Monday, June 19, 2023

CM KCR: తొమ్మిదో విడత హరితహారం.. తుమ్మలూరులో మొక్కలు నాటిన కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్‌ హరితహారం తొమ్మిదో విడత కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా హరితోత్సవం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా తుమ్మలూరు అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కులో మొక్కను నాటి తొమ్మిదో విడత హరితహారానికి సీఎం కేసీఆర్‌ శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్‌ రెడ్డి, ఎంపీ రంజిత్‌ రెడ్డి, రాచకొండ సీపీ చౌహాన్‌, ప్రభుత్వ ఉన్నత అధికారులు పాల్గొన్నారు. అంతకు ముందు సఫారీ వాహనంలో పార్కులో కలియతిరిగిన సీఎం కేసీఆర్‌.. ఫొటో ఎగ్జిబిషన్‌ను, అటవీ అధికారుల సామాగ్రిని తిలకించారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement