-రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర హోంశాఖ లేఖలున్యూఢిల్లీ, మే 19: మాజీ ప్రధాని రాజీవ్గాంధీ వర్ధంతి సందర్భంగా ఈ నెల 21న ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవంగా పాటించాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ సందర్భంగా ప్రతిజ్ఞలు నిర్వహించాలని రాష్ర్టాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, కేంద్ర పాలిత ప్రాంతాల అధికారులు, కేంద్ర ప్రభుత్వశాఖల కార్యదర్శులకు కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి సత్పాల్ చౌహాన్ లేఖలు రాశారు.