హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 80వ స్నాతకోత్సవం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్నాతకోత్సవానికి గవర్నర్ నరసింహన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. వర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈసందర్భంగా 850 మందికి పీహెచ్డీ పట్టాలు, వివిధ అంశాల్లో ప్రతిభ కనబర్చిన 292 మందికి బంగారు పతకాలను అందజేయనున్నారు. ఆరేళ్ల క్రితం 79వ స్నాతకోత్సవాన్ని 2013లో నిర్వహించారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన స్నాతకోత్సవం సాయంత్రం 5 వరకు కొనసాగనుంది.