పశుపతి పరాస్ రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం.. కిరణ్ రిజిజుకు అదనపు బాధ్యతలు
బిహార్లో ఎన్డీయే కూటమి సీట్ల పంపకాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కేంద్ర మంత్రి పదవికి పశుపతి పరాస్ చేసిన రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు.
దిల్లీ: బిహార్ (Bihar)లో సీట్ల పంపకాల్లో తమ పార్టీకి భాజపా అన్యాయం చేసిందని ఆరోపిస్తూ కేంద్ర మంత్రి పదవికి రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ (RLJP) అధ్యక్షుడు పశుపతి కుమార్ పరాస్ చేసిన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపతిముర్ము ఆమోదించారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుకు పరాస్ నిర్వహించిన మంత్రిత్వ శాఖ అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
సార్వత్రిక ఎన్నికలకు తొలి నోటిఫికేషన్ విడుదల
బిహార్లో పొత్తులో భాగంగా చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీ (రాంవిలాస్) పార్టీకి ఎన్డీయే ఐదు సీట్లు కేటాయించింది. దీనిపై పశుపతి పరాస్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘ప్రధాని మోదీ గొప్ప నేత. ఆయనకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటా. కానీ, బిహార్లో ఎన్డీయే భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు విషయంలో మాకు అన్యాయం జరిగింది. మా పార్టీకి ఐదుగురు ఎంపీలు ఉన్నా.. పొత్తులో మాకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. అందుకే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నా’’ అని పేర్కొన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన్ను బిహార్లోని ప్రతిపక్ష కూటమికి ఆర్జేడీ ఆహ్వానించింది. ‘ఒకవేళ పశుపతి పరాస్ బిహార్ ప్రతిపక్ష కూటమిలోకి రావాలనుకుంటే.. మేము స్వాగతం చెప్పడానికి ఎప్పుడూ సిద్ధమే.’ అని ఆర్జేడీ నేత తేజ్ప్రతాప్ యాదవ్ అన్నారు.
మరోవైపు రాష్ట్రంలో మొత్తం 40 లోక్సభ స్థానాలు ఉండగా.. అత్యధికంగా భాజపా 17 స్థానాల్లో పోటీ చేయనుంది. సీఎం నీతీశ్ కుమార్కు చెందిన జేడీయూ 16 సీట్లలో పోటీ చేసేందుకు అంగీకారం కుదిరింది. మిగిలిన రెండు ఎన్డీయే భాగస్వామి పార్టీలైన హిందుస్థానీ అవామ్ మోర్చా, ఉపేంద్ర కుష్వాహాకు చెందిన రాష్ట్రీయ లోక్ మంచ్ పార్టీ చెరో ఒక్కో స్థానాల్లో పోటీ చేస్తాయని భాజపా బిహార్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి వినోద్ తాడ్వే వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘నన్ను క్షమించండి..నా మాటలు వెనక్కి తీసుకుంటున్నా’: కేంద్రమంత్రి పోస్టు
తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో కేంద్రమంత్రి శోభా కరంద్లాజే క్షమాపణలు చెప్పారు. -
Lok sabha Elections: సార్వత్రిక ఎన్నికలకు తొలి నోటిఫికేషన్ విడుదల
సార్వత్రిక ఎన్నికలకు (Lok sabha Elections 2024) తొలి నోటిఫికేషన్ విడుదలైంది. మొదటి విడతలో భాగంగా 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 లోక్సభ నియోజకవర్గాలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది. -
శరద్పవార్ వర్గానికే ‘ఎన్సీపీ-శరద్చంద్ర పవార్’ పేరు
మరాఠ్వాడా దిగ్గజ నేత శరద్పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ వర్గం పార్టీ పేరు, ఎన్నికల గుర్తు విషయంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం వెలువరించింది. -
రాందేవ్బాబా, బాలకృష్ణలపై సుప్రీం ఆగ్రహం
పతంజలి ఉత్పత్తుల వ్యాపార ప్రకటనలకు సంబంధించిన కోర్టు ధిక్కార నోటీసులకు ఆ కంపెనీ సమాధానం ఇవ్వకపోవడంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
పాలక్కాడ్లో మోదీ రోడ్షో
తమ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం కేరళలోని పాలక్కాడ్లో ఒక కి.మీ. మేర రోడ్షో నిర్వహించారు. -
హిట్లర్ను అరెస్టు చేసిన జాన్.ఎఫ్.కెనడీ
అదేంటీ.. నాజీ పాలకుడు, జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ను అమెరికా మాజీ అధ్యక్షుడు కెనడీ అరెస్టు చేశారా? అదెప్పుడు జరిగింది.. ఎలా సాధ్యమైంది? అనుకుంటున్నారా? 2008లో మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల వేళ వార్తల్లో నిలిచిన హెడ్లైన్ ఇది. -
General elections: నేను ఫలానా వారి భార్యను!
భారతదేశంలో మొట్టమొదటిసారి 1951-52లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్కు చిత్రమైన సమస్య ఎదురైంది. -
భారత్లో పెరిగిన చేపల వినియోగం
మారుతున్న ఆర్థిక పరిస్థితులు, మెరుగుపడుతున్న అభివృద్ధి నడుమ ప్రజల ఆహార అభిరుచుల్లోనూ మార్పులు వస్తున్నాయి. గత పదిహేనేళ్ల కాలంలో దేశంలో చేపల వినియోగం 81 శాతం పెరిగింది. -
ఎన్నిసార్లు వాదించినా వాస్తవాలు మారవు
అరుణాచల్ప్రదేశ్పై చైనా మొండి వాదనలు మానడం లేదు. ఆ ప్రాంతం తమ భూభాగంలోనిదేనన్న ఆ దేశ రక్షణ శాఖ అధికార ప్రతినిధి సీనియర్ కర్నల్ ఝాంగ్ షియాంగాంగ్ వ్యాఖ్యలను భారత్ తాజాగా తిప్పికొట్టింది. -
రాజ్యసభ సభ్యుడిగా సంజయ్సింగ్ ప్రమాణం
ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత సంజయ్ సింగ్ మంగళవారం రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశారు. -
అసభ్య పదజాల కంటెంట్ను అలా నియంత్రించలేం: సుప్రీం
సామాజిక మాధ్యమాలు, ఓటీటీ వేదికల్లో అసభ్య, అభ్యంతరకర భాషను నేరంగా పరిగణించడం ద్వారా ఆ పోకడను నియంత్రించలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. -
‘సివిల్స్’ ప్రిలిమినరీ పరీక్ష వాయిదా
అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించే యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష, ఫారెస్ట్ సర్వీస్ స్క్రీనింగ్ 2024 పరీక్షలు వాయిదా పడ్డాయి. -
నేడే తొలి నోటిఫికేషన్
సార్వత్రిక సమరం బుధవారం నుంచి ప్రారంభం కాబోతోంది. తొలి విడతలో భాగంగా 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 నియోజకవర్గాలకు నోటిఫికేషన్ వెలువడనుంది. -
వలస కూలీలకు రెండు నెలల్లోగా రేషన్ కార్డులివ్వండి
ఈ-శ్రమ్ పోర్టల్లో నమోదుచేసుకున్న వలస కార్మికులందరికీ రెండు నెలల్లోగా రేషన్ కార్డులివ్వాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. -
సీఏఏపై స్టే కోరుతూ పిటిషన్లు.. కేంద్రం స్పందనకు సుప్రీం ఆదేశం
దేశంలో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) 2019 చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు పరిష్కరించే వరకూ సీఏఏ 2024 నిబంధనల అమలు నిలిపివేయాలంటూ దాఖలైన 20 పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం విచారణ జరిపింది. -
రౌజ్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్పాల్ బదిలీ
దిల్లీ మద్యం కేసులను విచారిస్తున్న రౌజ్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్పాల్ బదిలీ అయ్యారు. -
సంక్షిప్త వార్తలు (11)
దేశంలో 1975లో విధించిన ఎమర్జెన్సీ కారణంగానే తాను రాజకీయాల్లోకి వచ్చానని భాజపా సీనియర్ నేత నితిన్ గడ్కరీ వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
Donald TrumpL: ప్రిన్స్ హ్యారీపై చర్యలు తీసుకొంటా: ట్రంప్
-
WhatsApp: త్వరలో వాట్సప్ స్టేటస్లో నిమిషం వీడియో!
-
KTR: పార్టీ ఫిరాయింపులపై ఉన్న దృష్టి.. పంట నష్టంపై ఏదీ?: కేటీఆర్
-
RamCharan: అట్టహాసంగా రామ్చరణ్ కొత్త సినిమా ప్రారంభం
-
Tamil Nadu: తూత్తుకుడి స్థానంలో కనిమొళి, నీలగిరి నుంచి రాజా: అభ్యర్థులను ప్రకటించిన డీఎంకే
-
IPL - WPL - PSL: ఐపీఎల్.. డబ్ల్యూపీఎల్ ప్రైజ్మనీతో పోలిస్తే పీఎస్ఎల్కు ఎంతంటే?