పుణె, నవంబరు 14: ప్రఖ్యాత రచయిత్రి, కార్టునిస్టు ఆర్కే లక్ష్మణ్ భార్య కమలా లక్ష్మణ్ శనివారం పుణెలో కన్నుమూసారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె వయసు 89 సంవత్సరాలు. ఈ ఏడాది జనవరిలో ఆర్కే లక్ష్మణ్ మరణించిన విషయం తెలిసిందే! ఆయన మృతితో కమలా లక్ష్మణ్ కృంగిపోయారని, అప్పటి నుంచి పలు సమస్యలతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. ఆర్కే లక్ష్మణ్ చివరి దశలో తరచూ ఆస్పత్రి పాలయినపుడు సరైన వైద్య సహాయం అందేలా ఆమె ఎంతో శ్రద్ధ తీసుకున్నారని చెప్పారు. చక్రాల కుర్చీకే పరిమితమైనప్పటికీ కామన్ మ్యాన్ సృష్టిలో ఆర్కేకు కమల ఎంతగానో సహకరించారని వివరించారు.