రఘునాథ్కే భాజపా అభ్యర్థిత్వం..
భారతీయ జనతా పార్టీ మంచిర్యాల నియోజకర్గ అభ్యర్థిగా వెరబెల్లి రఘునాథ్ను ఆ పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. మొదటినుంచి ఉత్కంఠ కొనసాగించిన అధిష్ఠానం ఎట్టకేలకు రఘునాథ్ వైపే మొగ్గు చూపింది.
మంచిర్యాల అర్బన్, న్యూస్టుడే: భారతీయ జనతా పార్టీ మంచిర్యాల నియోజకర్గ అభ్యర్థిగా వెరబెల్లి రఘునాథ్ను ఆ పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. మొదటినుంచి ఉత్కంఠ కొనసాగించిన అధిష్ఠానం ఎట్టకేలకు రఘునాథ్ వైపే మొగ్గు చూపింది. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, స్వచ్ఛంద సేవ కార్యక్రమాలతో నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ఆయన పార్టీ బలోపేతానికి కృషి చేశారు. ఆర్ఎస్ఎస్తో పాటు కేంద్ర, రాష్ట్రస్థాయిలో ఉన్న నాయకులతో మంచి పరిచయాలు ఉన్నాయి. 2018 ఎన్నికల్లో భాజపా తరఫున పోటీచేశారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన భారాస అభ్యర్థి నడిపెల్లి దివాకర్రావు, కాంగ్రెస్ అభ్యర్థి కొక్కిరాల ప్రేంసాగర్రావుతో మరోసారి తలపడనున్నారు. 2014లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ప్రస్తుత భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ముల్కల్ల మల్లారెడ్డి పలు ప్రయత్నాలు చేసినా నిరాశే మిగిలింది. మరోవైపు బీసీ వాదం ఉన్నందున భాజపా తరఫున బీసీ వర్గానికి చెందిన వారికి పార్టీ టికెట్ వస్తుందన్న ఊహాగానాలని తేలిపోయాయి.
బయోడెటా...
వెరబెల్లి రఘునాథ్
వయస్సు: 51
స్వస్థలం: మంచిర్యాల
తల్లిదండ్రులు: తిరుపతిరావు, రాజ్యలక్ష్మి
భార్య: స్రవంతి (గృహిణి)
పిల్లలు: అరుణిమ(ఎంబీబీఎస్ ప్రథమ సంవత్సరం), అన్విత (ఇంటర్ ద్వితీయ సంవత్సరం)
విద్యాభ్యాసం: ఇంజినీరింగ్ దిల్లీ విశ్వవిద్యాలయం, ఎంబీఏ అమెరికాలో పూర్తిచేశారు.
2010లో అమెరికా నుంచి హైదరాబాద్కు వచ్చి ప్రైవేటు సాఫ్ట్వేర్ సంస్థను ప్రారంభించారు. సేవాభారతి, యూత్ఫర్ సేవ, రఘునాథ్ వెరబెల్లి స్వచ్ఛంద సంస్థల ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఖరారు కాని చెన్నూరు
చెన్నూరు, చెన్నూరు గ్రామీణం, న్యూస్టుడే: భాజపాను వీడి గడ్డం వివేక్ కాంగ్రెస్లో చేరడంతో ఆ పార్టీ టికెట్ ఆయనకే ఖరారైనట్లు తెలుస్తోంది. ఇక భాజపా అభ్యర్థిత్వం అధిష్ఠానం ఖరారు చేయకపోవడంతో ఆ పార్టీ శ్రేణులు అయోమయానికి గురవుతున్నారు. గురువారం పార్టీ అధిష్ఠానం ప్రకటించిన మూడో జాబితాలో చెన్నూరు పేరు లేకపోవడంపై సందిగ్ధత నెలకొంది. ఉమ్మడి జిల్లాలో తొమ్మిది నియోజకవర్గాల అభ్యర్థులను ఖరారు చేసిన భాజపా అధిష్ఠానం చెన్నూరును పెండింగ్లో ఉంచింది. వివేక్ కాంగ్రెస్లో చేరడంతో పార్టీ టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు నిరాశకు గురయ్యారు. ఈ తరుణంలో ఆయనను భాజపా అధిష్ఠానం సంప్రదించి పార్టీలోకి రావాలని కోరినట్లు తెలిసింది. అందుకు ఆయన నిరాకరించినట్లు విశ్వసనీయ సమాచారం. భాజపా అధిష్ఠానం మరో ముగ్గురు అభ్యర్థుల పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యాసంగిపైనే.. రైతన్న ఆశలు!
[ 17-12-2023]
ఉమ్మడి జిల్లాలో అవసరం మేరకు వర్షాలు కురవడంతో.. జలాశయాలు, చెరువులు నిండుగా ఉన్నాయి. వానాకాలంలో కాలం కలిసి రాకపోవడంతో ఆశించిన దిగుబడులు రాక నష్టపోయిన రైతులు యాసంగి సాగుపై ఆశలు పెట్టుకున్నారు. -
పురుష పుంగవులు ముందుకొస్తేనే..!
[ 17-12-2023]
వెసక్టమీ కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు పెంచటానికి వైద్య శాఖ విస్తృతంగా సమావేశాలు నిర్వహించి ఈ దిశలో పురుషులను ప్రోత్సహించాలంటూ సూచనలు చేస్తున్నారు. -
పత్తాలేని ఫౌండేషన్ సభ్యులు
[ 17-12-2023]
నిరుద్యోగుల ఆశలను కాసులుగా మార్చుకుని.. మరింత మందిని తమ వలలో పడేయాలన్న కాస్ ఫౌండేషన్ సభ్యుల కుట్రలకు అడ్డుకట్ట పడింది. -
మందలించినా.. మారని నైజం!
[ 17-12-2023]
మరో మూడు నెలలు గడిస్తే ఆ అధికారికి జిల్లాలో మూడేళ్ల పదవీకాలం పూర్తవుతుంది. వారంలో మూడు రోజులకు మించి పనిచేయని ఘనత ఆయన సొంతం. -
అన్నదాతా.. సుఖీభవ
[ 17-12-2023]
ఆ రెండు స్వచ్ఛంద సంస్థలే.. అంతర్జాతీయ స్థాయిలో శాఖలున్నాయి. సేవలు కూడా అందిస్తున్నాయి. అన్నం పరబ్రహ్మం అనే మాటలను స్ఫూర్తిగా తీసుకుని మంచిర్యాల జిల్లాకు చెందిన సంబంధిత సంస్థల శాఖలు అన్నదాన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాయి -
కళ చిన్నది.. గుర్తింపు పెద్దది..!
[ 17-12-2023]
అబ్బురం.. నిర్మల్ కళాకారుడి ప్రతిభ నిర్మల్ పట్టణం, న్యూస్టుడే: కళ.. మనలోని ప్రతిభను బయటపెట్టి నలుగురిలో స్థానం కల్పించేది. ఒక్కొక్కరూ ఒక్కో అంశంలో ఎంతోకొంత నైపుణ్యం కలిగి ఉంటారు -
చేయితడిపితేనే రుణం..దోపిడే ప్రధానం
[ 17-12-2023]
పంట పెట్టుబడి కోసం కర్షకులు బ్యాంకుల్లో తీసుకునే రుణాల్లోనూ వసూళ్ల పర్వం మొదలైంది. బ్యాంకుల్లో తిష్ఠ వేసిన దళారులకు కొందరు సిబ్బంది సహకరిస్తుండటంతో రైతులు నిలువుదోపిడీకి గురవుతున్నారు -
ఎట్టకేలకు ప్రాణహితకు ప్రాణం
[ 17-12-2023]
సింగరేణి గుర్తింపు ఎన్నికల సందర్భంగా కార్మిక సంఘాలన్నీ భారీ హామీలతో కార్మికుల ముందుకొస్తున్నాయి. గత ఎన్నికలకు భిన్నంగా ఈ సారి సంఘాలు ఆచితూచి ప్రచారం చేస్తున్నాయి. -
ఎట్టకేలకు ప్రాణహితకు ప్రాణం
[ 17-12-2023]
జిల్లాలోని కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తామని శనివారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రస్తావించడంతో ఆయకట్టు రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. -
ప్రత్యేక నిధుల పనులు నిలిపివేత..!
[ 17-12-2023]
ఎన్నికలకు ముందు మంచిర్యాల పురపాలక సంఘానికి అప్పటి సీఎం కేసీఆర్ మంజూరు చేసిన రూ.25 కోట్లతో 345 వివిధ అభివృద్ధి పనులు చేయడానికి ప్రతిపాదనలు చేశారు. -
టమాటాలు దొంగిలించాడని కట్టేసి దాడి
[ 17-12-2023]
కూరగాయల మార్కెట్లో టమాటాలు దొంగిలించాడనే నెపంతో ఓ వ్యక్తిపై దాడి చేసిన ఘటన శనివారం మంచిర్యాల పట్టణంలో చోటు చేసుకుంది. స్థానిక సీఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం దండేపల్లి మండలం రెబ్బెన గ్రామానికి చెందిన జాడి గంగులు క్లీనర్గా పని చేస్తున్నాడు -
పనిచేయించుకున్నారు..పైసలివ్వడం లేదు..
[ 17-12-2023]
మా డబ్బులు ఎప్పుడిస్తారు. ఇతర జిల్లాల్లో ఇప్పటికే అందరికీ ఇచ్చేశారు. మాకు మాత్రం చెల్లించడం లేదు. మమ్మల్నెందుకు ఇబ్బందిపెడుతున్నారు. ఇంకెన్ని రోజులు కార్యాలయం చుట్టూ తిరగాలి. -
అంబరాన్నంటుతున్న శీతాకాల సంబరాలు
[ 17-12-2023]
శీతాకాల సంబరాల్లో భాగంగా ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో పర్యాటకుల సందడి మిన్నంటుతోంది. రామోజీ వింటర్ ఫెస్ట్ వేడుకలు శుక్రవారం ఆరంభం కాగా.. శనివారం సందర్శకులతో ఫిల్మ్సిటీ కోలాహలంగా దర్శనమిచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
Manchu Manoj: తండ్రి కాబోతున్న మంచు మనోజ్.. ట్వీట్ చేసిన నటుడు
-
MI-Rohit: ముంబయి కెప్టెన్గా రోహిత్ తొలగింపు.. సోషల్ మీడియాలో రితికా ఫస్ట్ రియాక్షన్ ఇదే
-
Social Look: నయన్ - విఘ్నేశ్ పూజలు.. సంగీత్లో పూజ మెరుపులు..!
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (17/12/2023)