సమాచారమిస్తే..చావ బాదారు
Published Tuesday, 18 July 2017కరీంనగర్, జూలై 17: సమాచారమిస్తే చావ బదుతారా..? సంబంధం లేని వ్యక్తులపై కేసులు పెట్టి చిత్రహింసలకు గురిచేస్తారా..? పైగా బయటకు చెబితే ఎన్కౌంటర్ చేస్తామంటూ బెదిరిస్తారా..? ఇది ప్రజాస్వామ్యమా ? లేక రాచరిక రాజ్యమా ? అంటూ దళిత కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. దళితులపై అక్రమంగా కేసులు పెట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగించిన రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులపై కేసు నమోదు చేయడమేకాక కమిషన్ వేసి విచారణ జరిపించాలని, అక్రమంగా పెట్టిన కేసులను భేషరతుగా తీసివేయాలని డిమాండ్ చేశారు.