ఛైల్డ్ లేబర్ మాఫియా గుట్టు రట్టైంది.. | Prajasakti::Telugu Daily

Home »

ఛైల్డ్ లేబర్ మాఫియా గుట్టు రట్టైంది..

Posted On 126 days 22 hours 52 mins ago

ఛైల్డ్ లేబర్ మాఫియా గుట్టు రట్టైంది..

హైదరాబాద్ : ఛైల్డ్ లేబర్ మాఫియా గుట్టు రట్టైంది. ఇటీవల పాతబస్తీలో పలు ప్రాంతాల్లో వెట్టిచాకిరి చేస్తున్న బాలలను పట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో 74 మంది బాల కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలల హక్కు సంఘం, నార్త్ జోన్ పోలీసుల ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ జరిగింది. జన్మభూమి ఎక్స్ ప్రెస్ లో బాలలను అక్రమంగా తరలిస్తున్నట్లు బాలల హక్కు సంఘానికి సమాచారం అందింది. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు అందించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు రైలు రాగానే 74 మంది బాలలను స్వాధీనం చేసుకున్నారు. వీరంతా 14-18 సంవత్సరాల లోపు ఉన్నవారే. జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్ గఢ్ నుండి ఓ ముఠా హైదరాబాద్ కు తరలిస్తోందని బాలల హక్కు సంఘం పేర్కొంది. ఈ ఘటనలో కొంతమందిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని సంఘం నేతలు పేర్కొన్నారు. విచారణ తరువాత బాల కార్మికులను తరలిస్తున్న ఏజెంట్లను పట్టుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.

Leave a Comment

మరిన్ని సంబందిత వార్తలు