హైదరాబాద్ సిటీ, ఆంధ్రజ్యోతి: మీర్ యూసుఫ్ అలీఖాన్ (మూడో సాలార్ జంగ్).. కళాఖండాల సేకరణకే తన జీవితాన్ని ధారపోశారు. నిజాం నవాబు వద్ద ప్రధానిగా... 1889 నుంచి 1949 వరకు... కీలక బాధ్యతలు నిర్వర్తించిన యూసుఫ్ అలీఖాన్.. దేశ విదేశా ల్లో పర్యటించి అద్భుతమైన కళాఖండాలను సేకరించారు. అరుదైన కళాఖండం ఎక్కడైనా ఉందని తెలిస్తే చాలు దాన్ని సాధించి తన ఎస్టేట్ (దివాన్ దేవిడి)లో ఉంచేవారు. కళాఖండాల సేకరణకు.. వైవాహిక జీవితం విఘాతం కలిగిస్తుందన్న కారణంతో బ్రహ్మ చారి జీవితం గడిపారు. కళాఖండాల సేకరణ కోసం ఖర్చుకు ఏ మాత్రం వెనుకాడేవాడు కారు. ఇలా కళాఖండాలు కొలువు తీరిన దివాన్ దేవిడి.. కాల క్రమంలో సాలార్జంగ్ మ్యూజియంగా ప్రసిద్ధి చెందింది.