Sunday, February 23, 2014

దళితుల కలికితురాయి ఈశ్వరీబాయి By ఆచార్య జి. వెంకట్రాజం


ఆంధ్రవూపదేశ్ రాజకీయాలతో, దళిత సముద్ధరణతో పరిచయమున్న వారందరూ జె.ఈశ్వరీబాయి పేరు విని ఉంటారు. ఆమె నిజాం రాష్ట్రంలో తెలుగువారి ముద్దుబిడ్డ. ధైర్యసాహసాలున్న వీరవనిత, చైతన్య ఉద్యమ స్వరూపిణి. సంఘసేవా పరాయణురాలు, బలహీన దళిత పీడిత ప్రజల ఉద్ధారకురాలు, అంబేద్కర్ అడుగుజాడలో నడిచినవారు, రాజకీయ నాయకురాలు, మంచి శాసనసభ్యురాలు. ఆమెది కళ్లలా కపటంలేని నిర్మల హృదయం. లంచగొండి అధికారులకు సింహస్వప్నం. ఆమెకు ప్రజాసేవయే జీవిత పరమార్థం. రాజకీయ రంగంలో నైతిక విలువల కోసం పోరాటం సాగించిన ధైర్యశాలి. వారికి అకుంఠిత దేశభక్తి, దేశాభిమానం ఉన్నది. ఆమె మానవతావాది, నిగర్వి నిరాడంబరి, నిస్వార్థ సంఘసేవిక, ప్రస్తుతం ఆంధ్రవూపదేశ్ రాజకీయాల్లో తనదైన ముద్రను వేసుకొన్న డాక్టర్ జె.గీతాడ్డి కన్న తల్లి. 1918 డిసెంబర్ 1న సామాన్య దళిత కుటుంబం లో పుట్టారు. వారి తల్లి రాములమ్మ, తండ్రి బల్లెపు బలరామస్వామి. ఆయన నిజాం స్టేట్ రైల్వేస్‌లో పనిచేశారు. వారు సికింవూదాబాద్‌లోని చిలకలగూడలో నివసించారు. బలరామస్వామికి ఆరుగురు సంతానం. నలుగురు అబ్బాయిలు-బాబురావు, పాండురంగం, కిషన్, రవీందర్. ఇద్దరు అమ్మాయి- ఈశ్వరీబాయి, మాణికమ్మ పెద్దన్న బాబూరావు. వీరి జీవితంలోని ఒడుదుడుకుల్లో అండదండగా నిలచారు.

ఈశ్వరీబాయి సికింవూదాబాద్‌లోని ఎస్‌పీజీ మిషన్ పాఠశాలలో ప్రాథమిక విద్యను కీస్ హైస్కూల్‌లో ఉన్నత విద్యను అభ్యసించారు. వారికి తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లిషు, మరాఠీ భాషల్లో ప్రావీణ్యం ఉంది. స్వశక్తిపై జీవించాల్సిన అవసరం వచ్చినప్పుడు సికింవూదాబాద్‌లోని ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేశారు. దీనితోపాటు సంపన్నవంతుల ఇళ్ళలో పిల్లలకు ట్యూషన్ కూడా చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన రేషనింగ్ శాఖలో కొంతకాలం ఉద్యోగం చేశారు. తల్లిదంవూడుల కోరిక మేరకు పూనాలోని ధనిక కుటుంబానికి చెందిన దంత వైద్యుడు డాక్టర్ లక్ష్మినారాయణతో పదమూడేళ్ల వయస్సులోనే పెళ్ళయింది. వారి వైవాహిక జీవితం కొంతకాలంపాటు సాఫీగా సాగింది. వారికి జన్మించిన అమ్మాయే డాక్టర్ జె. గీతాడ్డి. వీరు ఆంధ్రవూపదేశ్ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర వహిస్తున్నారు. దురదృష్టవశాత్తు ఈశ్వరీబాయికి భర్తతో మనస్పర్ధ లు వచ్చి తన పుట్టింటికి వచ్చారు.

ఈశ్వరీబాయి జీవితం వడ్డించిన విస్తరి కాదు. జీవితంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. వైవాహిక జీవితంలో విడిపోయిన తరువాత వారు సంఘసేవ వైపు దృష్టి మళ్లించారు. ఈ నేపథ్యంలో అంబేద్కర్ ఉపన్యాసం, సిద్ధాంతాలు, ఆశయాలు, భావజాలం పట్ల ఆకర్షితురాలైంది. సమాజంలోని హెచ్చుతగ్గులు, కటిక పేదరికం, అంధ విశ్వాసాలు , అమాయకత్వం, ఈర్ష్య దేషాలను నిశితంగా ఆలోచించినప్పుడు వారి మనసు కకావికం అయ్యేది. దీనికి పరిష్కారం అంబేద్కర్ ఆశయాలే అని గట్టిగా భావించారు.
1951లో హైదరాబాద్, సికింవూదాబాద్ నగరాల పురపాలక సంఘం ఎన్నికలు ప్రప్రథమంగా జరిగాయి. అప్పటిదాకా నిజాం ఫర్మానాతో ఏర్పడే పురపాలక సంఘం మొదటిసారిగా ప్రజాస్వామ్యరీతిలో ఓటింగ్ పద్ధతిలో పురుడు పోసుకోవడానికి శ్రీకారం చుట్టింది. ఆనాడు జంటనగరాల్లో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్, సోషలిస్ట్ పార్టీలు బలమైన రాజకీయ పార్టీలు, అయినప్పటికీ ఈశ్వరీబాయి చిలకలగూడ వార్డు నుంచి ఎన్నికయ్యారు. అర్థబలం, అంగబలం, పార్టీబలం లేకున్న వారు స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించడం వారికే సాధ్యమయింది.

ఈ విజయం వెనక శ్రమించినవారు వారి సోదరుడు కిషన్ ఈశ్వరీబాయి తనవార్డులో రోడ్లు వెడల్పు చేయించారు.వీధుల్లో నల్లాలు ఏర్పాటు చేయించారు. వీధిదీపాలు, మరుగుదొడ్లు వంటి ప్రజాసౌకర్యాలను కల్పించారు.అంతేకాక రెక్కాడితే డొక్కాడని కార్మికులకు ఇళ్లస్థలాలను ఇప్పించారు. ఆమె అనేక కమిటీలో సభ్యురాలుగా ఉన్నందున ఎందరో ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు ఏర్పడ్డాయి. మున్సిపల్ కౌన్సిలర్‌గా నగరాభివృద్ధికి శక్తివంచన లేకుండా అహర్నిశలు శ్రమించారు.

1967లో ఆంధ్రవూపదేశ్ రాష్ట్ర శాసనసభకు జరిగిన సార్వవూతిక ఎన్నికలు జరిగాయి. ఈశ్వరీబాయి నిజామాబాద్ జిల్లా శాసనసభ నియోజకవర్గం నుంచి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా పోటీ చేశారు. వీరిపై భారత జాతీయ కాంగ్రెస్ పార్టీనుంచి అప్పటి దేవాదాయ ధర్మాదాయ శాఖామంత్రి టి. సదాలక్ష్మీ పోటీచేశారు. అయినప్పటికీ విజయబావుటాను మరోసారి ఎగురవేశారు.వారు శాసనసభలో ప్రజోపయోగకరమైన ప్రశ్న లు వేసి ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. ఆమె అనేక పాలన సంస్కరణలకు వెన్నంటి నిలిచారు. విద్యారంగంలో, స్థానిక పరిపాలనాశాఖలో అనేక సంస్కరణలను తెచ్చారు. స్టాంపు డ్యూటి పెంపును అడ్డుకోవడంతో చైనా భారత రాయబార కార్యాలయంపై జరిగిన దాడిని ఖండించడంలో ప్రము ఖ పాత్ర వహించారు. తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాలను ఎండగట్టడంలో చేనేత ఉత్పత్తుల పన్నురద్దులో, ప్రభుత్వ సంస్థల పక్షపాత వైఖరులను వెలుగులోకి తేవడంలో వెన్నుముకగా నిలిచారు. 1972 లో రాష్ట్ర శాసనసభకు రెండోసారి ఎన్నికయ్యారు. అంతేకాక రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలో ప్రముఖ పాత్ర పోషించారు. ఆంధ్రవూపదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నాయకురాలుగా ఒక సంవత్సరం పనిచేశారు.

1951లో జగజ్జీవన్‌రామ్ నాయకత్వంలోని దళిత లీగ్ శాఖను హైదరాబాద్‌లో స్థాపించారు. షెడ్యూల్డ్ కులాల అభ్యున్నతికి పనిచేసే నాలుగు సంస్థల్లోని యునైటెడ్ షెడ్యూల్డ్ కులాల ఫెడరేషన్, దళిత జాతీయ సమాఖ్య, దళిత వర్గాల లీగ్. 1957లో తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల షెడ్యూల్డ్ కులాల సమాఖ్యలు విలీనమై ఆంధ్రవూపదేశ్ షెడ్యూల్డ్ కులాల ఫెడరేషన్ ఏర్పడింది. అందులో ఈశ్వరీబాయి ప్రధానకార్యదర్శిగా పనిచేశారు. 1958లో సికింవూదాబాద్‌లో జరిగిన షెడ్యూల్డ్ కులాల కార్యకర్తలు, నాయకులు సభలో పాల్గొన్నారు.

1960లో జరిగిన ఆంధ్రవూపదేశ్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండి యా సంస్థాగత ఎన్నికల్లో వారు ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక అయ్యారు. 1962లో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రవూపదేశ్ శాఖకు కార్యదర్శి అయ్యారు. జీవితాంతం ఆపార్టీలో పనిచేశారు. వీరు దళితులపై జరుగుతున్న అక్రమాలపై తన వాణిని వినిపించారు. అందులో దళితులపై అత్యాచారాలు, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ తాలూకా జనంపేటలో దళితులపై భూస్వాముల అత్యాచారాలు, కృష్ణా జిల్లా వణుకూరు గ్రామంలో దళితులను వెలికితీయడం వంటి సంఘటనలను, ఖమ్మంజిల్లాలో సంఘటనలు ప్రభుత్వ దృష్టికి తెచ్చారు. వరద బాధితులకు సహాయం, మహిళా సంక్షే మం, శాంతిభవూదతలువంటి అనేక అంశాలపై శాసనసభలో తనగొంతును వినిపించారు. అనారోగ్యంతో 1991 ఫిబ్రవరి 23న తుదిశ్వాస వదిలారు.
‘మా అమ్మగారు ప్రతి విషయంలోనూ క్రమశిక్షణ పాటించేవారు. సమయపాలనతోపాటు ప్రతిపని అత్యంత సమర్థత శ్రద్ధతో నిర్వహించేవారు. నన్ను ఎంతో క్రమశిక్షణతో పెంచారు. చిన్నవయస్సులోనే బాలబాలికలకు మంచి విషయాలు బోధించాలని పెద్దలపట్ల వినయవిధేయతలు, తోటివారితో వాత్సల్యం, గౌరవభావంతో మెలగడం వంటి అలవాట్లు నేర్పాలని ఆమె అభిలాషించే వారు’. అని గర్వంగా చెప్పుకునే ముద్దుపట్టి డాక్టర్ జె. గీతాడ్డిని కన్నతల్లి ఈశ్వరీబాయి.

-ఆచార్య జి. వెంకట్రాజం
ఉస్మానియా యూనివర్సిటీ
(నేడు ఈశ్వరీబాయి వర్ధంతి) Namasete Telangana Telugu News Paper Dated: 23/2/2014 

No comments:

Post a Comment