రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఛైర్ పర్సన్ గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎం.సీతారామ మూర్తి
రాష్ట్ర మానవహక్కుల కమిషన్ ఛైర్ పర్సన్, సభ్యుల ఎంపికపై రాష్ట్ర మానవ హక్కుల కమిటీ ఛైర్ పర్సన్, సీఎం వైయస్.జగన్ అధ్యక్షతన బుధవారం సచివాలయంలో సమావేశం జరిగింది. కమిటీ సభ్యులు శాసనమండలి ఛైర్మన్ ఎం ఏ షరీఫ్, శాససనభ స్పీకర్ తమ్మినేని సీతారాం, హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత హాజరయ్యారు.
రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఛైర్ పర్సన్, సభ్యుల పేర్లను హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత ప్రతిపాదించగా ఎంపిక కమిటీ ఆమోదం తెలిపింది.రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఛైర్ పర్సన్ గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎం.సీతారామ మూర్తి, సభ్యులుగా విశ్రాంత జిల్లా న్యాయమూర్తి దండే సుబ్రహ్మణ్యం(జ్యుడీషియల్), న్యాయవాది డాక్టర్ జి శ్రీనివాసరావు (నాన్ జ్యుడీషియల్) నియమించబడ్డారు.