రొమాంటిక్‌ థ్రిల్లర్‌

19 Sep, 2017 13:02 IST|Sakshi
రొమాంటిక్‌ థ్రిల్లర్‌

చంద్రకాంత్, రాధికా మెహరోత్రా, పల్లవి డోరా ముఖ్య తారలుగా రఘురాం రొయ్యూరుతో కలిసి గోవర్ధన్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సినిమా ‘ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం’. ఈ సిన్మా టీజర్‌ను హీరో నారా రోహిత్‌ విడుదల చేశారు. ‘‘టీజర్‌ చాలా ఆసక్తిగా ఉంది. ప్రేక్షకులను థ్రిల్‌కు గురి చేసే అంశాలున్నాయి.

సినిమా మంచి హిట్టవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అన్నారు నారా రోహిత్‌. ‘‘ఇదొక అందమైన రొమాంటిక్‌ థ్రిల్లర్‌ మూవీ. ఈ వారంలో పాటల్ని, ఈ నెల 15న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు గోవర్ధన్‌. చంద్రకాంత్, రాధికా మెహరోత్రా, పల్లవి డోరా తదితరులు పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి