YS Sharmila: కాంగ్రెస్లో చేరిన వైఎస్ షర్మిల
వైఎస్సార్ తెలంగాణ పార్టీ (వైతెపా) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) కాంగ్రెస్ పార్టీలో చేరారు.
దిల్లీ: వైఎస్సార్ తెలంగాణ పార్టీ (వైతెపా) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) కాంగ్రెస్ (Congress) పార్టీలో చేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆమెకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. బుధవారం విజయవాడ నుంచి దిల్లీ చేరుకున్న ఆమె.. గురువారం ఉదయం తన భర్త అనిల్తో కలిసి ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ సమక్షంలో ఆమె కాంగ్రెస్లో చేరారు. దీంతో వైతెపాను హస్తం పార్టీలో విలీనం చేసినట్లయింది.
ఏ బాధ్యత అప్పగించినా శక్తివంచన లేకుండా పనిచేస్తా: షర్మిల
వైతెపాను కాంగ్రెస్లో విలీనం చేయడం సంతోషంగా ఉందని వైఎస్ షర్మిల అన్నారు. ఇవాళ్టి నుంచి కాంగ్రెస్లో వైతెపా ఒక భాగమని చెప్పారు. కాంగ్రెస్లో చేరిన అనంతరం ఆమె మాట్లాడారు. ‘‘వైఎస్సార్ తన జీవితమంతా కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేశారు. మా నాన్న అడుగుజాడల్లోనే నడుస్తున్నా. దేశంలో అతిపెద్ద లౌకిక పార్టీ కాంగ్రెస్. కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలకూడదనే తెలంగాణ ఎన్నికల్లో వైతెపా పోటీ చేయలేదు. రాహుల్గాంధీని ప్రధానిగా చూడటం మా నాన్న కల. అది నెరవేర్చడానికి మనస్ఫూర్తిగా పనిచేస్తాను. పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా శక్తివంచన లేకుండా కృషిచేస్తా’’ అని షర్మిల అన్నారు.
కాంగ్రెస్లో షర్మిల చేరిన నేపథ్యంలో ఆమెకు పార్టీ ఏ బాధ్యతలు అప్పగిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఏఐసీసీలో పదవి ఇస్తారా? ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగిస్తారా? అనేదానిపై జోరుగా ఊహాగానాలు కొనసాగుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Nara Lokesh: మునిగిపోయే వైకాపా నావను ఏ శక్తీ కాపాడలేదు: లోకేశ్
అభ్యర్థులు పారిపోయినా, సీట్లు మార్చినా మునిగిపోయే వైకాపా నావ (YSRCP)ను ఏ శక్తీ కాపాడలేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) అన్నారు. -
Nara Bhuvaneswari: తెదేపా కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన నారా భువనేశ్వరి
తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) చేపట్టిన ‘నిజం గెలవాలి’ యాత్ర కొనసాగుతోంది. -
Bellampalle: బెల్లంపల్లిలో హీటెక్కిస్తున్న క్యాంపు రాజకీయాలు..
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీలో క్యాంపు రాజకీయాలు ప్రారంభమయ్యాయి. అవిశ్వాసంలో నెగ్గేందుకు భారాస, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కౌన్సిలర్లు ఎవరికి వారు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. -
Revanth Reddy: దిల్లీ వెళ్లిన సీఎం రేవంత్.. నామినేటెడ్ పదవులపై స్పష్టత వచ్చేనా?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో కలిసి బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో దిల్లీ బయలుదేరి వెళ్లారు. -
Congress: కాంగ్రెస్ వైపు.. మరో వైకాపా ఎమ్మెల్యే చూపు!
వైతెపా అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్లో చేరనున్న నేపథ్యంలో... ఆమెతోపాటు తానూ కాంగ్రెస్లో చేరతానని మంగళగిరి వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. -
వైకాపాలో ఉన్నందుకు.. సిగ్గుగా లేదా అని జనం నిలదీస్తున్నారు: సర్పంచుల ఆవేదన
జగన్ పాలనలో గ్రామాల్లో కనీసం గుంతలు పూడ్చలేని, చెత్త ఎత్తించలేని, పింఛను ఇప్పించలేని దుస్థితిలో తామున్నామని వైకాపా సర్పంచులు ధ్వజమెత్తారు. అధికారపార్టీలో ఉన్నావు.. కనీసం బ్లీచింగ్ వేయడానికీ నిధులు తేలేవా, సిగ్గుగా లేదా? అని ప్రజలు నిలదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
Arvind Kejriwal: కేజ్రీవాల్ అరెస్టు అవుతారా? ఆప్ నేతలు ఏమంటున్నారంటే..
Arvind Kejriwal: ఇప్పటికే పలుసార్లు ఈడీ విచారణకు అరవింద్ కేజ్రీవాల్ గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన అరెస్ట్పై ఊహాగానాలు జోరందుకున్నాయి. -
Chandrababu: మీ ఇంట్లో మీరు చిచ్చుపెట్టుకుని మమ్మల్ని విమర్శిస్తారా?
‘మీ ఇంట్లో మీరు చిచ్చుపెట్టుకుని మాపై పడతారేంటి? అది మీ కుటుంబ వ్యవహారం. మాకేం సంబంధం? మీ తల్లి, మీ చెల్లి.. మీరు చూసుకోవాలి. ఏదో ఒకలా వేరేవాళ్లపై బురద చల్లడం రాజకీయం కాదు’ అని సీఎం జగన్పై తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. -
‘జగన్ ఇబ్బంది పెట్టడం వల్లే రాష్ట్ర రాజకీయాల్లోకి షర్మిల’
ఏపీ రాజకీయాలపై షర్మిలకు ఆసక్తి లేదని.. అన్న జగన్ ఇబ్బందులు పెట్టడం వల్లే ఆమె రాష్ట్ర రాజకీయాల్లోకి వస్తున్నారని తెదేపా మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి వెల్లడించారు. -
Jagga Reddy: ఓడిపోతానని ఆరు నెలల ముందే తెలుసు: జగ్గారెడ్డి
అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గంలో ఓడిపోతానని ఆరు నెలల ముందే తనకు తెలుసని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. -
రాష్ట్రాన్ని భారాస దోచుకుంది
రాష్ట్రాన్ని భారాస ప్రభుత్వం దోచుకుందని పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు. బుధవారం ఇందిరాభవన్లో జరిగిన పీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు. -
తెలంగాణ నుంచి సోనియా పోటీ చేయాలి
వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలని కోరుతూ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పీసీసీ) తీర్మానించింది. -
కాంగ్రెస్ పార్టీవి 420 హామీలు
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు 420 ఉన్నాయని భారాస పేర్కొంది. ఆచరణ సాధ్యం కాని వాగ్దానాలు చేసి.. అధికారంలోకి వచ్చాక కాడి తన్నేసే కార్యక్రమం చేపట్టిందని ధ్వజమెత్తింది. -
పొత్తులు పెట్టుకుంటారు.. కుటుంబాలను చీలుస్తారు..
అర్హత ఒక్కటే ప్రామాణికంగా పింఛన్లు ఇస్తున్నామని.. సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా వివక్ష లేకుండా చూస్తున్నామని ముఖ్యమత్రి జగన్ అన్నారు. వైఎస్ఆర్ పింఛను కానుక పెంపు కార్యక్రమాన్ని బుధవారం కాకినాడలో సీఎం ప్రారంభించారు. -
మామ ఇంటి తలుపులు అందరికీ తెరిచే ఉంటాయ్: శివరాజ్ సింగ్
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, 16 ఏళ్లకు పైగా సీఎం హోదాలో సేవలు అందించి ‘మామ’గా ప్రజల అభిమానాన్ని చూరగొన్న భాజపా సీనియర్ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ తన నివాసానికి ‘మామా కా ఘర్’ అని నామకరణం చేశారు. -
ఇది కదా.. పెత్తందారీ పోకడ!
వైకాపాలో దళితులు, బడుగులనే బలి చేస్తున్నారని, వ్యతిరేకత ఉన్నా సీఎం సామాజికవర్గ నేతలను కొనసాగిస్తున్నారని పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు చెప్పిన మాటలు అక్షర సత్యాలుగా కనిపిస్తున్నాయి. -
ఇండియా కూటమి కన్వీనర్గా నీతీశ్!
విపక్షాల కూటమి ‘ఇండియా’ కన్వీనర్గా బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధ్యక్షుడు నీతీశ్ కుమార్ నియమితులు కానున్నట్లు తెలుస్తోంది. ఈ వారంలోనే విపక్ష పార్టీలన్నీ వర్చువల్గా సమావేశమై ఈ మేరకు ఖరారు చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. -
నేడు కాంగ్రెస్ అగ్రనేతల భేటీ
మరో మూడు నెలల్లో జరిగే లోక్సభ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు గురువారం దిల్లీలో సమావేశం కానున్నారు. -
ఏపీలో సీఎం జగన్పై వ్యతిరేకత
ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ పేర్కొన్నారు. ఏపీ కాంగ్రెస్కు వైఎస్ షర్మిల నాయకత్వం వహించే అవకాశాలున్నాయనీ, అదే జరిగితే వైకాపా నుంచి కొందరు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరతారన్నారు. -
బీసీల ఉన్నతికి కట్టుబడి ఉన్నాం
బీసీల సంక్షేమం, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
Bengaluru: హాఫ్ రేటుకు అమ్మాలని.. రూ.కోటి విలువైన బూట్లు కాజేసిన కేటుగాళ్లు
-
Nara Lokesh: మునిగిపోయే వైకాపా నావను ఏ శక్తీ కాపాడలేదు: లోకేశ్
-
Israel-Hamas Conflict: ‘వెంటనే ఆ దేశాన్ని వీడండి’: తమ పౌరులకు ప్రపంచ దేశాల హెచ్చరికలు
-
Nara Bhuvaneswari: తెదేపా కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన నారా భువనేశ్వరి
-
Jyoti CNC Automation IPO: జ్యోతి సీఎన్సీ ఐపీఓ ధరల శ్రేణి రూ.315-331
-
CM Jagan - KCR: భారాస అధినేత కేసీఆర్కు సీఎం జగన్ పరామర్శ