ఛైల్డ్ లేబర్ మాఫియా గుట్టు రట్టైంది..
Posted On 126 days 22 hours 52 mins ago
హైదరాబాద్ : ఛైల్డ్ లేబర్ మాఫియా గుట్టు రట్టైంది. ఇటీవల పాతబస్తీలో పలు ప్రాంతాల్లో వెట్టిచాకిరి చేస్తున్న బాలలను పట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో 74 మంది బాల కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలల హక్కు సంఘం, నార్త్ జోన్ పోలీసుల ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ జరిగింది. జన్మభూమి ఎక్స్ ప్రెస్ లో బాలలను అక్రమంగా తరలిస్తున్నట్లు బాలల హక్కు సంఘానికి సమాచారం అందింది. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు అందించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు రైలు రాగానే 74 మంది బాలలను స్వాధీనం చేసుకున్నారు. వీరంతా 14-18 సంవత్సరాల లోపు ఉన్నవారే. జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్ గఢ్ నుండి ఓ ముఠా హైదరాబాద్ కు తరలిస్తోందని బాలల హక్కు సంఘం పేర్కొంది. ఈ ఘటనలో కొంతమందిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని సంఘం నేతలు పేర్కొన్నారు. విచారణ తరువాత బాల కార్మికులను తరలిస్తున్న ఏజెంట్లను పట్టుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.
మరిన్ని సంబందిత వార్తలు
- ✦ ఉస్మానియా తరలింపుపై ఏం నిర్ణయం తీసుకుంటారో ?
- ✦ గోల్కొండలో మూడో పూజ..
- ✦ టి.సర్కార్ పై మున్సిపల్ జేఏసీ యుద్ధభేరీ..
- ✦ నగరంలో కమాండ్ అండ్ కంట్రోల్ సెంట్రల్..
- ✦ ఛైల్డ్ లేబర్ మాఫియా గుట్టు రట్టైంది..
- ✦ 'ఇండియన్ పోస్ట్ మ్యాన్' లో అందరూ తెలంగాణ వారేనట...
- ✦ నగరంలో మల్టీ లెవల్ ఫ్లైఓవర్ల నిర్మాణానికి అనుమతులు...
- ✦ నిజామాబాద్ లో వామపక్షాల బస్సు యాత్ర..
- ✦ విద్యార్థి ప్రాణం తీసిన టీచర్..
- ✦ రయ్..రయ్.. రయ్
- ✦ మళ్లీ సేమ్ సీన్స్..
- ✦ కొత్త రూణాలు ఎప్పుడో..?
- ✦ పరారీ ప్లాన్?
- ✦ ఈద్ ముబారక్..
- ✦ జీహెచ్ ఎంసీలో సమ్మె విరమించిన కార్మిక సంఘాలు..
- ✦ జీహెచ్ ఎంసీలో సమ్మె విరమించిన కార్మిక సంఘాలు..
- ✦ 'కేసీఆర్ ను జీహెచ్ ఎంసీ కమిషనర్ తప్పుదోవ పట్టిస్తున్నారు'
- ✦ మున్సిపాల్ కార్మికులకు మద్దతుగా టీ.కాంగ్రేస్ నిరసన
- ✦ ఖమ్మంలో విజయవంతంగా కొనసాగుతున్న బంద్
- ✦ పోరు గర్జన