్పడింది.విశాఖపట్నం జిల్లా నుంచి, శ్రీకాకుళం జిల్లా 15 ఆగష్టు 1950 నాడు ఏర్పడింది. విశాఖపట్నం జిల్లా లోని కొంత భాగం, శ్రీకాకుళం జిల్లా నుంచి మరి కొంతభాగం కలిపి 1 జూన్ 1979 న విజయనగరం జిల్లా ఏర్పడింది. చూడు: తూర్పు గోదావరి జిల్లా ప్రభుత్వ వెబ్సైటు
- 1925:బ్రిటిష్ వారి కాలంలో ఈ ప్రాంతం పాలన మచిలీపట్నం కేంద్రంగా సాగింది. 1794 లో కాకినాడ, రాజమండ్రిల వద్ద వేరే కలక్టరులు నియమితులయ్యారు. 1859లో కృష్ణా, గోదావరి జిల్లాలను వేరు చేశారు. తరువాత చేపట్టిన పెద్ద నీటిపారుదల పథకాల కారణంగా జిల్లాలను పునర్విభజింపవలసి వచ్చింది. 1904 లో యర్నగూడెం, ఏలూరు, తణుకు, భీమవరం, నరసాపురం ప్రాంతాలను గోదావరి నుండి కృష్ణా జిల్లాకు మార్చారు. 1925 ఏప్రిల్ 15న కృష్ణా జిల్లాను విభజించి పశ్చిమ గోదావరి జిల్లాను ఏర్పరచారు. (గోదావరి జిల్లా పేరు తూర్పు గోదావరిగా మారింది). తరువాత 1942 లో పోలవరం తాలూకాను తూర్పు గోదావరి నుండి పశ్చిమ గోదావరికి మార్చారు.[1] చూడు: పశ్చిమ గోదావరి జిల్లా
- 2008: బంగ్లాదేశ్ తో చిట్టగాంగ్ లో జరుగిన టెస్ట్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా ఓపెనర్లు మెంకంజీ, జి.సి.స్మిత్లు తొలి వికెట్టుకు 415 పరుగులు జోడించి కొత్త ప్రపంచ రికార్డు సృష్టించారు.
జననాలు[మార్చు]
- 1887: చెరుకువాడ వేంకట నరసింహం, ఉపన్యాస కేసరి, బీమాడిండిమ, ఆంధ్ర డెమొస్తనీస్. (మ.1964)
- 1901: నల్లపాటి వెంకటరామయ్య, ఆంధ్ర రాష్ట్ర ప్రధమ శాసనసభ స్పీకర్. (మ.1983)
- 1908: ఖండవల్లి లక్ష్మీరంజనం, సుప్రసిద్ధ సాహిత్యవేత్త మరియు పరిశోధకులు. (మ.1986)
- 1918: ఆవేటి పూర్ణిమ, ప్రముఖ తెలుగు రంగస్థల నటీమణి (మ.1995)
- 1942: కె.జె.రావు, భారత ఎన్నికల కమీషన్ పరిశీలకులు, బీహార్ లాంటి ప్రమాదకర రాస్ట్రం లో ఎనికల ప్రక్రియను గాడిలో పెట్టిన ధీరుడు.
- 1951: నితీశ్ కుమార్, బీహార్ ముఖ్యమంత్రి.
- 1955: వెలమల సిమ్మన్న, బహు గ్రంధకర్త, శతాధిక విమర్శనాత్మక వ్యాస రచయిత, సుప్రసిద్ధ భాషా శాస్త్రవేత్త, ప్రముఖ విమర్శకులు.
- 1983: ప్రకాష్ చిమ్మల, ఆంధ్రప్రదేశ్ పాత్రికేయులు.
- 1986: ఎన్. సి. కారుణ్య, పాడుతా తీయగా కార్యక్రమంలో విజేతగా నిలిచాడు. ఇతడి రెండవ ఆల్బమ్ సాయి మాధురి ని శ్రీ సత్యసాయి బాబా సమక్షంలో విడుదల చేశాడు.
మరణాలు[మార్చు]
- 1989: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వసంత్దాదా పాటిల్.
- 1997: యలమంచిలి వెంకటప్పయ్య, స్వాతంత్ర్య సమర యోధుడు. కాకినాడ లో 1920 లో జరిగిన జాతీయ కాంగ్రెస్ సభలలో బ్రాహ్మణులకు ప్రత్యేక భోజన శాల ఉండటానికి వీల్లేదని అందరూ కలిసే తినాలనీ తీర్మానం చేయించాడు,
పండుగలు మరియు జాతీయ దినాలు[మార్చు]
- -
బయటి లింకులు[మార్చు]
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : మార్చి 1
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
ఫిబ్రవరి 28 - ఫిబ్రవరి 29 - (ఫిబ్రవరి 30) - మార్చి 2 - ఫిబ్రవరి 1 - ఏప్రిల్ 1 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |
రెత్రేతెర్త్ూబూ ూపగ్ల