Showing posts with label చుక్కా రామయ్య. Show all posts
Showing posts with label చుక్కా రామయ్య. Show all posts

Thursday, October 13, 2011

ప్రజాస్వామ్యమే పరిశోధన By -చుక్కా రామయ్య Namasethe Telangana dated 14/102011

ప్రజాస్వామ్యమే పరిశోధన
Chukka-Ramaiah talangana patrika telangana culture telangana politics telangana cinema
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సందర్భంలో ఇటీవల నల్గొండ జిల్లాలో జనం తో కలిసి తిరిగాను. ఉద్యమాలు ఏదో ఒక నేపథ్యంలో సామాజిక కోణం నుంచి పుట్టుకొస్తూనే ఉంటాయి. సమస్యలకు పరిష్కారాలు ఉద్యమాల ద్వారానే సాధ్యమవుతాయని చరిత్ర చెబుతున్నది. అయితే తమ సమస్యల పరిష్కారానికి గళం విప్పడం ప్రజలకు ప్రజాస్వామ్య వ్యవస్థ ఇచ్చిన హక్కు. ఆ హక్కును కాలరాసే అధికారం ఏ పాలకులకూ లేదు. నల్గొండ జిల్లాలో ఇటీవ ల కొన్ని సంఘటనలలో పోలీసుల అఘాయిత్యాలు కళ్లారా చూశాను. ప్రజల నిస్సహాయత కూడా చూశా ను. ప్రజల కోపాగ్ని కట్టలు తెగడమూ చూశాను. నల్గొండ నుంచి రాత్రి 12 గంటలకు హైదరాబాద్ చేరుకున్నాను. నిత్య జీవిత కార్యక్షికమంగా మారిన వాకింగ్‌కు ఉద యం ఉస్మానియా విశ్వవిద్యాలయంలోకి వెళ్లాను. ఆ ఆవరణంతా కలియ తిరిగాను. విశ్వవిద్యాలయాలకు, ఈ ప్రజా ఉద్యమాలకు ఏమైనా సంబంధం ఉంటుందా? అని నాలో ఆలోచనలు మొదలయ్యాయి.


ప్రజా కార్యక్షికమాల లో పౌరులు భాగస్వాములు కావడం ప్రజాస్వామ్యంలో ఒక ప్రధానమైన భాగం. ఆ పనిలోంచి ప్రజలను వేరు చేసి చూడలేం. ప్రపంచంలోని అన్ని యూనివర్సిటీలు ప్రజలకు పాలకులకు మధ్యన ఏర్పడే అగాథాన్ని పూరించేందుకు పెనుగులాడుతున్నాయి. పరిశోధన అనగానే విశ్వవిద్యాలయాల గోడల వరకే, మేధావి వర్గం వరకే పరిమితం చేస్తారు. విశ్వవిద్యాలయాలు ఎంతో గొప్ప పరిశోధన చేస్తా యి. అంతటితో పరిమితం కాకుండా ప్రజాస్వామిక పాలనకు, జ్ఞాన సముపార్జనకు ఏర్పడ్డ అగాథాన్ని పూరించగలుగుతాయి. అంత శక్తిసామర్థ్యాలు విశ్వవిద్యాలయాలకున్నాయి. దాన్నే ‘యాక్షన్ రీసెర్చ్’ అంటారు. నేడు రీసెర్చ్ సమాజ ప్రగతి కోసం ఎంత ప్రధానమో? మానవ సంపద పెంచేందుకు ఎంత అవసరమో? ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కూడా ఈ పరిశోధన అంతే అత్యవసరమైనది. ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కూడా పరిశోధనలో ఒక భాగమైంది.

‘రీసెర్చ్ ఫర్ డెమోక్షికసీ’, ‘డెమోక్షికసీ ఫర్ రీసెర్చ్’. ప్రజలను పాలనా యంత్రాంగంలో భాగస్వామ్యం చేయడమంటే పాలనకు సంబంధించిన చర్చలలో భాగం చేయడమే. నిర్ణయాలు తీసుకోవడంలో భాగం చేయడమే. సమస్యలు పరిష్కరించడంలో భాగం చేయడమే. దీనితో పాలనా యంత్రాంగంలో ఉండే అధికారాలకు, సామాజిక కార్యకర్తలకు మధ్యనున్నటువంటి లోపాన్ని పూరించే అవకాశం ఉంటుంది. దీనివల్ల సామూహికమైన జ్ఞానం పెరిగే అవకాశం, ప్రభుత్వం పౌరుల సమస్యల ను అవగాహన చేసుకోవడానికి, ప్రజలు పాలనలో ఇబ్బందుల ను చూసేందుకు దానికి అవకాశం లభిస్తుంది. దీనిలో మూడంశాలు ఇమిడి ఉంటాయి.

1) చర్చించే వేదిక 2) నిర్ణయాలు చేసే ప్రజాస్వామ్యం 3) సమస్యను పరిష్కరించే ఆచరణాత్మక ప్రజాస్వామ్యం.
telangana talangana patrika telangana culture telangana politics telangana cinema
చర్చించే వేదిక అంటే సెక్ర చర్చలు మాత్రమే కాదు. అసెంబ్లీలో చర్చలు మాత్రమే కాదు. ప్రజలకు సంబంధించిన అంశాలపై గ్రామస్థాయి నుంచి చర్చలు జరగాలి. కొన్నిసార్లు వ్యక్తులతో చర్చలు జరుగుతాయి. కొన్నిసార్లు చిన్నచిన్న గ్రూపులతో చర్చలు జరుగుతాయి. కొన్నిసార్లు పంచాయితీ సభ్యులతో జరుగుతాయి. అంటే చర్చలను కిందిస్థాయి వరకు తీసుకుపోవాలి. సమస్యల పరిష్కారం మేధావి వర్గం, లేదా పాలనాపరమైన సొత్తు అనుకోకూడదు. కిందిస్థాయి గ్రామాల్లో ఉన్న సామాజిక కార్యకర్తలు కూడా చర్చలో భాగస్వాములు అయితే సమస్య పరిశోధనలో ఎక్కువ మంది భాగం అవుతారు. పరిష్కారాలు మేధావి వర్గం మెదళ్ల నుంచే వస్తాయని అనుకోవద్దు. అధికార పీఠాల నుంచే రాల్తాయని అస్సలు అనుకోకూడదు. నల్గొండలో జనంలో తిరుగుతుంటే సామాన్యమైన మనిషి ఎదుర్కొంటున్న సమస్యపైన, తెలంగాణలో రగులుతున్న ఉద్యమంపైన ఎంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారో కళ్లారా చూశాను. చర్చలు చేయడమే పరిశోధనకు మొదటి ప్రాతిపదిక.


అవి ఎంత విశాలంగా ఉంటే మనకంత విస్తృత సమాచారం లభిస్తుంది. వివిధ స్థాయిలలో ప్రతిరోజు ప్రజా సమస్యలపైన, రచ్చబండపైన చర్చలు జరుగుతాయి. ఆ చర్చలే రాష్ట్ర విధానాలకు కూడా ప్రాతిపదికలవుతాయి. రచ్చబండ కిందిస్థాయి చర్చలు కావు. అదొక పరిశోధన వేదిక. పరిశోధన ఎంత విశాలంగా ఉంటే ఫలితాలు కూడా అంత విస్తృతంగా ఉండే అవకాశాలుంటాయి.
నిర్ణయాలు చేసే ప్రజాస్వామ్యం: సమాజంలోని వివిధ వర్గాలకు వివిధ ఆశయాలు విభిన్నంగా ఉంటాయి. విభిన్నమైన నిర్ణయాలు కూడా ఒక్కొక్కసారి మొలకెత్తుతాయి. విభిన్న నిర్ణయాలలో ఏకత్వం, ఏకాభివూపాయం తేవడమే పరిశోధన లక్ష్యం కావాలి.

సమస్య పరిష్కారంలో సంబంధిత వ్యక్తులను కలిపితేనే కిందిస్థాయి బాధలు, కష్టాలు అర్థమవుతాయి. నిరంకుశ ప్రభుత్వాలలో నిర్ణయాలు పైనుంచి రుద్దబడతాయి. ప్రజాస్వామిక వ్యవస్థలో కింది నుంచి మొలకెత్తుతాయి. అవే ప్రజలను ప్రభుత్వం లో భాగస్వాములను చేస్తాయి. ప్రజాభివూపాయాన్ని, ఆచరణాత్మక ప్రజాస్వామ్యాన్ని చెప్పడానికి పాలకులు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలి. వాటిని గౌరవించే అలవాటు చేసుకోవాలి. అదే మాదిరిగా ఆ డేటాను సామరస్యంగా సేకరించడం, సహృదయంతో స్వీకరించడం ప్రజాస్వామ్యానికి కావల్సిన మొదటి లక్షణం.
విశ్వవిద్యాలయాల్లో ఉన్న రీసెర్చ్‌ను ప్రజాజీవితంలోకి తీసుకరావాలి. బ్రిటన్‌లో జరిగిన చిన్న సంఘటనను పార్లమెంటు వరకే పరిమితం చేయలేదు.

దానిపై కిందిస్థా యి నుంచి చర్చలకు అవకాశం కల్పించారు. అదే మాదిరిగా మనం డెమోక్షికసీ తెచ్చుకు న్నాం. కానీ డెమోక్షికటిక్ అటిట్యూడ్ తెచ్చుకోలేదు. ప్రజలను పాలితులుగా చూస్తున్నాం కానీ భాగస్వాములుగా చూడడం లేదు. ప్రజాస్వామ్య ముసుగులో ఫ్యూడల్ రాజకీయాలు నడుపుతున్నారు. పరిశోధనలో చిన్న పెద్దా అనేది ఉండదు. అందరూ సమానమే. నల్గొండలో పోలీసు దాడులకు గురైన ప్రాంతాలలో తిరుగుతుంటే ప్రతి ఊరు నాకొక పరిశోధనశాలగా కనిపించింది. అది నకెరేకల్ కావచ్చును, కోదాడ, సూర్యాపేట కావచ్చును. చౌటుప్పల్, చిట్యాలలు కావచ్చును. సమస్త తెలంగాణ జనం ఏకాక్షిగతతో చర్చిస్తున్నారు. బాధ్యతాయుతంగా ప్రజ లు ఆలోచిస్తున్నారు. దీన్ని ప్రభుత్వం సీరియస్‌గా పరిగణనలోకి తీసుకోవాలి. అలా చేస్తే ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచి ఫలితాలొస్తాయి.

మనకు ఒకరినొకరు విశ్వసించే అలవాటు కూడా ముఖ్యం. ఒకరిపై ఒకరికి విశ్వాసం లోపించకూడదు. ఆ ప్రజలకు సంబంధించిన సమస్యల సమాచారాన్ని విశ్లేషించే లక్షణముండాలి. ఆ సమాచారాన్ని ఆధారం చేసుకునే నిర్ణయాలు జరుగుతుండాలి. అప్పుడే సమస్య పరిష్కారంలో ప్రజలు భాగస్వాములవుతారు. అందుకే పరిశోధన అన్నది ప్రజాస్వామ్యం. అసలు ప్రజాస్వామ్యమే పరిశోధన.
-చుక్కా రామయ్య
ప్రముఖ విద్యావేత్త, శాసనమండలి సభ్యులు

Thursday, September 29, 2011

పాఠ్యపుస్తకాలలో తెలంగాణ భాషేది? By -చుక్కా రామయ్య Namasethe Telangana 30/09/2011

పాఠ్యపుస్తకాలలో తెలంగాణ భాషేది?
musal-talangana patrika telangana culture telangana politics telangana cinema
తెలంగాణ భాష వంకర భాష కాదు. ఇతర భాషలను జీర్ణం చేసుకునే విస్తృతి ఉన్న భాష. టీచర్ ఆ భాషలో, ఆ యాసలో మాట్లాడితేనే విద్యార్థి వింటాడు. విషయాన్ని తొందరగా అర్థం చేసుకో గలుగుతాడు. ఆ యాస భాషల్లోనే టీచర్ మాట్లాడాలి. అప్పుడే పిల్లలు మనం చెప్పే చదువులో తన జీవితాన్ని చూసుకుంటారు.


ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వాకింగ్ చేస్తుంటే, రాఘవడ్డి అనే పాత మిత్రుడు కలిశాడు. యిద్దరం మాట్లాడుకుం టూ నడుస్తున్నాం. ‘నిన్న వాకర్స్ మీటింగ్ అయ్యింద’ని చెప్పాడు. అందులో ‘నేనొక ప్రశ్నను గెలిచా’నన్నాడు. ‘ఏమి ప్రశ్న’ అన్నా ను. ‘చుక్కా రామయ్యది ఏ ఊరు?’ అని అడిగారు. ‘కొందరు భువనగిరి అని, కొందరు సిద్దిపేటని చెప్పారు. మరికొందరు మహబూబ్‌నగర్ జిల్లా అని చెప్పారు. ఆయనది వరంగల్ జిల్లా పాల్కురికి సోమనాథుడు జన్మించిన పాలకుర్తి పక్కనే ఉన్న గూడూరు’ అని నేను చెప్పాను. ‘గూడూరు ఊళ్లో ఒక గుడి ఉత్సవ కార్యక్షికమం జరుగుతున్నప్పుడు అక్కడికి వెళ్లానని, ఆ గుడిని రామయ్య తండ్రి కట్టించారు. అప్ప టి నుంచి రామయ్య తెలుసునని వాకర్స్ మీటింగ్‌లో చెప్పాన’ని నాకు చెప్పాడు. ఇలాంటి అనుమానాలు ఎందుకొస్తాయి? ఇది నాఊరు గూడూ రు అని చెప్పుకోవడానికి ఆ ఊళ్లో భూమ న్నా, ఇల్లన్నా ఉండా లి. నేను ఉపాధ్యాయ వృత్తిలో ఉద్యోగం చేస్తూ ఏ ఊరికి బదిలీ అయితే అక్కడే ఉండేవాణ్ణి. సెలవుల్లో కూడా అక్క డే ఉండేవాణ్ణి. సెలవుల సమయంలో ఆ చుట్టుపక్కల ఊళ్లల్లోని ప్రజలతో కలిసేవాణ్ణి. పిల్లలు కూడా తమ ఊళ్లకు నన్ను వేసవి సెలవుల్లో తీసుకుపోయేవారు. దీని వలన ఆ పిల్లల తల్లిదంవూడుల జీవన విధానం చూసే అవకాశం లభించింది. క్లాసురూములో చదువు చెప్పేటప్పుడు స్థానిక సమస్యలతోనే ఆనాటి పాఠాన్ని ఆరంభించేవాణ్ణి. ఉపాధ్యాయునికి కేవలం సబ్జెక్ట్ రావటమే కాదు, ఆ పిల్లల నేపథ్యం కూడా తెలిసి ఉండాలి. ఆ నేపథ్యాన్ని చెప్పుకుంటూ, వారి గ్రామాల్లోని సంఘటనలను గుర్తుచేస్తూ పాఠం చెబితే విద్యార్థి తన పరిసరాలను తన జీవితానికి సంబంధించినదనుకుని ఆ చదువుపై శ్రద్ధను చూపుతాడు. నేడు ప్రభుత్వ స్కూళ్లలోకి దళితులు, గిరిజనులు, పేదవర్గాలు, బహుజన వర్గాలకు చెందిన పిల్లలు ఎక్కువగా వస్తున్నారు. ఆ పిల్లలందరినీ క్రమం తప్పకుండా బడులకు తేవాలని ప్రభుత్వం ఎంత ప్రయత్నం చేసినా వారిలో 60 శాతానికి మించి అక్షరాస్యత పెరగటం లేదు. దానికి కారణం ఏమిటి? పిల్లలు తమ జీవితాలను ఆ పుస్తకా ల్లో చూసుకోవటం లేదు.

పాఠ్యపుస్తకాల ముద్రణ విషయంలో నేటికీ పాత పద్ధతులనే అవలంబిస్తున్నారు. పాఠ్య పుస్తకాలకు సంబంధించి సిలబస్‌ల రూపకల్పనలో సాంప్రదాయబద్ధంగానే కొనసాగుతున్నారు. ఈ విధానం లో మార్పులు తేకపోతే చదువు అన్ని వర్గాల వాకిళ్లలోకి పోలేదు. దీనికోసం ప్రభుత్వమే పెద్ద కృషి చేయవలసి ఉంది. ఈ పని ఎన్నిసార్లు చెప్పినా ప్రభు త్వం పెడచెవిన పెడుతోంది. ప్రాథమికస్థాయిలో విద్యార్థికి పరిసరాలతో ఎంతో సంబంధం ఉంటుంది. ప్రాథమిక పాఠ్యాంశాల తయారీలో స్థానిక వ్యవహారిక భాషను ఉపయోగించాలి. అప్పుడు విద్యార్థి ఇబ్బంది పడడు. పాఠం చదువుతుంటే అది తనకు బాగా తెలిసిన విషయ మే అన్నట్లుగా విద్యార్థి ఫీల్ కావాలి. తన జీవితమనుకుంటే పాఠ్యపుస్తకా న్ని, పాఠశాలని విద్యార్థి వదిలిపెట్టడు. ఇది ఆచరణాత్మకంగా, ఒక ఉపాధ్యాయుడిగా 60 ఏళ్లలో నేను గమనించిన అంశం. అందుకే ఇంటిభాష ప్రాథమిక స్థాయి లో ప్రవేశపెట్టాలని కొంతకాలం ప్రభుత్వంతో పెనుగులాడాను. ఫలితం మాత్రం రాలేదు. పాఠ్యపుస్తకాల తయారీ అంటే ఏదో పదిమంది టీచర్లు కలిసి పాఠ్యపుస్తకాన్ని తయారు చేసి ఇవ్వటమే కాదు అన్ని ప్రాంతాల విద్యార్థులకు వారివారి మాతృభాషల్లో పాఠ్యపుస్తకాలు తయారుచేయాలి. ఆ పని చేయటం అంత సులభమైనదేమీ కాదు. దాని కోసం సుదీర్ఘమైన అధ్యయనం, పరిశోధన నిరంతరం కొనసాగాలి. పుస్తకాల ముద్రణ కోసం తెలుగు అకాడమీని ఏర్పాటు చేసుకున్నాం.

raju29-talangana patrika telangana culture telangana politics telangana cinema
తెలంగాణ భాష , ఆచారాలు, ఈ ప్రాంత విశిష్టత, తరతరాల తెలంగాణ, సంస్కృతి, ఇక్కడి ప్రజల వ్యక్తిత్వాలు, వృత్తులు, ఆలోచనా విధానాలు, సంప్రదాయాల గురించి చెప్పే ప్రయత్నం ఇప్పటివరకు తెలు గు అకాడమీ చేయలేదు. ఇంటర్, డిగ్రీ, తదితర పాఠ్యపుస్తకాలు ముద్రణ చేయటం, వాటిని విక్రయించటం దీనికే తెలుగు అకాడమీ కాలమంతా సరిపోతోంది. ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. వాటిని అకాడమీ వెలుగులోకి తేలే దు. తెలుగు సమాజంలో భిన్న కోణాలను, భిన్న సంస్కృతులను వెలుగులోకి తేవడంలో తెలుగు అకాడమీ చేయవలసిన కృషి ఎంతో ఉంది. బతుకమ్మ పండుగ గురించి ఇక్కడి ప్రజలు ఆందోళన చేస్తే గత ఏడాది ఢిల్లీలో రిపబ్లిక్ డే సందర్భంగా బతుకమ్మను ప్రదర్శనగా పెట్టారు. ఇక్కడి ప్రజలు ఆందోళన చేయకముందే ఆ బాధ్యతను తెలుగు అకాడమీ భుజం మీద వేసుకొని నిలబడి ఉంటే బాగుండేది. బతుకమ్మకు సంబంధించిన, తెలంగాణ సంస్కృతికి సంబంధించిన అనేక విషయాలను వెలుగులోకి తేవాలి. ఈ పనిని బిఎన్ శాస్త్రి కొంత వరకు చేశారు. అకాడమీ చేయాల్సిన పనిని బిఎన్ శాస్త్రి తన రెండు చేతులతో నెత్తికెత్తుకున్నారు. ఇంకా తెలంగాణ జనపదాలకు సంబంధించిన పరిశోధన ప్రొ. జయధీర్ తిరుమలరావు నేటికీ కొనసాగిస్తున్నారు. ఈ పనిని అకాడమీ తన భుజాలపై వేసుకోవాలి.



నేను మహబూబ్‌నగర్‌కు బదిలీ అయినప్పుడు బస్‌స్టాండ్‌లో దిగి స్కూల్ ఎక్కడ అని అడిగాను. వాళ్లు చెప్పలేదు. ఒక కండక్టర్ వచ్చి సారు ‘శాల’ ఎక్కడని అడుగుతున్నారన్నాడు. బడిని కన్నడంలో ‘శాల’ అంటార ని చెప్పాడు. ఏమి ‘బీకు’ అన్నాడు. అంటే ఏమి కావాలన్నాడు. కన్నడ ప్రభావం మహబూబ్‌నగర్ జిల్లా మీద, అక్కడి భాష మీద ఉన్నది. ఇది చిన్న విషయమే కావచ్చును. అదే నిజామాబాద్, ఆదిలాబాద్ వెళితే మహారాష్ట్ర మరాఠీ భాష ప్రభావం కనిపిస్తుంది. అదే నల్లగొండ జిల్లా సరిహద్దు కోదాడకు వెళితే కృష్ణా జిల్లా ప్రభావం కనిపిస్తుంది. మిర్యాలగూడ వెళితే గుంటూరు జిల్లా ప్రభావం కనిపిస్తుంది. తెలంగాణ భాష వంకర భాష కాదు. ఇతర భాషలను జీర్ణం చేసుకునే విస్తృతి ఉన్న భాష. టీచర్ ఆ భాషలో, ఆ యాస లో మాట్లాడితేనే విద్యార్థి వింటాడు. విషయాన్ని తొందరగా అర్థం చేసుకోగలుగుతాడు. ఆ యాస భాషల్లోనే టీచర్ మాట్లాడాలి. అప్పుడే పిల్లలు మనం చెప్పే చదువు లో తన జీవితాన్ని చూసుకుంటారు. తమ పరిసరాలను పోల్చుకుంటారు. ముఖ్యంగా ప్రాథమిక దశలో ఇంటి భాషకు, స్కూల్ భాషకు దూరం పెరగకూడదు. ఇది మనదేశంలోనే కాదు, ఇంగ్లాండులో కూడా స్కాట్‌లాండ్ భాష ఒక రకంగా ఉండదు. ఆంధ్రవూపదేశ్ ఏర్పడిన నాటినుంచి మన వాళ్లు ఈ ప్రయత్నం చేయకపోవటం వల్లనే మన పాఠ్యాంశాలు సామాన్యుల జీవితాల్లోకి చొచ్చుకుపోలేకపోయాయి. వాళ్ల భాషను గేలి చేస్తే ఆ సంబంధిత వర్గాలు దూరమైపోతాయి. బడి పెట్టగానే సరిపోదు. విద్యావ్యాప్తి జరగాలంటే ఆ ప్రాంతంలో లీనమైపోవాలి. అందు కే ఇది మిషనరీలా పనిచేయాలి. ఇతర దేశాల క్రైస్తవులు మన దగ్గరికి వచ్చినప్పుడు విద్యావ్యాప్తి కోసం భాషనే కాదు, ఆ ప్రాంత ప్రజలు మాట్లాడే భాషను అలవర్చుకున్నారు. వారి జీవితాలను ఆకళింపు చేసుకున్నారు. అదే తరగతి గదిలో మాట్లాడారు. తనున్న సమాజంలో టీచర్ గర్భితం కావాలి. అప్పుడే విద్యార్థి టీచర్ చెప్పే పాఠంలోకి వెళ్లగలుగుతాడు. ఇప్పటికైనా తెలుగు అకాడమీ వారు అన్ని ప్రాంతాల సంస్కృతులను ప్రతిబింబించే విధంగా అన్ని ప్రాంతాల భాషలపై పరిశోధనలు చేయాలి. ఒకటి నుంచి ఏడవ తరగతి వరకు పాఠ్య పుస్తకాలలో పాఠ్యాంశాలను ఇంటిభాషలోనే రాసేందుకు పాఠశాల విద్యాశాఖ తీర్మానించాలి. ఇది ఎంత తొందర గా చేస్తే అంత మంచిది. దీని వల్ల విద్యార్థుల డ్రాప్ అవుట్‌లను తగ్గించవచ్చును. అప్పుడే మన ప్రాథమిక విద్య గడపదాటుతుంది.
-చుక్కా రామయ్య ప్రముఖ విద్యావేత్త, శాసనమండలి సభ్యులు