Updated : 14/01/2022 19:51 IST
AP News: పొగాకు బోర్డు సభ్యుడిగా జీవీఎల్ నరసింహారావు నియామకం
గుంటూరు: పొగాకు బోర్డు సభ్యుడిగా ఎంపీ జీవీఎల్ నరసింహారావు నియమితులయ్యారు. 14 డిసెంబరు 2021న రాజ్యసభలో ఆమోదించిన తీర్మానం మేరకు పొగాకు బోర్డు సభ్యుడిగా జీవీఎల్ ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని రాజ్యసభ సెక్రటేరియట్ లిఖితపూర్వకంగా ఆయనకు తెలియజేసింది. ఈసందర్భంగా జీవీఎల్ మాట్లాడుతూ...పొగాకు రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్టు చెప్పారు. పొగాకు ఎగుమతుల ప్రోత్సాహానికి ప్రయత్నిస్తానని తెలిపారు. లోక్సభ నుంచి పొగాకు బోర్డు ప్రతినిధులుగా బండి సంజయ్(తెలంగాణ), వి.బాలశౌరి(ఏపీ) ఉన్నారు.
► Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.
Advertisement
Tags :